ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గొప్ప గాయకుడే కాదు.. మంచి నటుడు కూడా. ఆయన చిన్న పాత్ర చేసినా దాంతో వేసే ముద్ర బలంగా ఉంటుంది. తెలుగు, తమిళ భాషల్లో ఆయన చేసిన ఫ్రెండ్లీ ఫాదర్ క్యారెక్టర్లు ప్రేక్షకులను భలేగా ఆకట్టుకున్నాయి. ఎక్కువగా క్యారెక్టర్ రోల్సే చేసిన బాలు.. లీడ్ రోల్ చేసిన పాత్ర కూడా ఒకటుంది. అదే.. మిథునం. సీనియర్ నటి లక్ష్మితో కలిసి ఆ సినిమాలో అద్భుత అభినయం ప్రదర్శించారు బాలు.
ఆ సినిమాలో వాళ్లిద్దరివి తప్ప వేరే పాత్రలుండవు. శ్రీ రమణ రచన.. తనికెళ్ల భరణి దర్శకత్వం.. బాలు, లక్ష్మిల అభినయం అద్భుతంగా పండి ఆ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిలా నిలిచింది. కమర్షియల్గా ఎలాంటి ఫలితాన్నందుకుందన్నది పక్కన పెడితే ‘మిథునం’ ఓ గొప్ప సినిమా అనడంలో సందేహం లేదు.
ఇప్పుడీ ప్రయోగాత్మక చిత్రం హిందీలోకి వెళ్లబోతున్నట్లు సమాచారం. బాలీవుడ్లో కథలు కరవై దక్షిణాది వైపు చూస్తుండటం తెలిసిందే. ఇక్కడ విజయవంతమైన సినిమాలన్నీ అక్కడ రీమేక్ చేసేస్తున్నారు. ‘ఊసరవెల్లి’ లాంటి డిజాస్టర్ సైతం హిందీలోకి వెళ్తుండటం విశేషం. ఐతే ‘మిథునం’ లాంటి ప్రయోగాత్మక చిత్రాన్ని బాలీవుడ్ వాళ్లు రీమేక్ కోసం ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
బాలు పాత్రను హిందీలో ఎవరు చేస్తే బాగుంటుందనే ప్రశ్న తలెత్తితే.. అమితాబ్ బచ్చన్ను మించి ఆప్షన్ కనిపించదు. రీమేక్ హక్కులు తీసుకున్న నిర్మాణ సంస్థ కూడా ఈ చిత్రాన్ని ఆయనతో తీయాలనే అనుకుంటోందట. మరి లక్ష్మి పాత్రకు ఎవరిని ఎంచుకుంటారో చూడాలి. ‘మిథునం’ సినిమా చూస్తే అమితాబ్ కచ్చితంగా బాలు పాత్ర చేయడానికి ముందుకు రావచ్చు. ఆయనలోని నటుడిని పూర్తిగా సంతృప్తి పరిచే చిత్రమవుతుంది. ఇలాంటి ప్రయోగాలకు అమితాబ్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు కూడా. మరి నిజంగా ఆయనే ఆ పాత్ర చేస్తారా.. హిందీలో ఈ సినిమాను ఎలా తీర్చిదిద్దుతారో చూడాలి.
This post was last modified on November 28, 2020 4:15 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…