అక్టోబర్ 31 మాస్ జాతర విడుదల కానుంది. ఇకపై ఎలాంటి వాయిదాలు ఉండవని ఏకంగా వినాయకుడి మీద ఒట్టేసి మరీ ప్రమోషన్లు మొదలుపెట్టారు కాబట్టి ఇంకే అనుమానాలు అక్కర్లేదు. ఆల్రెడీ ఒక గ్రూప్ ఇంటర్వ్యూ రిలీజైపోగా మిగిలినవి ఒక్కొక్కటిగా వదలబోతున్నారు. భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో శ్రీలీల హీరోయిన్ కాగా భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చాడు. ధమాకా మేజిక్ మరోసారి రిపీట్ చేస్తాడనే నమ్మకం అభిమానుల్లో ఉంది. అయితే అసలు విషయం ఇది కాదు. అదే రోజు బాహుబలి ఎపిక్ రీ రిలీజ్ కానుండటం డిస్కషన్ కు దారి తీస్తోంది.
మాములుగా ది బిగినింగ్ లేదా కంక్లూజన్ ఏదో ఒక భాగం మళ్ళీ విడుదల చేస్తుంటే ఇప్పుడీ డిస్కషన్ అక్కర్లేదు. కానీ రెండు పార్ట్స్ కలిపి 3 గంటల 40 నిమిషాల నిడివితో ఒక కొత్త ఎడిషన్ తయారుచేశారు. అంటే సుమారు రెండు గంటల కంటెంట్ ని తీసేసి కొత్త వెర్షన్ రెడీ చేస్తున్నారు. అసలు రిలీజ్ టైంలో థియేటర్ ఎక్స్ పీరియన్స్ చేయనివాళ్ళు ఈసారి ఛాన్స్ మిస్ చేయరు. పైగా రాజమౌళి బృందం చేస్తున్న పబ్లిసిటీ మాములుగా లేదు. ఇప్పటినుంచే హడావిడి మొదలుపెట్టారు. నిర్మాత శోభు యార్లగడ్డ ఆసక్తికరమైన విషయాలు పంచుకుంటున్నారు. రేపో ఎల్లుండో రాజమౌళి దర్శనం కూడా జరగనుంది.
రవితేజ లాంటి స్టార్ హీరో రేంజ్ కి ఆందోళన పడాల్సిన అవసరం లేదు కానీ బాహుబలి హంగామా చూస్తుంటే థియేటర్ల పంపకాలతో పాటు ఓపెనింగ్స్ పరంగానూ ఎఫెక్ట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ దీన్ని ధీటుగా ఎదురుకోవాలంటే మాస్ జాతరకు ఎక్స్ ట్రాడినరి టాక్ రావాలి. విక్రమార్కుడు, కిక్, క్రాక్, ఇడియట్ రేంజ్ లో వస్తే ఏ చింతా లేదు. మాస్ మహారాజ ఈజీగా కాచుకుంటాడు. కానీ కొత్త దర్శకుడు అంత గొప్పగా హ్యాండిల్ చేసి ఉంటాడా అనేదే ఫ్యాన్స్ మనసులో మెదులుతున్న సందేహం. టీమ్ మాత్రం నిశ్చింతగా ఉంది. ఈసారి హిట్టు కొట్టడం ఖాయమనే తరహాలో స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది. చూద్దాం.
వైసీపీలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీసీఏ)ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో పరాజయం తర్వాత.. జగన్.. పీఏసీకి…
రెండు వారాల క్రితం రణ్వీర్ సింగ్ ని మూడేళ్ళ పాటు బ్యాన్ చేస్తున్నట్టు ఫెడరేషన్ అఫ్ వెస్ట్రన్ సినీ ఎంప్లొయీస్…
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధనం, బంగారం దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చిస్తున్న విషయం…
అతిలోకసుందరిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న హీరోయిన్ శ్రీదేవి. కాలం చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఆవిడ వేసిన…
అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని సందర్శించిన అనంతరం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక…
పవన్ వ్యాఖ్యలపై అందరూ మాట్లాడేశారు.. ఇక మిగిలింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంతే! రెండు రోజుల నుంచి తెలుగు…