కొన్ని వారాల క్రితం దర్శకుడు మురుగదాస్ తన సికందర్ ఫెయిల్యూర్ గురించి ప్రస్తావిస్తూ సల్మాన్ ఖాన్ రాత్రి తొమ్మిది గంటల తర్వాత షూటింగ్ కు రావడం వల్లే చాలా సమస్యలు వచ్చాయని, అందువల్లే తాను అనుకున్న స్థాయిలో కంటెంట్ ఇవ్వలేకపోయానని నెపం మొత్తం కండల వీరుడి మీదకు తోసేశాడు. ఇది సల్లు భాయ్ అభిమానులకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. నాసి రకం కథ కథనాలతో ఇలాంటి సినిమా తీయడమే కాక నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న తమ హీరో మీద ఎన్నడూ లేని మచ్చ వేస్తావా అంటూ ఆయన మీద కయ్యిమన్నారు. ఇప్పుడు నేరుగా సల్మాన్ ఖాన్ రంగంలోకి దిగేశాడు.
బిగ్ బాస్ 13 షోలో ఒక ప్రశ్నకు సమాధానంగా మాట్లాడుతూ మురుగదాస్ మీద సూపర్ పంచులు వేసేశాడు. విపరీత గాయాల వల్ల నేను షూటింగ్ కి ఆలస్యంగా వస్తే దాన్ని ఇంకోలా చెప్పుకుని నెగటివ్ చేశారని, ముందు నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా తప్పుకుంటే ఆ తర్వాత సౌత్ సినిమా మదరాసి తీయడానికి మురుగదాస్ వెళ్లిపోయారని, అక్కడి యాక్టర్ సాయంత్రం ఆరు గంటలకే సెట్ కు వచ్చేవాడని, అందుకే అది సికందర్ కన్నా చాలా పెద్ద సినిమా ప్లస్ బ్లాక్ బస్టర్ అయ్యిందని గట్టిగా కౌంటర్ వేసేశాడు. మదరాసి ఫలితం అందరికీ తెలిసిందే. ఒరిజినల్ తమిళ వర్షన్ సైతం యావరేజ్ గా నిలిచింది.
ఇంత ఓపెన్ గా సల్మాన్ ఖాన్ పంచులు వేయడం చాలా అరుదు. ఒకవేళ మురుగదాస్ కనక తన ప్రమోషన్లలో సికందర్ ప్రస్తావన తేకపోయి ఉంటే ఇప్పుడీ గొడవ ఉండేది కానీ డైరెక్ట్ గా సల్మాన్ ఖాన్ మీద నింద వేయడం ఇక్కడి దాకా తెచ్చింది. విచిత్రంగా శివ కార్తికేయన్ ఈయనతో మరో సినిమా చేయడానికి ఆసక్తిగా ఉన్నారనే వార్త అభిమానుల్లో ఆల్రెడీ హాట్ టాపిక్ అయ్యింది. ఇది నిజమో కాదో కానీ ఫ్యాన్స్ మాత్రం వద్దు బాబోయ్ అంటున్నారు. అయినా హీరో సహకరించినా సహకరించకపోయినా కంటెంట్ కి బాధ్యుడు ముమ్మాటికి దర్శకుడే. సికందర్ కూ ఇదే వర్తిస్తుంది. మళ్ళీ దాస్ ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…