Movie News

ఇది సుకుమార్ సహా అందరికీ కౌంటరే

మైత్రీ మూవీ మేకర్స్.. టాలీవుడ్లో ప్రస్తుతం బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్‌ల్లో ఒకటి. ఆ మాటకొస్తే ఇండియాలో కూడా పెద్ద బేనర్లలో ఒకటిగా ఎదిగింది. మలయాళంలో ‘ఏఆర్ఎం’, తమిళంలో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, హిందీలో ‘జాట్’ లాంటి భారీ చిత్రాలు తీసి పాన్ ఇండియా స్థాయిలో పెద్ద రేంజికి ఎదిగే ప్రయత్నం చేస్తోంది మైత్రీ. తెలుగులో ‘పుష్ప’, ‘పుష్ప-2’, ‘రంగస్థలం’, ‘జనతా గ్యారేజ్’, ‘శ్రీమంతుడు’.. ఇలా ఆ సంస్థ ప్రతిష్టను పెంచిన మెగా హిట్లు చాలానే ఉన్నాయి. ఐతే పదేళ్లకు పైగా ప్రయాణంలో ఎన్ని సినిమాలు చేసినా రాని సంతృప్తి తమ కొత్త సినిమా ‘డ్యూడ్’ విషయంలో వచ్చిందన్నట్లుగా ఇటీవల నిర్మాత రవిశంకర్ చేసిన ఒక కామెంట్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాకు నాలుగు విషయాలు సరిగ్గా కుదిరాయని ఆయన చెప్పారు. 

అదిరిపోయే సబ్జెక్ట్‌తో సినిమా చేశామని.. చిత్రీకరణ మొదలుపెట్టాక 65-70 రోజుల్లోనే పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో సినిమా పూర్తి చేశామని.. అనుకున్న బడ్జెట్ లోపే సినిమా అయిందని.. అన్నింటికీ మించి ఔట్ పుట్ చూసుకున్నాక భలే సినిమా తీశామని పిచ్చ ఎగ్జైట్మెంట్ కలిగిందని ఆయన వ్యాఖ్యానించారు. పదేళ్ల నుంచి ఇవన్నీ కుదిరే సినిమా కోసం అన్వేషిస్తున్నామని.. ఎట్టకేలకు ‘డ్యూడ్’తోనే అది సాధ్యమైందని రవిశంకర్ అన్నారు. ఐతే మైత్రీ సంస్థలో ఇప్పటికే 30కి పైగా సినిమాలు వచ్చాయి. కానీ ఒక్క సినిమాకు కూడా ఈ నాలుగు విషయాలూ సాధ్యపడలేదు అంటే ఆశ్చర్యం కలిగించే విషయం.

మైత్రీకి పుష్ప, పుష్ప-2, రంగస్థలం చిత్రాలతో భారీ విజయాలు అందించాడు సుకుమార్. కానీ ఆయన షూటింగ్ విషయంలో విపరీతమైన ఆలస్యం చేశాడు. అలాగే వాటి బడ్జెట్లూ దాటిపోయాయి. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ లాంటి సినిమాలు కూడా అనుకున్న సమయంలో, బడ్జెట్లో పూర్తి కానట్లే. బహుశా తక్కువ రోజుల్లో, అనుకున్న బడ్జెట్లో తీసిన సినిమాలు కోరుకున్న విజయాలు అందించి ఉండకపోవచ్చు. రవిశంకర్ ఎవరినో టార్గెట్ చేయాలని అనుకుని ఉండకపోవచ్చు కానీ.. ఆయన కామెంట్ సుకుమార్ సహా మైత్రీ సంస్థలో పని చేసిన దర్శకులందరికీ చిన్న కౌంటర్ వేశారని ఇండస్ట్రీ జనాలు చర్చించుకుంటున్నారు.

This post was last modified on October 11, 2025 4:21 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Sukumar

Recent Posts

భోజనంలో పురుగులు… వందేభారత్ రామానుజం ఏం చేశాడు?

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులకు అందించే భోజనం నాణ్యతపై మరోసారి పెద్ద వివాదం రాజుకుంది. పాట్నా నుంచి టాటానగర్ వెళ్లే…

28 minutes ago

చిరు బాబీ మిస్… వెంకీ అనిల్ ఫిక్స్

వరసగా సినిమాలు చేస్తున్నా సక్సెస్ మాత్రం అందని ద్రాక్ష పండులా మారిపోయిన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి సరైన బ్రేక్…

1 hour ago

వెయ్యి కోట్ల విధ్వంసం వారం రోజుల్లోనే

అంచనాలకు మించి దురంధర్ ది రివెంజ్ అరాచకం చేస్తోంది. సరిగ్గా వారం రోజులు కావడం ఆలస్యం వెయ్యి కోట్ల క్లబ్బులోకి…

3 hours ago

మంగళగిరిని లోకేశ్ వీడాల్సిందేనా…?

లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఖరారైన నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఆయా పరిణామాలపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ…

4 hours ago

ప్రభాస్ ప్రేమిస్తే ఇంతే

నేటి తరం కుర్ర హీరోల్లో సంతోష్ శోభన్, సంగీత్ శోభన్ సోదరులకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే వీరిద్దరి…

4 hours ago

ఘోర బస్సు ప్రమాదం 10 మంది సజీవదహనం

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మార్కాపురం జిల్లాలోని రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు…

6 hours ago