పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక అంచనాలతో రిలీజవుతున్న సినిమా.. ఓజీ. మూడేళ్ల ముందు మొదలైన ఈ సినిమా.. పవన్ పొలిటికల్, సినీ కమిట్మెంట్ల వల్ల ఆలస్యమై.. ఎట్టకేలకు కొన్ని నెలల ముందే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ముందు రోజు రాత్రి నుంచే తెలుగు రాష్ట్రాల్లో ప్రిమియర్స్ కూడా పడబోతున్నాయి. పవన్ చివరి చిత్రం ‘హరిహర వీరమల్లు’ తీవ్రంగా నిరాశపరచడంతో ఈ చిత్రంపై అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు.
‘వీరమల్లు’లా ఈ చిత్రానికి బడ్జెట్, బిజినెస్ పరంగా సమస్యలు రాలేదు. ‘వీరమల్లు’కు పవన్ తన పారితోషకం కూడా పూర్తిగా అందుకోలేని పరిస్థితి తలెత్తింది. రిలీజ్ తర్వాత లాభాలు వస్తే చూద్దాం అనుకున్న పవన్.. అందుకు అవకాశం లేక ఊరుకున్నాడు. ఐతే ‘ఓజీ’కి మాత్రం ఏ రకమైన ఇబ్బందీ లేదు. అనుకున్న దాని కంటే బడ్జెట్ పెరిగినప్పటికీ.. బిజినెస్ భారీగా జరగడంతో నిర్మాత మంచి లాభాలే అందుకున్నాడు. దీంతో పవన్కు ఆయన స్టార్ పవర్కు తగ్గట్లే పారితోషకం ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకు పవన్ రూ.70 కోట్ల మేర రెమ్యూనరేషన్ తీసుకున్నాడట. ముందు అనుకున్న మొత్తం కంటే ఇది కొంచెం ఎక్కువే అని తెలుస్తోంది. సినిమాకు రూ.200 కోట్లకు పైగానే బడ్జెట్ అయినట్లు సమాచారం. ఇందులో మేకింగ్ కోసం పెట్టిన ఖర్చు సగమే. కానీ పారితోషకాలు, సినిమా మేకింగ్ ఆలస్యం కావడం వల్ల పడ్డ వడ్డీల భారమే ఎక్కువైంది. అయినా సరే ‘ఓజీ’కి ట్రేడ్ వర్గాల్లో విపరీతమైన డిమాండ్ రావడంతో నిర్మాతకు మంచి లాభాలే అందాయి.
సినిమా బిజినెస్ రూ.300 కోట్ల మార్కును టచ్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో డిజిటల్ హక్కులే రూ.100 కోట్లను మించిపోయాయి. బయ్యర్లు సినిమాపై భారీ పెట్టుబడులే పెట్టినప్పటికీ.. బ్రేక్ ఈవెన్ కష్టంగా ఏమీ అనిపించడం లేదు. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మంచి లాభాలు కూడా అందుకోవచ్చు.
This post was last modified on September 24, 2025 11:52 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…