బెల్లంకొండ శ్రీనివాస్ ఇంకా తెలుగు సినిమా మార్కెట్లోనే సరిగా నిలదొక్కుకోలేదు. వరుస ఫ్లాపుల తర్వాత రాక్షసుడు సినిమా ఒక మాదిరిగా ఆడిందంతే. ఇలాంటి టైమ్లో అతను బాలీవుడ్ ఎంట్రీపై దృష్టి పెట్టాడు. ప్రభాస్ని మాస్ హీరోగా మలచిన ‘ఛత్రపతి’ చిత్రాన్ని హిందీలో చేయాలని డిసైడ్ అయ్యాడు.
ఇందుకోసం తనను ‘అల్లుడు శీను’గా పరిచయం చేసిన వినాయక్ను దర్శకుడిగా ఎంచుకున్నాడు. అయితే ఇప్పుడు ఇతగాడికి బాలీవుడ్ మీద దృష్టి ఎందుకనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇంకా తెలుగునాట స్టడీ మార్కెట్ లేకుండా పక్క చూపులు దేనికని అడిగేవాళ్లు చాలా మందే వున్నారు. అయితే దీని వెనకో స్ట్రాటజీ వుందట.
బెల్లంకొండ నటించిన తెలుగు సినిమాల హిందీ అనువాదాలకు చాలా వ్యూస్ వస్తుంటాయి. అతని ప్రతి సినిమాకు హిందీ డబ్బింగ్ రైట్స్ మంచి ధర పలుకుతుంటాయి. అసలు హిందీలో స్ట్రెయిట్ సినిమా చేయకుండానే ఇంత క్రేజ్ వుంటే ఇక డైరెక్ట్ సినిమా చేస్తే ఎలాగుంటుందని ఆలోచించారట.
ఒకవేళ ఈ ఛత్రపతి రీమేక్ క్లిక్ అయితే ఇక మీదట తన సినిమాలను తెలుగు, హిందీ భాషలలో ఒకేసారి చేసుకోవచ్చునని, తద్వారా తన మార్కెట్ మరింత పెరుగుతుందని అతను భావిస్తున్నాడట. అయితే వినాయక్తో బైలింగ్వల్ ప్లాన్ చేయకుండా ఇలా అచ్చంగా హిందీ సినిమానే చేస్తే తెలుగులో అంతవరకు సినిమా లేక గ్యాప్ వచ్చేస్తుంది కదా. ఇది కూడా ఓసారి ఆలోచించుకుని దిగితే బాగుండేది.
This post was last modified on November 27, 2020 1:46 pm
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించిన ఒక ముఖ్యమైన అనౌన్స్ మెంట్…
మిరపకాయ్ కాంబినేషన్ రిపీట్ అవుతుందని అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకున్న మిస్టర్ బచ్చన్ గత ఏడాది తీవ్రంగా నిరాశ పరచడం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు మంగళవారం నిజంగానే ఓ విచిత్ర అనుభవాన్ని మిగిల్చింది. మంగళవారం…
ఈ రోజు అల్లు అర్జున్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అట్లీ దర్శకత్వంలో అతను చేయబోయే మెగా మూవీకి సంబంధించిన…
సింగపూర్ లో సోమవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదం భారీదేనని చెప్పాలి. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సింగపూర్ లో చదువుతున్న తన కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్…