తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు టాప్ హీరోయిన్గా ఎదిగిన పూజ హెగ్డేకి ఇంకా హై డిమాండ్ వుంది. ఆమె అడిగినంత పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు సై అంటున్నారు. ఆమె డేట్స్ ఇస్తే చాలు, రెమ్యూనరేషన్ ఎంతయినా ఫర్లేదని అడ్జస్ట్ అవుతున్నారు. అయితే ఇంత డిమాండ్ వున్నా కానీ పూజ హెగ్డే కొన్నాళ్ల పాటు తెలుగు వాళ్లకు అందుబాటులో వుండదు. ఎందుకంటే ఆమె ఇప్పుడు సల్మాన్ఖాన్తో ఒకటి, రణ్వీర్ సింగ్తో ఒకటి చొప్పున సినిమా చేస్తూ బాలీవుడ్లో యమ బిజీగా వుంది. బాలీవుడ్ వర్సెస్ తెలుగు సినిమా అంటే ఏ హీరోయిన్ అయినా ముందుగా హిందీ చిత్ర సీమనే కోరుకుంటుంది.
అందులోను అంత పెద్ద స్టార్స్తో సినిమాలంటే పూజ వాటిని వదులుకునేంత తెలివిలేనిది కాదు. రాధే శ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ తర్వాత పూజ హెగ్డే ఇక తెలుగు సినిమాల్లో ఇప్పట్లో కనిపించే వీల్లేదు. ఎందుకంటే హిందీ చిత్ర సీమలో ఇప్పుడు హాట్ హీరోయిన్లు చాలా తక్కువైపోయారు. సల్మాన్, రణ్వీర్ సినిమాల తర్వాత పూజ కోసం మరింత మంది బాలీవుడ్ నిర్మాతలు క్యూ కడతారు. ఇప్పుడు తెలుగు చిత్ర నిర్మాతలు తనకు అయిదు కోట్లు ఇచ్చినా కానీ పూజ హెగ్డే ఆ ఆఫర్ని కాదనవచ్చు.
This post was last modified on November 26, 2020 10:39 am
ఏప్రిల్ 30 'పెద్ది' తప్పుకున్నాక అందరి దృష్టి ఆ స్లాట్ మీద పడింది. ఇది ముందే ఊహించిన 'గాయపడ్డ సింహం'…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. వాస్తవానికి ఇప్పటికే చాలా బిల్లులు పెండింగులో ఉండగా..…
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…