Movie News

కిరణ్ అబ్బవరం ప్రశ్న… మైత్రి రవి సమాధానం

ఇటీవలే కిరణ్ అబ్బవరం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రదీప్ రంగనాథన్ కి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు దొరికినట్టు తన తెలుగు సినిమాని తమిళనాడులో రిలీజ్ చేద్దామంటే అక్కడి డిస్ట్రిబ్యూటర్లు స్క్రీన్లు ఇవ్వడం లేదని చెప్పడం సోషల్ మీడియాలో పెద్ద టాపిక్కే అయ్యింది. అతని ఆవేదనలో లాజిక్ ఉన్నా ఈ సమస్య ఇప్పటిది కాకపోవడంతో ఎవరూ సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది. కిరణ్ సదరు సినిమా టైటిల్ చెప్పకపోయినా తను అన్నది డ్యూడ్ గురించేనని అందరూ గుర్తు పట్టేశారు. కె ర్యాంప్ తో క్లాష్ ఉన్న నేపథ్యంలో ఇలాంటి కామెంట్స్ చేయడం సర్వత్రా చర్చకు దారి తీశాయి.

తాజాగా జరిగిన డ్యూడ్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత మైత్రి రవిశంకర్ దీనికి బదులు ఇచ్చారు. మంచి కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా బ్లాక్ బస్టర్ అవుతుందని, ఒకవేళ తమ డ్యూడ్ కన్నా అవతలి మూవీస్ ఇంకా బాగుంటే ఖచ్చితంగా తమ షోలు ఇవ్వడానికి, పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అంతే తప్ప నెంబర్ అఫ్ థియేటర్ల గురించి మాట్లాడ్డం సబబు కాదని అన్నారు. ఏపీ తెలంగాణతో పోల్చుకుంటే తమిళనాడులో థియేటర్లు తక్కువగా ఉండటం వల్ల సమస్య వస్తోంది తప్ప కావాలని చేసింది కాదని, హిట్టు ఇస్తే ఆటోమేటిక్ గా షోలు పెరుగుతాయని కుండబద్దలు కొట్టేశారు.

సో ఒక అగ్ర నిర్మాత నుంచి క్లారిటీ వచ్చేసింది కాబట్టి ఇంకా దీని గురించి ఎలాంటి విశ్లేషణలు వస్తాయో చూడాలి. వినడానికి బాగానే ఉంది కానీ ముందైతే మన హీరోలు పక్క రాష్ట్రంలో సాలిడ్ మార్కెట్ ఏర్పడాలంటే ఎలాంటి సినిమాలు తీయాలో డిసైడ్ అవ్వాలి. బాహుబలి, కెజిఎఫ్, ఆర్ఆర్ఆర్, పుష్ప లాంటివి అక్కడ ఆడాయి కానీ మీడియం బడ్జెట్ చిత్రాలు తమిళంలో పెర్ఫార్మ్ చేసిన దాఖలాలు చాలా తక్కువ. అంతులేని కథలా ఈ థియేటర్ పంచాయితి ఎప్పటికీ తెగేది కాదు కాబట్టి ఫ్లోతో పాటు వెళ్లిపోవడం తప్ప ఎవరేం చేయలేరు. ఇంతకీ రవిశంకర్ అన్నట్టు దీపావళి విజేత ఎవరవుతారో చూడాలి.

This post was last modified on October 9, 2025 9:37 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పవన్ చొరవతో క్షేమంగా ఇల్లు చేరిన ముస్లిం మహిళ

బతుకుదెరువు కోసం విదేశం వెళ్లిన ఏపీకి చెందిన ముస్లిం మహిళ అక్కడ విష వలయంలో చిక్కుకుంది. ఆ ఉచ్చు నుంచి…

6 hours ago

రిస్క్ ఉన్నా ముందుకెళ్తున్న అబ్బవరం

ఇటీవలే కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారి తిమ్మరాజుపల్లి టీవీ తీశారు. మొదటి మూడు రోజులు తెగ హడావిడి చేశారు. గొప్ప…

6 hours ago

ఎల్లమ్మ సమస్యకు ఏది ముగింపు

దేవిశ్రీ ప్రసాద్ ని హీరోగా పరిచయం చేస్తూ నిర్మాత దిల్ రాజు ప్రకటించిన ఎల్లమ్మ ఇప్పటికీ రెగ్యులర్ షూటింగ్ కు…

7 hours ago

దేవిశ్రీ.. అంత:కరణశుద్ధితో..

సంగీత దర్శకులు హీరోలు కావడం తమిళ ఇండస్ట్రీలో ఇప్పటికే చూశాం. విజయ్ ఆంటోనీ, జి.వి.ప్రకాష్ కుమార్ లాంటి వాళ్లు సినీ…

9 hours ago

ఇక కాంగ్రెస్ వాళ్లతో కూర్చోలేం

ఇటీవల జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్తో డీఎంకే పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే అయితే కేవలం ఐదు సీట్లు…

10 hours ago

అనుష్క సినిమాకు మళ్ళీ మౌనవ్రతం

అదేంటో అనుష్క సినిమాలు నిర్మాణంలోనే కాదు విడుదలలోనూ తెగ ఆలస్యానికి గురవుతున్నాయి. మలయాళంలో తను నటించిన ప్యాన్ ఇండియా మూవీ…

10 hours ago