ఈ మధ్య ఓటీటీల్లో రిలీజైన తెలుగు చిత్రాలు.. కలర్ ఫోటో, మిస్ ఇండియా, మిడిల్ క్లాస్ మెలొడీస్. ఈ మూడు చిత్రాల్లో కామన్గా కనిపించే విషయం ఒకటుంది. ఆ విషయం పేరు.. దివ్య శ్రీపాద. ఈ కొత్తమ్మాయి ఈ మూడు చిత్రాల్లోనూ ముఖ్య పాత్రలు పోషించిన సంగతి చాలామంది గుర్తించి ఉండరు. చాలా సింపుల్గా కనిపిస్తూనే సహజమైన అందం, అభినయంతో ఆకట్టుకుంటోందీ అమ్మాయి.
సినిమాలు మాత్రమే చూసే జనాలకు ఈ అమ్మాయి కొత్తగా అనిపించొచ్చు కానీ.. షార్ట్ ఫిలిమ్స్ ఫాలో అయ్యేవాళ్లకు దివ్య బాగానే పరిచయం. పలు షార్ట్ ఫిలిమ్స్తో సత్తా చాటిన ఈ అమ్మాయి.. ఆ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన ఫిలిం మేకర్ల దృష్టిలో పడి వరుసగా అవకాశాలు అందుకుంటోంది. ప్రతి అమ్మాయి హీరోయిన్ కావాలనే అనుకుంటుంది కానీ.. దివ్య మాత్రం పాత్ర ప్రాధాన్యాన్ని బట్టి సహాయ పాత్రలు చేయడానికి కూడా సై అంది. అదే ఆమె కెరీర్ను మలుపు తిప్పింది.
ఒక కొత్తమ్మాయి సహాయ పాత్రలు పోషించిన మూడు సినిమాలు నెల వ్యవధిలో వరుసగా ఓటీటీల్లో రిలీజవడం, వాటితో ఆమెకు మంచి పేరు రావడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ‘కలర్ ఫోటో’లో హీరోయిన్తో పాటే ఉంటూ చాలా స్క్రీన్ టైం పొందిన దివ్య.. తన సింప్లిసిటీతో ప్రేక్షకులపై బలమైన ముద్రే వేసింది. ‘మిస్ ఇండియా’లో సైతం హీరోయిన్ కీర్తి స్నేహితురాళ్లలో ఒకరిగా దివ్య సత్తా చాటుకుంది.
ఇప్పుడు ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’లో దివ్య మరింతగా హైలైట్ అయింది. హీరోయిన్ వర్ష బొల్లమ్మను మించి ఈమె ఈ సినిమాలో ప్రత్యేకతను చాటుకోవడం విశేషం. హీరోయిన్ పాత్ర కంటే దివ్య క్యారెక్టరే ప్రత్యేకంగా అనిపిస్తుంది. తాగుబోతు తండ్రి చెప్పినట్లు ఒక రోగ్ను పెళ్లి చేసుకోలేక, నచ్చిన అబ్బాయికి తన ప్రేమను చెప్పలేక సతమతం అయ్యే పేదింటి అమ్మాయిగా ఆమె నటన కట్టి పడేస్తుందీ చిత్రంలో. ఈ సినిమా చూశాక ఎవరీ అమ్మాయి అని ఆరా తీయడం మొదలుపెడుతున్నారు జనాలు. త్వరలో ఆమె హీరోయిన్ పాత్రలు వేసినా ఆశ్చర్యం లేదేమో.
This post was last modified on November 26, 2020 4:40 pm
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…
అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…
వైసీపీ అధినేత జగన్ హయాంలో ఓ కుటుంబం రోడ్డున పడింది. కేవలం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి…
కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వైసీపీ నేతలకు, కార్యకర్తలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో పిచ్చి పిచ్చి…