గత రెండు రోజులుగా సోషల్ మీడియాని ఊపేసిన టాపిక్స్ లో కాంతార హీరో రిషబ్ శెట్టి హైదరాబాద్ ఈవెంట్ లో కన్నడలో మాట్లాడిన స్పీచ్ బాగా తిరిగింది. అంతో ఇంతో తెలుగు వచ్చినప్పటికీ అసలా భాషే రాదనే రీతిలో ప్రసంగించడం బ్యాక్ ఫైర్ అయ్యింది. కొందరు ఏకంగా బాయ్ కాట్ నినాదం తలకెత్తుకోవడంతో జరుగుతున్న డ్యామేజ్ గుర్తించిన రిషబ్ అనుకున్నట్టే విజయవాడ వేడుకలో దానికి చెక్ పెట్టేశాడు. తెలుగు కన్నడ భాషలు సోదరుల్లాంటివని, ఒక కన్నడిగుడు ఎప్పుడు ఇతర బాషలను ప్రేమిస్తాడని, తనకు ఎలాంటి వ్యత్యాసం లేదని, కేవలం పట్టు లేకపోవడం వల్లే పొరపాట్లు జరుగుతాయనే రీతిలో క్లారిటీ ఇచ్చేశాడు.
అంతేకాదు జై హనుమాన్ లో నటించే సమయంలో తెలుగుని ఇంకా బాగా నేర్చుకుంటానని నిర్మాత మైత్రి రవిని ఉద్దేశించి చెప్పడంతో ఫ్యాన్స్ చప్పట్లు కొట్టారు. ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబునాయుడులకు సభా వేదికగా కృతజ్ఞతలు చెప్పిన రిషబ్ క్లుప్తంగా మాట్లాడ్డం గమనార్హం. కన్నడలో అయితే ఎక్కువ సేపు విశేషాలు పంచుకోవడానికి ఛాన్స్ ఉండేది కానీ మళ్ళీ వ్యతిరేకత మూటగట్టుకోవడం ఇష్టం లేక తెలుగుకే పరిమితం కావడం విశేషం. అంటే సోషల్ మీడియా ప్రభావం, అందులో జరిగిన ట్రోలింగ్ రిషబ్ శెట్టి దృష్టికి బలంగా వచ్చినట్టు ఉంది. ముంబైలోనూ దీని ప్రస్తావన తెచ్చారు.
ఇంకొక్క రోజులో కాంతారా చాప్టర్ 1 ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవోలు ఆలస్యం కావడంతో అడ్వాన్స్ బుకింగ్స్ లేట్ గా మొదలుపెట్టిన కాంతారా చాప్టర్ 1 టీమ్ రేపు రాత్రి టాక్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అయితే ఈ షోలు చెప్పిన టైం ప్రకారం పది గంటలకు ఉంటాయా లేక రద్దు చేస్తారా అనే టాక్ ట్రేడ్ వర్గాల్లో తిరుగుతోంది. టైం తక్కువగా ఉండటంతో వేయాలా వద్దా అనే మీమాంసలో డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నట్టు సమాచారం. భారీ అంచనాలు, ఏపీలో టికెట్ రేట్ల పెంపు, ఒక వర్గం తెలుగు ఆడియన్స్ నిరసనల మధ్య బరిలో దిగుతున్న కాంతార అంచనాలకు మించి ఉంటేనే బ్లాక్ బస్టర్ అందుకుంటుంది.
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…