ప్రస్తుతం టాలీవుడ్లో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అనడంలో ఎవరికీ సందేహలు లేవు. దాదాపుగా అందరు టాప్ స్టార్ల సినిమాలకూ అతను సంగీతం అందించాడు. చాలా వరకు తన ఆల్బమ్స్ పెద్ద హిట్టయ్యాయి. మహేష్ బాబుకు సైతం ‘దూకుడు’ సహా అదిరిపోయే ఆల్బమ్స్ ఇచ్చాడు, నేపథ్య సంగీతంతోనూ మెప్పించాడు.
కానీ ‘గుంటూరు కారం’ విషయానికి వచ్చేసరికి తమన్ మీద విమర్శలు తప్పలేదు. ఆ సినిమాలో ‘కుర్చీ మడత పెట్టి’ సాంగ్ ఎంత వైరల్ అయినప్పటికీ.. దాని మీద ట్రోలింగ్ జరిగింది. ఈ సినిమా రిలీజ్ టైంలోనూ మహేష్ ఫ్యాన్స్ నుంచి నెగెటివిటీ ఎదుర్కొన్నాడు తమన్. ఐతే తన తప్పేమీ లేకపోయినా మహేష్ ఫ్యాన్స్ తనను టార్గెట్ చేయడంతో డార్క్ రూంలో కూర్చుని ఏడ్చానని తమన్ వెల్లడించాడు.
తాను మహేష్ బాబుతో పని చేసే అవకావం వచ్చినపుడల్లా ది బెస్ట్ ఇచ్చానని.. అయినా తన మీద కొంతమంది ఎందుకు నెగెటివిటీ పెంచుకున్నారో అర్థం కాలేదని తమన్ అన్నాడు. ఈ సినిమా నుంచి తనను తప్పించాలని వేల కొద్దీ ట్వీట్లు వేశారని, అది చూసి తాను కంగారు పడ్డానని చెప్పాడు. ఐతే త్రివిక్రమ్ తనకు అండగా నిలిచి అవేమీ పట్టించుకోవద్దని ‘గుంటూరు కారం’కు తనతోనే పని చేయించుకున్నట్లు తెలిపాడు.
ఇక ఈ సినిమా రిలీజ్ తర్వాత మహేష్ ఫ్యాన్స్ మరింత రెచ్చిపోయారని.. సినిమా ఫెయిల్యూర్కు తనే కారణం అన్నట్లుగా ట్రోల్ చేశారని తమన్ వాపోయాడు. సినిమా బాలేకపోతే తానేం చేస్తా అనుకుంటూ ఒక డార్క్ రూంలో కూర్చుని తాను ఏడ్చానని తమన్ వెల్లడించాడు. ఐతే అప్పుడు కూడా త్రివిక్రమే తనకు ఓదార్పునిచ్చాడని తమన్ తెలిపాడు. సోషల్ మీడియా అకౌంట్లను దగ్గరుండి డెలీట్ చేయించి, ఈ నెగెటివిటీకి దూరంగా ఉండి తన పని తనను చూసుకోమని చెప్పి త్రివిక్రమ్ ధైర్యం చెప్పినట్లు తమన్ వెల్లడించాడు.
This post was last modified on September 28, 2025 11:44 pm
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…
కెజిఎఫ్ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ సాధించాక హీరో యష్ వేగంగా సినిమాలు చేయాలని తొందరపడలేదు. కోరుకుంటే స్టార్…
హీరో కిరణ్ అబ్బవరం మంచి ఊపులో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ అనుకున్న దానికన్నా బాగా ఆడటంతో పాటు యాభై…
కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వ్యక్తిగత ఫ్యామిలీ సంబంధాల గురించి రకరకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.…
భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి…