Movie News

బన్నీ కూడా పడ్డాడు.. శాటిలైట్ కొంప కొల్లేరే

పెరుగుట విరుగుట కొరకే అని ఒక సామెత. కొన్నేళ్ల కిందట్నుంచి కొత్తగా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల రూపంలో నిర్మాతలకు కొత్త ఆదాయ వనరు దొరికింది. ఆ ఆదాయం క్రమంగా పెరుగుతూ వచ్చింది. కరోనా దెబ్బకు థియేటర్లు మూత పడ్డ సమయంలో నేరుగా కొత్త సినిమాలను కొని రిలీజ్ చేయడం నిర్మాతలకు గొప్ప ఉపశమనాన్ని అందించింది కూడా.

ఐతే ఇది పరోక్షంగా థియేటర్ల వ్యవస్థనే కాదు.. శాటిలైట్ మార్కెట్‌ను కూడా దెబ్బతీస్తోందన్న సంగతి గుర్తించట్లేదు నిర్మాతలు. ఇప్పటిదాకా వచ్చిన నష్టాలను భరించలేక, భవిష్యత్ మీద ఆశల్లేక థియేటర్లు మూతపడుతున్న సంగతి చూస్తూనే ఉన్నాం. మరోవైపు శాటిలైట్ మార్కెట్ ఒక్కసారిగా అనూహ్యపతనం చవిచూడటం ఆందోళన కలిగిస్తోంది.

ఒకప్పుడు పెద్ద హీరోల సినిమాలు, థియేటర్లలో మంచి విజయం సాధించిన చిత్రాలను టీవీల్లో తొలిసారి ప్రిమియర్‌గా వేస్తే మినిమం 15 టీఆర్పీ వచ్చేది. రీటెలికాస్ట్‌లో కూడా 10 ప్లస్ టీఆర్పీకి గ్యారెంటీ ఉండేది. కానీ తొలిసారి ప్రిమియర్ వేసినా 10 టీఆర్పీ రావడం కూడా కష్టమైపోతోంది. ‘సాహో’ లాంటి భారీ చిత్రాన్ని ఇటీవలే టీవీల్లో వేస్తే 6 లోపు టీఆర్పీ వచ్చింది. అది డిజాస్టర్ మూవీ, పైగా ప్రిమియర్స్ లేటయ్యాయిలే అనుకుంటే.. ఈ ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ఒకటైన ‘భీష్మ’ను తాజాగా జెమిని టీవీలో ప్రసారం చేస్తే దానికి 6.65 టీఆర్పీ మాత్రమే వచ్చింది. ఇప్పుడు అల్లు అర్జున్ నాన్ బాహుబలి హిట్ ‘అల వైకుంఠపురములో’ సెకండ్ టెలికాస్ట్‌లో 7.91 టీఆర్పీ మాత్రమే నమోదు చేసింది. సాహో, భీష్మలతో పోలిస్తే ఇది బెటర్ టీఆర్పీనే కదా అనుకోవచ్చు.

కానీ వేసవిలో ఈ చిత్రాన్ని తొలిసారి ప్రిమియర్‌గా వేస్తే రికార్డు స్థాయిలో 29.4 టీఆర్పీ వచ్చింది. దాని దెబ్బకు పాత రికార్డులన్నీ బద్దలైపోయాయి. అలాంటిది కొన్ని నెలల తర్వాత సెకండ్ టెలికాస్ట్‌లో 8 లోపుకు టీఆర్పీ పడిపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. కరోనా కారణంగా థియేటర్లు మూతపడి ఓటీటీల హవా పెరగడంతో నేరుగా వాటిలోనే కొత్త సినిమాలను విడుదల చేయడం మొదలుపెట్టడంతో ప్రేక్షకులు కూడా పెద్ద ఎత్తున ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు తీసుకున్నారు. దీంతో ప్రతి ఇంట్లోనూ కొత్త సినిమాలను ఓటీటీల ద్వారా టీవీల్లో చూసేయడం మొదలైంది.

ఈ నేపథ్యంలో టీవీ ఛానెళ్లలో సినిమాలు వేసే సమయానికి జనాలకు ఆసక్తి ఉండట్లేదని, అందుకే ఇలా టీఆర్పీలు పడిపోతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఈ పరిణామాలు శాటిలైట్ మార్కెట్‌కు గట్టి దెబ్బే అని, ఇంతకుముందులా ఈ హక్కుల కోసం ఇక పోటీ ఉండకపోవచ్చని, ఆదాయం పడిపోవడం ఖాయమని స్పష్టమవుతోంది.

This post was last modified on November 26, 2020 5:09 pm

Share
Show comments

Recent Posts

దురంధర్ 2 ముందుకు – పుష్ప 2 వెనక్కు

మరో కొత్త రికార్డు బద్దలైపోయింది. మొన్నటి ఏడాది రిలీజైన పుష్ప 2 ది రైజ్ వసూళ్లను ఇప్పుడప్పుడే ఎవరూ క్రాస్…

1 hour ago

బిల్లు వ్యతిరేకతపై విశ్లేషకులు ఏమంటున్నారు?

దేశంలో సుదీర్ఘకాలంగా ఎలాంటి పెంపునకు గురి కాకుండా ఉండిపోయిన లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన తెర మీదకు రాగా... కాంగ్రెస్…

1 hour ago

ఏపీకి మోడీ వ‌రాలు

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం ఏపీపై వ‌రాల జ‌ల్లు కురిపించింది. శ‌నివారం జ‌రిగిన కేంద్ర మంత్రి వ‌ర్గ స‌మావేశంలో సుదీర్ఘ…

1 hour ago

జ‌గ‌న్ న‌చ్చాడా ప్ర‌కాష్‌రాజ్?

ఏపీ సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై బ‌హుభాషా న‌టుడు.. ప్ర‌కాష్‌రాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధాన మంత్రిని…

2 hours ago

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు సర్జరీ

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు శస్త్ర చికిత్స నిర్వహించారు. శుక్రవారం ఉదయం అధికారులతో పాలనాపరమైన అంశాలపై చర్చిస్తున్న సమయంలో…

2 hours ago

హాట్ టాపిక్… టాక్సిక్ వచ్చినా పెద్ది ఆగడా

జూన్ 4 విడుదల తేదీని ఎప్పుడో లాక్ చేసుకున్న టాక్సిక్ మళ్ళీ వాయిదా పడుతుందనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో…

3 hours ago