బెల్లంకొండ శ్రీనివాస్ ఇంకా తెలుగు సినిమా మార్కెట్లోనే సరిగా నిలదొక్కుకోలేదు. వరుస ఫ్లాపుల తర్వాత రాక్షసుడు సినిమా ఒక మాదిరిగా ఆడిందంతే. ఇలాంటి టైమ్లో అతను బాలీవుడ్ ఎంట్రీపై దృష్టి పెట్టాడు. ప్రభాస్ని మాస్ హీరోగా మలచిన ‘ఛత్రపతి’ చిత్రాన్ని హిందీలో చేయాలని డిసైడ్ అయ్యాడు.
ఇందుకోసం తనను ‘అల్లుడు శీను’గా పరిచయం చేసిన వినాయక్ను దర్శకుడిగా ఎంచుకున్నాడు. అయితే ఇప్పుడు ఇతగాడికి బాలీవుడ్ మీద దృష్టి ఎందుకనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇంకా తెలుగునాట స్టడీ మార్కెట్ లేకుండా పక్క చూపులు దేనికని అడిగేవాళ్లు చాలా మందే వున్నారు. అయితే దీని వెనకో స్ట్రాటజీ వుందట.
బెల్లంకొండ నటించిన తెలుగు సినిమాల హిందీ అనువాదాలకు చాలా వ్యూస్ వస్తుంటాయి. అతని ప్రతి సినిమాకు హిందీ డబ్బింగ్ రైట్స్ మంచి ధర పలుకుతుంటాయి. అసలు హిందీలో స్ట్రెయిట్ సినిమా చేయకుండానే ఇంత క్రేజ్ వుంటే ఇక డైరెక్ట్ సినిమా చేస్తే ఎలాగుంటుందని ఆలోచించారట.
ఒకవేళ ఈ ఛత్రపతి రీమేక్ క్లిక్ అయితే ఇక మీదట తన సినిమాలను తెలుగు, హిందీ భాషలలో ఒకేసారి చేసుకోవచ్చునని, తద్వారా తన మార్కెట్ మరింత పెరుగుతుందని అతను భావిస్తున్నాడట. అయితే వినాయక్తో బైలింగ్వల్ ప్లాన్ చేయకుండా ఇలా అచ్చంగా హిందీ సినిమానే చేస్తే తెలుగులో అంతవరకు సినిమా లేక గ్యాప్ వచ్చేస్తుంది కదా. ఇది కూడా ఓసారి ఆలోచించుకుని దిగితే బాగుండేది.
This post was last modified on November 27, 2020 1:46 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…