క్షణం నుంచి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని.. వరుసగా విజయాలతో దూసుకెళ్తున్న నటుడు అడివి శేష్. థ్రిల్లర్ కథలకు కేరాఫ్ అడ్రస్గా మారిన శేష్.. తను స్వయంగా కథల తయారీ, మేకింగ్లో భాగమై తన చిత్రాలు మంచి క్వాలిటీతో రూపొందడంలో కీలక పాత్ర పోషిస్తుంటాడు. ఐతే శేష్తో ఉన్న ఇబ్బంది ఏంటంటే.. రైటింగ్, మేకింగ్ కోసం చాలా టైం తీసుకుంటాడు. దీని వల్ల సినిమాకు సినిమాకు చాలా గ్యాప్ వచ్చేస్తుంటుంది. తన చివరి చిత్రం హిట్-2 ఎప్పుడో 2022లో రిలీజైంది. ఇప్పటిదాకా కొత్త సినిమా రాలేదు.
ఈ ఏడాది వేసవిలోనే వస్తుందనుకున్న డెకాయిట్ మూవీ హీరోయిన్ మార్పు, షూటింగ్ షెడ్యూళ్లు మారడం వల్ల ఆలస్యం అయింది. చివరికి క్రిస్మస్ కానుకగా డిసెంబరు మూడో వారంలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు ఆ మధ్య ప్రకటించారు. మొత్తానికి మూడేళ్ల తర్వాత అయినా శేష్ సినిమా రాబోతోందని తన అభిమానులు హ్యాపీగా ఫీలయ్యారు. కానీ తాజా సమాచారం ఏంటంటే.. డెకాయిట్ ఈ ఏడాది విడుదల కాదట. ఇంకొన్ని నెలల తర్వాత కొత్త ఏడాదిలో ఆ చిత్రం విడుదల కానుందట.
డెకాయిట్ షూటింగ్ సందర్భంగా ఈ మధ్య అడివి శేష్ గాయపడ్డాడు. దీంతో కొన్ని వారాల విశ్రాంతి అనివార్యమైంది. ఇక ముందు తీయాల్సినవి కూడా భారీ యాక్షన్ ఘట్టాలే. దీంతో షూటింగ్ మరింత ఆలస్యం కానుంది. డిసెంబరు రిలీజ్ డేట్ను అందుకోవడం అసాధ్యమని టీం భావిస్తోంది. త్వరలోనే సినిమా వాయిదా గురించి అధికారిక ప్రకటన చేయబోతున్నారు. డెకాయిట్ ఆలస్యం అయిందంటే.. దాని ఎఫెక్ట్ శేష్ మరో చిత్రం గూఢచారి-2 మీద కూడా పడుతుంది. మేలో రావాల్సిన ఆ సినిమా కూడా ఇంకా వెనక్కి వెళ్లడం ఖాయం.
బహుశా డెకాయిట్ వచ్చే వేసవికి ఫిక్స్ కావచ్చు. ఆ తర్వాత కొన్ని నెలల గ్యాప్లో గూఢచారి-2 రావచ్చు. శేష్ సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తున్న డెకాయిట్ మూవీని గూఢచారి, మేజర్ చిత్రాల సినిమాటోగ్రాఫర్ షనీల్ డియో రూపొందిస్తున్నాడు. ఈ చిత్రంతో పాటు గూఢచారి-2కు కూడా శేష్ రచయితగా పని చేశాడు. గూఢచారి-2 చిత్రానికి విజయ్ కుమార్ సింగినీడి దర్శకుడు. అందులో ఓజీ విలన్ ఇమ్రాన్ హష్మి ప్రతినాయక పాత్ర చేస్తుండడం విశేషం.
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…
తెలంగాణ రాజకీయాలు వ్యూహాత్మక మలుపు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్, టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారిగా జనసేన పార్టీపై…
మొన్నటిదాకా తమిళ సినీ పరిశ్రమలోనే కాక దేశంలోని ఇతర భాషాల్లోనూ ఓ స్టార్ హీరోగా ఎదిగిన జోసెఫ్ విజయ్… ఉన్నట్టుండి…
ఏపీలో విగ్రహాల ధ్వంసం వ్యవహారం విపక్ష వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పాలి. నంద్యాలలో ఆదివారం ఉదయం వైఎస్ విగ్రహం ధ్వంసం ఘటనలో…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు భారీ షాక్ తగిలింది. తెలంగాణలో జనసేన బలోపేతం దిశగా…