అక్కినేని నాగార్జున వందో సినిమా కోసం అభిమానులు ఎప్పట్నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఆ సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లాడు నాగ్. తన పుట్టిన రోజైన ఆగస్టు 29న నాగ్ తన వందో చిత్రాన్ని అనౌన్స్ చేస్తాడని.. ముహూర్త వేడుకను ఘనంగా చేస్తాడని ఫ్యాన్స్ అంచనా వేశారు కానీ.. కింగ్ అలా చేయలేదు. సినిమాకు అనౌన్స్మెంటే లేదు. షూటింగ్ కూడా చడీచప్పుడు లేకుండా మొదలుపెట్టేశారు.
తమిళ యువ దర్శకుడు రా.కార్తీక్ ఈ చిత్రాన్ని రూపొందిస్తుండగా.. నాగ్ సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడ్యూస్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ సినిమాకు ‘లాటరీ కింగ్’ అనే టైటిల్ పెడుతున్నట్లు కూడా ఇటీవల వార్తలు వచ్చాయి. కాగా అక్కినేని ఫ్యామిలీకి చాలా స్పెషల్ అయిన ఈ సినిమాలో ఆ కుటుంబం నుంచి ప్రత్యేక అతిథి పాత్రలు కూడా ఉంటాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.
‘మనం’ తరహాలో నాగ్ వందో చిత్రాన్ని కూడా స్పెషల్గా మార్చేందుకు అక్కినేని కుటుంబం సన్నాహాలు చేస్తోందట. ఇందులో నాగ్కు బెస్ట్ ఫ్రెండ్ అయిన టబు కథానాయికగా నటిస్తున్న సంగతి ఇటీవలే వెల్లడైంది. కాగా నాగ్ కొడుకులు నాగచైతన్య, అఖిల్ ఇందులో క్యామియో రోల్స్ చేయనున్నారట. అంతే కాక అమల కూడా చిన్న పాత్రలో మెరిసే అవకాశం ఉందంటున్నారు. ఇదే జరిగితే అక్కినేని అభిమానులకు అంతకంటే సంబరం మరొకటి ఉండదు.
ఏఎన్నార్ చివరి చిత్రమైన ‘మనం’లో నాగ్, చైతూ లీడ్ రోల్స్ చేస్తే.. అఖిల్ క్యామియోలో కనిపించడంతో ఆ చిత్రం చిరస్మరణీయంగా మారింది. ఇప్పుడు నాగ్ వందో సినిమాను కూడా ప్రత్యేకంగా మార్చేలా అక్కినేని ఫ్యామిలీ క్యామియోస్ పెడుతున్నారట. మరి ఇందులో సుమంత్, సుశాంత్, సుప్రియ లాంటి మిగతా అక్కినేని కుటుంబ తారలు కూడా తళుక్కుమని ఈ మూవీని ఇంకా స్పెషల్గా మారుస్తారేమో చూడాలి.
This post was last modified on October 11, 2025 3:04 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…