టాలీవుడ్లో మాంచి స్పీడుతో సినిమాలు చేసే స్టార్ హీరోల్లో మాస్ రాజా రవితేజ ఒకడు. దాదాపుగా ప్రతి ఏడాదీ రవితేజ నుంచి ఒక రిలీజ్ ఉంటుంది. కుదిరితే రెండు సినిమాలను కూడా రిలీజ్ చేస్తుంటాడు. గత ఏడాది ఈగల్, మిస్టర్ బచ్చన్ చిత్రాలతో పలకరించాడు మాస్ రాజా. కానీ ఈ రెండూ నిరాశపరచడంతో మాస్ రాజా స్పీడు కొంచెం తగ్గింది. తర్వాత ఆయన్నుంచి ‘మాస్ జాతర’ రాబోతోంది.
ఈ సినిమా కొన్ని కారణాల వల్ల ఆలస్యమై అక్టోబరు 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం రిలీజైన మూడు నెలల్లోపే రవితేజ నుంచి ఇంకో సినిమా వచ్చే అవకాశముంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న సినిమానే అది. కొన్ని నెలల కిందట చడీచప్పుడు లేకుండా ఈ సినిమాను మొదలుపెట్టారు. సంక్రాంతి రిలీజ్ లక్ష్యంగా అడుగులు వేశారు.
ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు వచ్చింది. ఇప్పటికీ సంక్రాంతి రిలీజ్ అనే అంటున్నారు కానీ.. పక్కాగా పండక్కి వస్తుందా రాదా అన్నది క్లారిటీ లేదు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇంతకుముందు ‘అనార్కలి’ అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. మాస్ రాజా సినిమాకు ఇలాంటి లేడీ ఓరియెంటెడ్, సాఫ్ట్ టైటిల్ ఏంటా అనుకున్నారు. ఐతే ఇప్పుడు టైటిల్ మారినట్లు తెలుస్తోంది. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అంటూ క్రేజీ టైటిల్ ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
మామూలుగా గుళ్లలో ‘భక్త మహాశయులకు విజ్ఞప్తి’ అంటుంటారు. దాన్ని తీసుకుని ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అని సినిమాకు పేరు పెట్టడం క్రేజీ ఐడియానే. కిషోర్ తిరుమల రైటింగ్ టాలెంట్కు ఇది నిదర్శనం. ఈ టైటిల్ను బట్టి ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అర్థమవుతోంది. త్వరలోనే టైటిల్తో పాటు రిలీజ్ గురించి కూడా అనౌన్స్మెంట్ ఇవ్వబోతోందట టీం. మరి ఇప్పటికే మూడు సినిమాలతో హౌస్ ఫుల్ అయినట్లుగా కనిపిస్తున్న సంక్రాంతి సీజన్లోకి మాస్ రాజా కూడా ఎంట్రీ ఇస్తాడేమో చూడాలి.
This post was last modified on October 5, 2025 1:03 pm
నందమూరి బాలకృష్ణ స్పీడ్ ను అందుకోవడం ఇప్పుడున్న కుర్ర హీరోలకు కూడా కష్టమే అనిపిస్తోంది. అఖండ 2 ఫ్లాప్ అయినా…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. వాస్తవానికి గతంలో కొన్ని కొన్ని చెదురుమొదురు ఘటనలు జరిగేవి. తాజాగా…
80, 90 దశకాల్లో వైభవం చూసిన కథానాయకుల్లో రాజశేఖర్ ఒకరు. స్వతహాగా తమిళుడైనప్పటికీ.. తెలుగులోనే ఆయన పెద్ద హీరోగాఎదిగారు. అంకుశం,…
గ్లోబల్ పాప్ సెన్సేషన్ రిహానా పేరు వింటేనే ఒక రేంజ్ వైబ్ గుర్తొస్తుంది. అలాంటిది ఈ ఇంటర్నేషనల్ స్టార్ సడన్గా…
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె వెనుక ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశం, వాటి నిర్వహణ విధానం.. తద్వారా ఉద్యోగాలకు పొంచి…
తమిళనాడు ఎన్నికలు నిన్నటితో అయిపోయాయి. ఫలితాలు రావడానికి ఇంకా పది రోజులు టైం ఉండటంతో ఇండస్ట్రీ, పొలిటికల్ వర్గాలు రిలాక్స్…