ఈ ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘కాంతార: చాప్టర్-1’ ఒకటి. మూడేళ్ల ముందు చిన్న సినిమాగా మొదలై.. పాన్ ఇండియా స్థాయిలో ఎవ్వరూ ఊహించని అసాధారణ విజయాన్ని అందుకుంది ‘కాంతార’. దానికి ప్రీక్వెల్గా తెరకెక్కిన ‘కాంతార: చాప్టర్-1’పై భారీ అంచనాలే ఉన్నాయి. సైలెంట్గా మేకింగ్ పూర్తి చేసిన చిత్ర బృందం.. ఇటీవలే ట్రైలర్ లాంచ్ చేసింది. అది ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. రిలీజ్ వీక్లో ప్రమోషన్లు కొంచెం గట్టిగా చేయాలని టీం భావిస్తోంది.
ఈ లోపు ఈ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ సోషల్ మీడియాలో కలకలం రేపింది. ఆధ్యాత్మిక, దైవ సంబంధిత అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా చూడాలంటే రాబోయే వారం రోజుల పాటు మందు, సిగరెట్ ముట్టుకోకూడదని.. అలాగే మాంసాహారం కూడా మానేయాలని ‘కాంతార’ టీం పిలుపు ఇచ్చినట్లుగా ఉంది ఆ పోస్టర్. ఈ మేరకు గూగుల్ ఫామ్ కూడా ఫిల్ చేయాలని అభిమానులను టీం కోరినట్లుగా అందులో ఉంది.
ఈ పోస్టర్ వైరల్ కావడంతో ఇదేం పబ్లిసిటీ, ఇవేం కండిషన్లు అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోయారు. సినిమా చూడాలంటే నాన్ వెజ్, మందు మానేయాలా అంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఈ విషయం ‘కాంతార’ టీం వరకు వెళ్లింది. దీనిపై హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి స్పందించాడు. ఈ పోస్టర్కు, టీంకు సంబంధం లేదని.. తాము అలాంటి కండిషన్లేమీ ప్రేక్షకులకు పెట్టలేదని అతను స్పష్టం చేశాడు. ఎవరో కావాలనే ఈ పోస్టర్ క్రియేట్ చేశారని అతనన్నాడు. ఐతే ఈ లోపే ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.
రిషబ్ శెట్టి సరసన రుక్మిణి వసంత్ నటించిన ‘కాంతార: చాప్టర్-1’లో బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య విలన్ పాత్ర పోషించాడు. హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 2న రిలీజ్ కానుంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఈజీగా 500 కోట్ల వసూళ్లు వస్తాయని ట్రేడ్ పండిట్లు అంచనా వేస్తున్నారు.
This post was last modified on September 24, 2025 7:57 am
ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో కథానాయికగా నటిస్తూనే.. ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ మెరుస్తోంది కీర్తి సురేష్. మహానటి తర్వాత…
విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జరిగినా పరిస్థితి…
తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు ప్రదీప్ రావత్ హఠాత్తుగా కన్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండరీ…
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…
రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…
ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు.…