బెల్లంకొండ శ్రీనివాస్ ఇంకా తెలుగు సినిమా మార్కెట్లోనే సరిగా నిలదొక్కుకోలేదు. వరుస ఫ్లాపుల తర్వాత రాక్షసుడు సినిమా ఒక మాదిరిగా ఆడిందంతే. ఇలాంటి టైమ్లో అతను బాలీవుడ్ ఎంట్రీపై దృష్టి పెట్టాడు. ప్రభాస్ని మాస్ హీరోగా మలచిన ‘ఛత్రపతి’ చిత్రాన్ని హిందీలో చేయాలని డిసైడ్ అయ్యాడు.
ఇందుకోసం తనను ‘అల్లుడు శీను’గా పరిచయం చేసిన వినాయక్ను దర్శకుడిగా ఎంచుకున్నాడు. అయితే ఇప్పుడు ఇతగాడికి బాలీవుడ్ మీద దృష్టి ఎందుకనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇంకా తెలుగునాట స్టడీ మార్కెట్ లేకుండా పక్క చూపులు దేనికని అడిగేవాళ్లు చాలా మందే వున్నారు. అయితే దీని వెనకో స్ట్రాటజీ వుందట.
బెల్లంకొండ నటించిన తెలుగు సినిమాల హిందీ అనువాదాలకు చాలా వ్యూస్ వస్తుంటాయి. అతని ప్రతి సినిమాకు హిందీ డబ్బింగ్ రైట్స్ మంచి ధర పలుకుతుంటాయి. అసలు హిందీలో స్ట్రెయిట్ సినిమా చేయకుండానే ఇంత క్రేజ్ వుంటే ఇక డైరెక్ట్ సినిమా చేస్తే ఎలాగుంటుందని ఆలోచించారట.
ఒకవేళ ఈ ఛత్రపతి రీమేక్ క్లిక్ అయితే ఇక మీదట తన సినిమాలను తెలుగు, హిందీ భాషలలో ఒకేసారి చేసుకోవచ్చునని, తద్వారా తన మార్కెట్ మరింత పెరుగుతుందని అతను భావిస్తున్నాడట. అయితే వినాయక్తో బైలింగ్వల్ ప్లాన్ చేయకుండా ఇలా అచ్చంగా హిందీ సినిమానే చేస్తే తెలుగులో అంతవరకు సినిమా లేక గ్యాప్ వచ్చేస్తుంది కదా. ఇది కూడా ఓసారి ఆలోచించుకుని దిగితే బాగుండేది.
సినీ నిర్మాతల్లో బండ్ల గణేష్ డిఫరెంట్. సినీ రంగంలో మాత్రమే కాకుండా, రాజకీయంగా కూడా ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు. ప్రత్యేకించి…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తాజాగా సరికొత్త రికార్డు సృష్టించారు. దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన ప్రధాన మంత్రిగా ఇప్పటి వరకు…
పెద్ది కమర్షియల్ రేంజ్, వసూళ్ల లెక్కలు ఇంకా చాలా దూరం తర్వాత డిస్కస్ చేయాల్సిన మ్యాటర్. కానీ ముందే మాట్లాడుకోవాల్సిన…
తమిళనాడు ముఖ్యమంత్రిగా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్… పాలనలో తనదైన శైలి కొత్త తరహాతో దూసుకుపోతున్నారు. అంతేకాదండోయ్..…
నాలుగు నెలల తర్వాత ఏపీ తెలంగాణ థియేటర్లు నిండుగా కళకళలాడుతూ కనిపించాయి. కారణం పెద్ది. ఒక పెద్ద స్టార్ హీరో…
ఇండియా చరిత్రలోనే అత్యంత ఖరీదైన సినిమాగా చెప్పుకుంటున్న రామాయణ విడుదలకు జూన్ మినహాయిస్తే ఇంకో నాలుగు నెలలు మాత్రమే ఉంటుంది.…