Movie News

హైదరాబాద్ వివాదం… విజయవాడలో పరిష్కారం?

ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిధిగా విచ్చేసిన కాంతార ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి పూర్తి కన్నడలో మాట్లాడ్డం, సోషల్ మీడియాలో వివాదానికి దారి తీయడం చూస్తున్నాం. అది ఏకంగా బాయ్ కాట్ కాంతార అని పిలుపు ఇచ్చే దాకా వెళ్లిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తన ఉద్దేశంలో తప్పు లేకపోవచ్చు కానీ భాషని ఎంచుకోవడంలో చేసిన పొరపాటు వల్ల ఏకంగా ఓపెనింగ్స్ మీద ప్రభావం పడేలా చేసింది. పైగా ఏపీ ప్రభుత్వం కాంతార టికెట్ ధరల పెంపుకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మరో రకమైన వ్యతిరేకతను మూటగట్టుకుంది. ఇదంతా అర్జెంట్ గా రిపేర్ చేయాల్సిన డ్యామేజ్.

ఈ నేపథ్యంలో ఇవాళ విజయవాడలో జరగబోయే ఈవెంట్ లో మరోసారి రిషబ్ శెట్టి మాట్లాడబోయే సందర్భం రానుంది. గొల్లపూడి ఎక్స్ పో గ్రౌండ్స్ లో జరగనున్న వేడుక ద్వారా రిషబ్ శెట్టి జరిగిన దానికి వివరణ ఇచ్చే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్ల పెంపు రావడానికి పవన్ కళ్యాణ్ చొరవ తీసుకోవడంతో ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు తానెందుకు కేవలం కన్నడలోనే మొన్న ఈవెంట్ లో మాట్లాడాల్సి వచ్చిందో కొంచెం ఎక్స్ ప్లనేషన్ ఇవొచ్చు. నిజానికి రిషబ్ శెట్టికి ఓ మోస్తరుగా తెలుగు వచ్చు. ధారాళంగా కాకపోయినా కొద్దికొద్దిగా మాట్లాడగలడు. అది చాలు ఆడియన్స్ ని కూల్ చేయడానికి.

బజ్ ఎంత ఉందనేది పక్కన పెడితే కాంతార ఓపెనింగ్స్ సినిమా ఫలితంలో కీలక పాత్ర పోషించనున్నాయి. మొదటి భాగం టైంలో అంచనాలు లేవు. థియేటర్ బిజినెస్ తక్కువకు చేశారు. కన్నడ వెర్షన్ తో పోలిస్తే రెండు వారాలు ఆలస్యంగా తెలుగులో రిలీయ్యింది. అయినా సరే బ్లాక్ బస్టర్ విజయం దక్కింది. కానీ కాంతార చాప్టర్ 1 నాటికి లెక్కలు మారిపోయాయి. రేట్ అమాంతం పెరిగింది. మైత్రి సంస్థ హక్కులు సొంతం చేసుకుంది. ఏకంగా టికెట్ రేట్లు ఎక్కువ చేయమని అడిగే రేంజ్ లో ఉంది. సో ఈ ప్రశ్నలు అన్నింటికి కాకపోయినా కొన్నింటికి రిషబ్ శెట్టి వైపు సమాధానం వచ్చే ఛాన్స్ ఇవాళ ఉంది. చూద్దాం.

This post was last modified on September 30, 2025 12:25 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

45 minutes ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

47 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

2 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

2 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

6 hours ago