అక్కినేని నాగార్జున వందో సినిమా కోసం అభిమానులు ఎప్పట్నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఆ సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లాడు నాగ్. తన పుట్టిన రోజైన ఆగస్టు 29న నాగ్ తన వందో చిత్రాన్ని అనౌన్స్ చేస్తాడని.. ముహూర్త వేడుకను ఘనంగా చేస్తాడని ఫ్యాన్స్ అంచనా వేశారు కానీ.. కింగ్ అలా చేయలేదు. సినిమాకు అనౌన్స్మెంటే లేదు. షూటింగ్ కూడా చడీచప్పుడు లేకుండా మొదలుపెట్టేశారు.
తమిళ యువ దర్శకుడు రా.కార్తీక్ ఈ చిత్రాన్ని రూపొందిస్తుండగా.. నాగ్ సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడ్యూస్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ సినిమాకు ‘లాటరీ కింగ్’ అనే టైటిల్ పెడుతున్నట్లు కూడా ఇటీవల వార్తలు వచ్చాయి. కాగా అక్కినేని ఫ్యామిలీకి చాలా స్పెషల్ అయిన ఈ సినిమాలో ఆ కుటుంబం నుంచి ప్రత్యేక అతిథి పాత్రలు కూడా ఉంటాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.
‘మనం’ తరహాలో నాగ్ వందో చిత్రాన్ని కూడా స్పెషల్గా మార్చేందుకు అక్కినేని కుటుంబం సన్నాహాలు చేస్తోందట. ఇందులో నాగ్కు బెస్ట్ ఫ్రెండ్ అయిన టబు కథానాయికగా నటిస్తున్న సంగతి ఇటీవలే వెల్లడైంది. కాగా నాగ్ కొడుకులు నాగచైతన్య, అఖిల్ ఇందులో క్యామియో రోల్స్ చేయనున్నారట. అంతే కాక అమల కూడా చిన్న పాత్రలో మెరిసే అవకాశం ఉందంటున్నారు. ఇదే జరిగితే అక్కినేని అభిమానులకు అంతకంటే సంబరం మరొకటి ఉండదు.
ఏఎన్నార్ చివరి చిత్రమైన ‘మనం’లో నాగ్, చైతూ లీడ్ రోల్స్ చేస్తే.. అఖిల్ క్యామియోలో కనిపించడంతో ఆ చిత్రం చిరస్మరణీయంగా మారింది. ఇప్పుడు నాగ్ వందో సినిమాను కూడా ప్రత్యేకంగా మార్చేలా అక్కినేని ఫ్యామిలీ క్యామియోస్ పెడుతున్నారట. మరి ఇందులో సుమంత్, సుశాంత్, సుప్రియ లాంటి మిగతా అక్కినేని కుటుంబ తారలు కూడా తళుక్కుమని ఈ మూవీని ఇంకా స్పెషల్గా మారుస్తారేమో చూడాలి.
This post was last modified on October 11, 2025 3:04 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…