అక్టోబర్ 31 మాస్ జాతర విడుదల కానుంది. ఇకపై ఎలాంటి వాయిదాలు ఉండవని ఏకంగా వినాయకుడి మీద ఒట్టేసి మరీ ప్రమోషన్లు మొదలుపెట్టారు కాబట్టి ఇంకే అనుమానాలు అక్కర్లేదు. ఆల్రెడీ ఒక గ్రూప్ ఇంటర్వ్యూ రిలీజైపోగా మిగిలినవి ఒక్కొక్కటిగా వదలబోతున్నారు. భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో శ్రీలీల హీరోయిన్ కాగా భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చాడు. ధమాకా మేజిక్ మరోసారి రిపీట్ చేస్తాడనే నమ్మకం అభిమానుల్లో ఉంది. అయితే అసలు విషయం ఇది కాదు. అదే రోజు బాహుబలి ఎపిక్ రీ రిలీజ్ కానుండటం డిస్కషన్ కు దారి తీస్తోంది.
మాములుగా ది బిగినింగ్ లేదా కంక్లూజన్ ఏదో ఒక భాగం మళ్ళీ విడుదల చేస్తుంటే ఇప్పుడీ డిస్కషన్ అక్కర్లేదు. కానీ రెండు పార్ట్స్ కలిపి 3 గంటల 40 నిమిషాల నిడివితో ఒక కొత్త ఎడిషన్ తయారుచేశారు. అంటే సుమారు రెండు గంటల కంటెంట్ ని తీసేసి కొత్త వెర్షన్ రెడీ చేస్తున్నారు. అసలు రిలీజ్ టైంలో థియేటర్ ఎక్స్ పీరియన్స్ చేయనివాళ్ళు ఈసారి ఛాన్స్ మిస్ చేయరు. పైగా రాజమౌళి బృందం చేస్తున్న పబ్లిసిటీ మాములుగా లేదు. ఇప్పటినుంచే హడావిడి మొదలుపెట్టారు. నిర్మాత శోభు యార్లగడ్డ ఆసక్తికరమైన విషయాలు పంచుకుంటున్నారు. రేపో ఎల్లుండో రాజమౌళి దర్శనం కూడా జరగనుంది.
రవితేజ లాంటి స్టార్ హీరో రేంజ్ కి ఆందోళన పడాల్సిన అవసరం లేదు కానీ బాహుబలి హంగామా చూస్తుంటే థియేటర్ల పంపకాలతో పాటు ఓపెనింగ్స్ పరంగానూ ఎఫెక్ట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ దీన్ని ధీటుగా ఎదురుకోవాలంటే మాస్ జాతరకు ఎక్స్ ట్రాడినరి టాక్ రావాలి. విక్రమార్కుడు, కిక్, క్రాక్, ఇడియట్ రేంజ్ లో వస్తే ఏ చింతా లేదు. మాస్ మహారాజ ఈజీగా కాచుకుంటాడు. కానీ కొత్త దర్శకుడు అంత గొప్పగా హ్యాండిల్ చేసి ఉంటాడా అనేదే ఫ్యాన్స్ మనసులో మెదులుతున్న సందేహం. టీమ్ మాత్రం నిశ్చింతగా ఉంది. ఈసారి హిట్టు కొట్టడం ఖాయమనే తరహాలో స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది. చూద్దాం.
This post was last modified on October 8, 2025 6:52 am
ఇటీవలే కాంతారావు పురస్కారం అందుకున్న సందర్భంగా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తమిళ లెజెండరీ నటులు ఎంజీఆర్ ని ఉద్దేశించి అన్న…
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…