Movie News

కిరణ్ అబ్బవరం ప్రశ్న… మైత్రి రవి సమాధానం

ఇటీవలే కిరణ్ అబ్బవరం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రదీప్ రంగనాథన్ కి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు దొరికినట్టు తన తెలుగు సినిమాని తమిళనాడులో రిలీజ్ చేద్దామంటే అక్కడి డిస్ట్రిబ్యూటర్లు స్క్రీన్లు ఇవ్వడం లేదని చెప్పడం సోషల్ మీడియాలో పెద్ద టాపిక్కే అయ్యింది. అతని ఆవేదనలో లాజిక్ ఉన్నా ఈ సమస్య ఇప్పటిది కాకపోవడంతో ఎవరూ సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది. కిరణ్ సదరు సినిమా టైటిల్ చెప్పకపోయినా తను అన్నది డ్యూడ్ గురించేనని అందరూ గుర్తు పట్టేశారు. కె ర్యాంప్ తో క్లాష్ ఉన్న నేపథ్యంలో ఇలాంటి కామెంట్స్ చేయడం సర్వత్రా చర్చకు దారి తీశాయి.

తాజాగా జరిగిన డ్యూడ్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత మైత్రి రవిశంకర్ దీనికి బదులు ఇచ్చారు. మంచి కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా బ్లాక్ బస్టర్ అవుతుందని, ఒకవేళ తమ డ్యూడ్ కన్నా అవతలి మూవీస్ ఇంకా బాగుంటే ఖచ్చితంగా తమ షోలు ఇవ్వడానికి, పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అంతే తప్ప నెంబర్ అఫ్ థియేటర్ల గురించి మాట్లాడ్డం సబబు కాదని అన్నారు. ఏపీ తెలంగాణతో పోల్చుకుంటే తమిళనాడులో థియేటర్లు తక్కువగా ఉండటం వల్ల సమస్య వస్తోంది తప్ప కావాలని చేసింది కాదని, హిట్టు ఇస్తే ఆటోమేటిక్ గా షోలు పెరుగుతాయని కుండబద్దలు కొట్టేశారు.

సో ఒక అగ్ర నిర్మాత నుంచి క్లారిటీ వచ్చేసింది కాబట్టి ఇంకా దీని గురించి ఎలాంటి విశ్లేషణలు వస్తాయో చూడాలి. వినడానికి బాగానే ఉంది కానీ ముందైతే మన హీరోలు పక్క రాష్ట్రంలో సాలిడ్ మార్కెట్ ఏర్పడాలంటే ఎలాంటి సినిమాలు తీయాలో డిసైడ్ అవ్వాలి. బాహుబలి, కెజిఎఫ్, ఆర్ఆర్ఆర్, పుష్ప లాంటివి అక్కడ ఆడాయి కానీ మీడియం బడ్జెట్ చిత్రాలు తమిళంలో పెర్ఫార్మ్ చేసిన దాఖలాలు చాలా తక్కువ. అంతులేని కథలా ఈ థియేటర్ పంచాయితి ఎప్పటికీ తెగేది కాదు కాబట్టి ఫ్లోతో పాటు వెళ్లిపోవడం తప్ప ఎవరేం చేయలేరు. ఇంతకీ రవిశంకర్ అన్నట్టు దీపావళి విజేత ఎవరవుతారో చూడాలి.

This post was last modified on October 9, 2025 9:37 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

41 minutes ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

1 hour ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

1 hour ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

2 hours ago

ప్రసాదు ప్రీమియర్ల మీదే అందరి కన్ను

సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…

3 hours ago

జేడీ లక్ష్మీనారాయణ సతీమణి సైబర్ వలలో పడడమా…

వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…

3 hours ago