సరిగ్గా ఇంకో వారం రోజుల్లో కాంతారా చాప్టర్ 1 ది లెజెండ్ విడుదల కానుంది. ప్రమోషన్ల పరంగా ఇప్పటిదాకా ట్రైలర్ రిలీజ్ చేయడం, కన్నడలో రెండు మూడు ప్రెస్ మీట్లు పెట్టడం తప్ప హోంబాలే ఫిలిమ్స్ సైలెంట్ గా ఉంది. హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి టీమ్ ని వెంటేసుకుని బెంగళూరు ఉంచి ప్రెస్ మీట్లు మొదలుపెట్టి త్వరలో హైదరాబాద్ రానున్నాడు. ఇక్కడిదాకా బాగానే ఉంది కానీ ఓజికి వచ్చిన బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ కాంతార టీమ్ కు ఎంతైనా టెన్షన్ కలిగించేదే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్వాగ్ ఎంజాయ్ చేస్తున్న అభిమానులు ఇప్పుడప్పుడే శాంతించేలా లేరు. టికెట్ రేట్లు ఎంత ప్రియంగా ఉన్నా రిపీట్ రన్స్ చూస్తూ కలెక్షన్ల వర్షంలో భాగమవుతున్నారు.
కాంతార వచ్చే సమయానికే ఓజి రెండో వారంలో అడుగు పెడుతుంది. సరిగ్గా పండగ టైం కావడంతో ఇప్పుడున్న ట్రెండ్ అక్కడిదాకా కొనసాగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాంతారకు డిస్ట్రిబ్యూషన్ పరంగా మైత్రి అండదండలు ఉన్నా పవన్ మేనియా నుంచి కాంతారకు డైవర్ట్ చేయించడం అంత సులభం కాదు. పైగా పెంచిన ఓజి టికెట్ రేట్లు తగ్గింపుకొచ్చే సమయానికి కాంతారా వస్తుంది. అంటే సెకండ్ వీక్ లో ఉన్నా సరే ఓజాస్ గంభీర నుంచి కాంతారకు సవాల్ తప్పకపోవచ్చు. మూడు నిమిషాల ట్రైలర్ కు ఆన్ లైన్లో కొంత మిశ్రమ స్పందన రావడాన్ని టీమ్ సీరియస్ గా విశ్లేషించుకునే పనిలో ఉంది.
మాములుగా పవన్ మూవీకి యావరేజ్ లేదా హిట్ టాక్ వస్తేనే నిలువరించడం కష్టం. అలాంటిది ఇంత పెద్ద స్పందన దక్కించుకోవడం చూసి అభిమానులకు ఆనంద బాష్పాలు వస్తున్నాయి. సుజిత్ కూడా బయటికి వచ్చేసి ఎవరికీ తెలియని చాలా విషయాలు పంచుకుంటున్నాడు. ఓజాస్ గంభీర గతం మీద ఒక నవల విడుదల చేస్తా అంటున్నాడు. ఓజి ఊపు చూస్తుంటే సంక్రాంతికి వస్తున్నాం రేంజ్ లో కనీసం పది రోజులు స్ట్రాంగ్ గా ఉండేలా కనిపిస్తోంది. అదే జరిగితే కాంతారకు ఓపెనింగ్ రావొచ్చేమో కానీ కాంపిటీషన్ అయితే టఫ్ గా ఉంటుంది. చూడాలి మరి పోటీ ఎంత రసవత్తరంగా ఉంటుందో.
తెలుగు తమిళ భాషల్లో ఫాలోయింగ్ ఉన్న హీరో ప్రదీప్ రంగనాధన్ వరస విజయాలకు బ్రేక్ వేస్తూ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ…
ఐపీఎల్ అంటేనే చివరి బంతి వరకు ఉండే ఉత్కంఠ. కానీ ఈసారి ఆ మజా పూర్తిగా తగ్గిపోయింది. పరుగుల వరద…
నిజామాబాద్లో నటరాజ్ అనే ఒక సింగిల్ స్క్రీన్. దాని లీజ్ మార్పు గొడవ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ ఎస్వీసీ…
ఏపీ అధికార పార్టీ జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. సంచలన ప్రకటన చేశారు. పార్టీలో యువతరాన్ని ఆకర్షించేందుకు..…
పాలన విషయంలో మంత్రి లోకేష్ పక్కా ప్లానింగ్తో వ్యవహరిస్తున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. రాజకీయాలను విధానపరమైన అంశాలను కలగాపులగం…
పద్దెనిమిదేళ్ల అవమానాలు, ఎగతాళి మాటలకు బెంగళూరు జట్టు శాశ్వతంగా ముగింపు పలికింది. ఐపీఎల్ చరిత్రలో ట్రోల్స్ కు కేరాఫ్ అడ్రస్…