బెల్లంకొండ శ్రీనివాస్ ఇంకా తెలుగు సినిమా మార్కెట్లోనే సరిగా నిలదొక్కుకోలేదు. వరుస ఫ్లాపుల తర్వాత రాక్షసుడు సినిమా ఒక మాదిరిగా ఆడిందంతే. ఇలాంటి టైమ్లో అతను బాలీవుడ్ ఎంట్రీపై దృష్టి పెట్టాడు. ప్రభాస్ని మాస్ హీరోగా మలచిన ‘ఛత్రపతి’ చిత్రాన్ని హిందీలో చేయాలని డిసైడ్ అయ్యాడు.
ఇందుకోసం తనను ‘అల్లుడు శీను’గా పరిచయం చేసిన వినాయక్ను దర్శకుడిగా ఎంచుకున్నాడు. అయితే ఇప్పుడు ఇతగాడికి బాలీవుడ్ మీద దృష్టి ఎందుకనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇంకా తెలుగునాట స్టడీ మార్కెట్ లేకుండా పక్క చూపులు దేనికని అడిగేవాళ్లు చాలా మందే వున్నారు. అయితే దీని వెనకో స్ట్రాటజీ వుందట.
బెల్లంకొండ నటించిన తెలుగు సినిమాల హిందీ అనువాదాలకు చాలా వ్యూస్ వస్తుంటాయి. అతని ప్రతి సినిమాకు హిందీ డబ్బింగ్ రైట్స్ మంచి ధర పలుకుతుంటాయి. అసలు హిందీలో స్ట్రెయిట్ సినిమా చేయకుండానే ఇంత క్రేజ్ వుంటే ఇక డైరెక్ట్ సినిమా చేస్తే ఎలాగుంటుందని ఆలోచించారట.
ఒకవేళ ఈ ఛత్రపతి రీమేక్ క్లిక్ అయితే ఇక మీదట తన సినిమాలను తెలుగు, హిందీ భాషలలో ఒకేసారి చేసుకోవచ్చునని, తద్వారా తన మార్కెట్ మరింత పెరుగుతుందని అతను భావిస్తున్నాడట. అయితే వినాయక్తో బైలింగ్వల్ ప్లాన్ చేయకుండా ఇలా అచ్చంగా హిందీ సినిమానే చేస్తే తెలుగులో అంతవరకు సినిమా లేక గ్యాప్ వచ్చేస్తుంది కదా. ఇది కూడా ఓసారి ఆలోచించుకుని దిగితే బాగుండేది.
This post was last modified on November 27, 2020 1:46 pm
"నా అక్కలు నాపై యుద్ధం చేస్తున్నారు. నాకు ఏమీతెలీదు అని ఎన్ని సార్లు చెప్పినా.. తమ్ముడని కూడా చూడకుండా మాటలు…
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు బిగ్ రిలీఫ్ దక్కింది. ఆయనపై ఉన్న సస్పెన్షన్ను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (సీఏటీ)…
టాలీవుడ్ గమనాన్ని ఆసాంతం మార్చిన అతి కొద్ది సినిమాల్లో బాహుబలి స్థానం చాలా ప్రత్యేకం. అప్పటిదాకా మహా అయితే వంద…
భావం మంచిదే అయినా.. మాట తీరు కూడా.. అంతే మంచిగా ఉండాలి. మాటలో ఏ చిన్న తేడా వచ్చినా.. భావం…
హాలీవుడ్ లో ఎప్పటి నుంచో ఉన్న సినిమాటిక్ యునివర్స్ కాన్సెప్ట్ ని క్రమంగా మన దర్శకులు బాగా పుణికి పుచ్చుకుంటున్నారు.…
కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాస్ పోర్టును రెడీ చేసుకుని సిద్ధంగా పెట్టుకున్నారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల…