Movie News

యానిమల్ సంగీత దర్శకుడి దశ తిరిగింది

హర్షవర్షన్ రామేశ్వర్. ఈ పేరు మ్యూజిక్ లవర్స్ కు బాగా పరిచయమే కానీ సాధారణ ప్రేక్షకులకు తమన్, దేవిశ్రీ ప్రసాద్ గురించి తెలిసినంతగా ఇతని గురించి అవగాహన తక్కువ. అర్జున్ రెడ్డికి పాటలు కంపోజ్ చేసింది రదనే కానీ బ్యాక్ గ్రౌండ్ తో ప్రాణం పోసిన హర్షవర్ధన్ పనితనం గురించి ఎంత చెప్పినా తక్కువ. యానిమల్ కు ఇచ్చిన బీజీఎమ్, కంటెంట్ స్థాయిని పదింతలు పెంచిందనేది ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. ఇతని వర్క్ ఏ స్థాయి అంటే స్పిరిట్ ఇంకా షూటింగ్ మొదలుపెట్టకుండానే దానికి సంబంధించిన నేపధ్య సంగీతాన్ని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ముందే చేయించుకునేంత.

మరి ఇంత టాలెంట్ ఉన్న హర్షవర్ధన్ రామేశ్వర్ ప్లానింగ్ పరంగా దూకుడుగా లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇప్పుడు తన చేతికి రెండు క్రేజీ ప్రాజెక్టులు వచ్చాయి. పూరి జగన్నాథ్ – విజయ్ సేతుపతి కలయికలో తెరకెక్కుతున్న స్లమ్ డాగ్ కు కంపోజర్ గా తన పేరునే అధికారికంగా ప్రకటించారు. ఇస్మార్ట్ శంకర్  ద్వారా తనతో పాటూ కంబ్యాక్ అయిన మణిశర్మను కాకుండా పూరి ఈసారి ఛాయస్ మార్చుకోవడం గమనార్హం. త్రివిక్రమ్ శ్రీనివాస్ – వెంకటేష్ కలయికలో తెరకెక్కబోతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కూడా హర్షవర్ధన్ చేతికే వచ్చింది. ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.

గత కొన్నేళ్లుగా తమన్ తప్ప వేరే ఆప్షన్ పెట్టుకోని త్రివిక్రమ్ ఇప్పుడు హర్షవర్ధన్ వైపు మొగ్గు చూపేందుకు కారణాలు లేకపోలేదు. ఒకటి ఫ్రెష్ మ్యూజిక్ కావడం. రెండోది తమన్ బిజీగా ఉండటం. అఖండ 2, రాజా సాబ్ తదితర ప్యాన్ ఇండియా ప్రాజెక్టులతో సతమతమవుతున్న తమన్ ఇప్పటికిప్పుడు వేగంగా వర్క్ చేసే పరిస్థితిలో లేడు. అందుకే హర్షవర్షన్ కు ఛాన్స్ దొరికినట్టు అయ్యింది. ఇవి కాకుండా మరో రెండు తమిళ సినిమాలు తన చేతిలో ఉన్నాయి. వెంకటేష్, విజయ్ సేతుపతి, ప్రభాస్ ఇలా వరసగా స్టార్ హీరోలతో జట్టు కడుతున్న హర్షవర్ధన్ రామేశ్వర్ ఇదే దూకుడు కొనసాగించాలని ఫ్యాన్స్ కోరిక.

This post was last modified on October 9, 2025 10:15 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

5 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

6 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

6 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

6 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

7 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

7 hours ago