గత కొన్నేళ్లలో ఇండియన్ బాక్సాఫీస్లో అతి పెద్ద సెన్సేషన్ అంటే.. ‘కాంతార’ అనే చెప్పాలి. ఈ సినిమాకు హీరో కమ్ డైరెక్టర్ అయిన రిషబ్ శెట్టి కన్నడేతర భాషల వాళ్లకు అస్సలు పరిచయం లేదు. సినిమాలో ఇంకెవరూ పేరున్న ఆర్టిస్టులు లేరు. మూడేళ్ల ముందు కన్నడలో ఓ మోస్తరు అంచనాలతో విడుదలైందీ చిత్రం. కానీ అక్కడ బ్లాక్బస్టర్ టాక్ తెచ్చుకోవడం.. రెండు వారాల తర్వాత తెలుగు, హిందీ భాషల్లోనూ అనువాదమై రిలీజ్ కావడం.. రెండు చోట్లా అనూహ్యమైన ఆదరణ సంపాదించుకుని సంచలనం సృష్టించడం.. అన్నీ ఒక కలలా జరిగిపోయాయి.
దెబ్బకు ‘కాంతార: చాప్టర్-1’కు అనూహ్యమైన క్రేజ్ వచ్చింది. తొలి రోజే రూ.89 కోట్ల మేర వసూళ్లు సాధించే స్థాయి హైప్తో సినిమా రిలీజైంది. వీకెండ్లో దేశవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబడుతూ సాగుతోందీ చిత్రం. ఫుల్ రన్లో ఈజీగా రూ.500 కోట్ల మార్కును దాటేలా ఉంది ‘కాంతార: చాప్టర్-1’.
ఇంతటి సంచలనం రేపుతున్న కథకు పునాది ఎలా పడింది అన్నది ఆసక్తికరం. ఈ విషయాన్నే ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు రిషబ్ శెట్టి. ‘‘20 ఏళ్ల కిందట మా గ్రామంలో జరిగిన ఒక సంఘటన ‘కాంతార’కు పునాది వేసింది. వ్యవసాయ భూమి కోసం ఒక అటవీ అధికారికి, రైతుకు మధ్య ఘర్షణ జరిగింది. నేను దాన్ని ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణగా చూడలేదు.
అడవిని కాపాడే అధికారి, భూమి కోసం పోరాడే రైతు.. ఇద్దరి తాపత్రయం ఒక్కటే. ప్రకృతిని కాపాడే వారి మధ్య ఆ ఘర్షణే నాకు ‘కాంతార’ కథ రాయడానికి స్ఫూర్తిగా నిలిచింది. మన సంస్కృతి మొత్తం వ్యవసాయం చుట్టూ ఎలా తిరుగుతుందో ఆలోచించడం మొదలుపెట్టాను. ఆ క్రమంలో గ్రామీణ సంప్రదాయాల మీద దృష్టిపెట్టి ‘కాంతార’ కథ రాశాను’’ అని రిషబ్ వెల్లడించాడు. కన్నడనాట గ్రామీణ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన భూతకోల నేపథ్యంలో ‘కాంతార’ సాగుతుందన్న సంగతి తెలిసిందే.
This post was last modified on October 5, 2025 11:53 am
తెలుగు నేల విభజన తర్వాత రాజధాని లేకుండానే ఆంధ్ర ప్రదేశ్ తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాల్సి వచ్చింది. ఓ వైపు రాజధాని లేమి,…
మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. అయితే ఇదే ప్రమాదంలో మరోవైపు…
పశ్చిమ ఆసియాలో యుద్ధం ముదురుతున్న కొద్దీ భారత్ తన ఇంధన అవసరాల కోసం వ్యూహాలను వేగవంతం చేస్తోంది. చమురు, గ్యాస్…
మెగా కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. చిరంజీవి అంటే తమ్ముళ్లు నాగబాబు, పవన్ కల్యాణ్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ముందు అనుకున్న ప్రకారం అయితే ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ…
వందే భారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణికులకు అందించే భోజనం నాణ్యతపై మరోసారి పెద్ద వివాదం రాజుకుంది. పాట్నా నుంచి టాటానగర్ వెళ్లే…