Movie News

బాలు మరపురాని సినిమా.. అమితాబ్ చేతికి?

ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గొప్ప గాయకుడే కాదు.. మంచి నటుడు కూడా. ఆయన చిన్న పాత్ర చేసినా దాంతో వేసే ముద్ర బలంగా ఉంటుంది. తెలుగు, తమిళ భాషల్లో ఆయన చేసిన ఫ్రెండ్లీ ఫాదర్ క్యారెక్టర్లు ప్రేక్షకులను భలేగా ఆకట్టుకున్నాయి. ఎక్కువగా క్యారెక్టర్ రోల్సే చేసిన బాలు.. లీడ్ రోల్‌ చేసిన పాత్ర కూడా ఒకటుంది. అదే.. మిథునం. సీనియర్ నటి లక్ష్మితో కలిసి ఆ సినిమాలో అద్భుత అభినయం ప్రదర్శించారు బాలు.

ఆ సినిమాలో వాళ్లిద్దరివి తప్ప వేరే పాత్రలుండవు. శ్రీ రమణ రచన.. తనికెళ్ల భరణి దర్శకత్వం.. బాలు, లక్ష్మిల అభినయం అద్భుతంగా పండి ఆ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిలా నిలిచింది. కమర్షియల్‌గా ఎలాంటి ఫలితాన్నందుకుందన్నది పక్కన పెడితే ‘మిథునం’ ఓ గొప్ప సినిమా అనడంలో సందేహం లేదు.

ఇప్పుడీ ప్రయోగాత్మక చిత్రం హిందీలోకి వెళ్లబోతున్నట్లు సమాచారం. బాలీవుడ్లో కథలు కరవై దక్షిణాది వైపు చూస్తుండటం తెలిసిందే. ఇక్కడ విజయవంతమైన సినిమాలన్నీ అక్కడ రీమేక్ చేసేస్తున్నారు. ‘ఊసరవెల్లి’ లాంటి డిజాస్టర్‌ సైతం హిందీలోకి వెళ్తుండటం విశేషం. ఐతే ‘మిథునం’ లాంటి ప్రయోగాత్మక చిత్రాన్ని బాలీవుడ్ వాళ్లు రీమేక్ కోసం ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

బాలు పాత్రను హిందీలో ఎవరు చేస్తే బాగుంటుందనే ప్రశ్న తలెత్తితే.. అమితాబ్ బచ్చన్‌ను మించి ఆప్షన్ కనిపించదు. రీమేక్ హక్కులు తీసుకున్న నిర్మాణ సంస్థ కూడా ఈ చిత్రాన్ని ఆయనతో తీయాలనే అనుకుంటోందట. మరి లక్ష్మి పాత్రకు ఎవరిని ఎంచుకుంటారో చూడాలి. ‘మిథునం’ సినిమా చూస్తే అమితాబ్ కచ్చితంగా బాలు పాత్ర చేయడానికి ముందుకు రావచ్చు. ఆయనలోని నటుడిని పూర్తిగా సంతృప్తి పరిచే చిత్రమవుతుంది. ఇలాంటి ప్రయోగాలకు అమితాబ్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు కూడా. మరి నిజంగా ఆయనే ఆ పాత్ర చేస్తారా.. హిందీలో ఈ సినిమాను ఎలా తీర్చిదిద్దుతారో చూడాలి.

This post was last modified on November 28, 2020 4:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

1 hour ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

2 hours ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

2 hours ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

3 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

4 hours ago

ఆంధ్రా యువత ఎదురుచూపు… ఉగాదికి ముహూర్తం?

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మ‌ధ్య జ‌రిగే తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది ప‌ర్వ‌దినానికి భారీ ప్ర‌క‌ట‌న చేసేందుకు ఏపీ మంత్రి నారా…

5 hours ago