ఈ మధ్య కాలంలో భారీ అంచనాలున్న ప్యాన్ ఇండియా సినిమాల ఎడిటింగ్ లో అడ్డం వస్తోందని అనిపిస్తే చాలు కోట్లు ఖర్చు పెట్టి తీసినా పాటైనా సరే మొహమాటం లేకుండా డిలీట్ కొడుతున్నారు. ఇటీవలే మిరాయ్ లో వైబ్ ఉందిలే సాంగ్ ని ఫస్ట్ రిలీజ్ లో పెట్టలేదు. దాంతో ఫ్యాన్స్ షాక్ తిన్నారు. ఫ్లోకు అడ్డం వచ్చిందని హీరో తేజ సజ్జ, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని చెప్పిన మాటలు నిజమే అయినా ఇది లేకపోవడం కొంత అసంతృప్తిని కలిగించింది. పది రోజుల తర్వాత ఫ్రెష్ గా దాన్ని జోడించడం వేరే విషయం. గతంలో దేవర, కింగ్డమ్ లకు ఇదే సమస్య వచ్చిన సంగతి తెలిసిందే.
ఇప్పుడీ లిస్టులో ఓజి కూడా చేరింది. తమన్ కంపోజింగ్ చేసిన పాటకు నేహా శెట్టి డాన్స్ చేసింది. బ్యాంకాక్ లో షూట్ చేశారు. కానీ స్క్రీన్ మీద రాలేదు. ఇక్కడ కూడా ఫ్లోనే సమస్య. నెరేషన్ సీరియస్ గా సాగుతుంది. ఎక్కడా ఎంటర్ టైన్మెంట్ ఉండదు. ఎలివేషన్లతో ఫ్యాన్స్ ఊగిపోతూ ఉంటే ఇక కామెడీకి స్కోప్ ఎక్కడిది. అదే విధంగా ఐటెం సాంగ్ పెట్టే అవకాశం కూడా కనిపించలేదు. పైగా ప్రియాంక మోహన్ తో అంత ఎమోషనల్ ఎపిసోడ్ పెట్టాక నేహాతో ఆటా పాట అంటే బాగుండదని అనుకున్నారేమో. ఇన్ సైడ్ టాక్ అయితే రాబోయే సోమవారం నుంచి యాడ్ చేస్తారట. దీని లిరికల్ వీడియో అయితే వదల్లేదు.
ఏది ఏమైనా ఇకపై నిర్మాతలు ఒకటికి రెండుసార్లు స్క్రిప్ట్ దశలోనే ఫలానా పాటలు అవసరమా లేదా అని దర్శకుల దగ్గర క్లారిటీ తీసుకోవాలి. ఒకవేళ వద్దు అనుకుంటే బోలెడు డబ్బు ఆదా అవుతుంది. దాన్ని ఇతర అవసరాల కోసం వాడుకోవచ్చు. ఎందుకంటే ఒక సినిమా రిలీజై వారం పది రోజులు రన్ పూర్తి చేసుకున్నాక ఆటోమేటిక్ గా దాన్ని లైఫ్ తగ్గిపోతుంది. హఠాత్తుగా డిలీట్ చేసిన పాట పెట్టినంత మాత్రం కలెక్షన్లు అమాంతం పెరిగిపోవు. ఓజిలో నేహా శెట్టిని చూడాలంటే ఎన్ని రోజులు ఆగాలో మరి. దీనికి సంబంధించిన అప్డేట్ వీకెండ్ లోపు రావొచ్చని అంతర్గత వర్గాల సమాచారం.
This post was last modified on September 25, 2025 1:23 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…