తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు టాప్ హీరోయిన్గా ఎదిగిన పూజ హెగ్డేకి ఇంకా హై డిమాండ్ వుంది. ఆమె అడిగినంత పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు సై అంటున్నారు. ఆమె డేట్స్ ఇస్తే చాలు, రెమ్యూనరేషన్ ఎంతయినా ఫర్లేదని అడ్జస్ట్ అవుతున్నారు. అయితే ఇంత డిమాండ్ వున్నా కానీ పూజ హెగ్డే కొన్నాళ్ల పాటు తెలుగు వాళ్లకు అందుబాటులో వుండదు. ఎందుకంటే ఆమె ఇప్పుడు సల్మాన్ఖాన్తో ఒకటి, రణ్వీర్ సింగ్తో ఒకటి చొప్పున సినిమా చేస్తూ బాలీవుడ్లో యమ బిజీగా వుంది. బాలీవుడ్ వర్సెస్ తెలుగు సినిమా అంటే ఏ హీరోయిన్ అయినా ముందుగా హిందీ చిత్ర సీమనే కోరుకుంటుంది.
అందులోను అంత పెద్ద స్టార్స్తో సినిమాలంటే పూజ వాటిని వదులుకునేంత తెలివిలేనిది కాదు. రాధే శ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ తర్వాత పూజ హెగ్డే ఇక తెలుగు సినిమాల్లో ఇప్పట్లో కనిపించే వీల్లేదు. ఎందుకంటే హిందీ చిత్ర సీమలో ఇప్పుడు హాట్ హీరోయిన్లు చాలా తక్కువైపోయారు. సల్మాన్, రణ్వీర్ సినిమాల తర్వాత పూజ కోసం మరింత మంది బాలీవుడ్ నిర్మాతలు క్యూ కడతారు. ఇప్పుడు తెలుగు చిత్ర నిర్మాతలు తనకు అయిదు కోట్లు ఇచ్చినా కానీ పూజ హెగ్డే ఆ ఆఫర్ని కాదనవచ్చు.
This post was last modified on November 26, 2020 10:39 am
ముందు విడుదల తేదీని ప్రకటించుకుని, ఆ తర్వాత పోటీదారులు వస్తే తప్పని పరిస్థితుల్లో డేట్ మార్చుకునే పరిస్థితి చిన్న సినిమాలకే…
ఏపీలో రాముడి తరహా రామరాజ్యం తీసుకురావాలన్నదే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. రామరాజ్యం అంటే.. ఏపీ సమగ్ర అభివృద్ధి…
తమిళనాడులో బీజేపీ-అన్నాడీఎంకే పొత్తు పెట్టుకోవడంపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.…
హీరోలు మాత్రమేనా పాన్ ఇండియా రేంజికి వెళ్లేది.. నిర్మాతలు వెళ్లలేరా అన్నట్లు బహు భాషల్లో సినిమాలు తీస్తూ దూసుకెళ్తోంది టాలీవుడ్ అగ్ర…
సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు ఎంతకు తెగిస్తున్నారన్న దానికి ఈ ఘటన నిలువెత్తు నిదర్శనమని చెప్పక తప్పదు. జనసేన అధినేత, ఏపీ…
వైసీపీ కీలక నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు శుక్రవారం ఊహించని షాక్ తగిలింది. పోలీసుల అదుపులోని నిందితుడిపై…