ఈ ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘కాంతార: చాప్టర్-1’ ఒకటి. మూడేళ్ల ముందు చిన్న సినిమాగా మొదలై.. పాన్ ఇండియా స్థాయిలో ఎవ్వరూ ఊహించని అసాధారణ విజయాన్ని అందుకుంది ‘కాంతార’. దానికి ప్రీక్వెల్గా తెరకెక్కిన ‘కాంతార: చాప్టర్-1’పై భారీ అంచనాలే ఉన్నాయి. సైలెంట్గా మేకింగ్ పూర్తి చేసిన చిత్ర బృందం.. ఇటీవలే ట్రైలర్ లాంచ్ చేసింది. అది ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. రిలీజ్ వీక్లో ప్రమోషన్లు కొంచెం గట్టిగా చేయాలని టీం భావిస్తోంది.
ఈ లోపు ఈ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ సోషల్ మీడియాలో కలకలం రేపింది. ఆధ్యాత్మిక, దైవ సంబంధిత అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా చూడాలంటే రాబోయే వారం రోజుల పాటు మందు, సిగరెట్ ముట్టుకోకూడదని.. అలాగే మాంసాహారం కూడా మానేయాలని ‘కాంతార’ టీం పిలుపు ఇచ్చినట్లుగా ఉంది ఆ పోస్టర్. ఈ మేరకు గూగుల్ ఫామ్ కూడా ఫిల్ చేయాలని అభిమానులను టీం కోరినట్లుగా అందులో ఉంది.
ఈ పోస్టర్ వైరల్ కావడంతో ఇదేం పబ్లిసిటీ, ఇవేం కండిషన్లు అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోయారు. సినిమా చూడాలంటే నాన్ వెజ్, మందు మానేయాలా అంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఈ విషయం ‘కాంతార’ టీం వరకు వెళ్లింది. దీనిపై హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి స్పందించాడు. ఈ పోస్టర్కు, టీంకు సంబంధం లేదని.. తాము అలాంటి కండిషన్లేమీ ప్రేక్షకులకు పెట్టలేదని అతను స్పష్టం చేశాడు. ఎవరో కావాలనే ఈ పోస్టర్ క్రియేట్ చేశారని అతనన్నాడు. ఐతే ఈ లోపే ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.
రిషబ్ శెట్టి సరసన రుక్మిణి వసంత్ నటించిన ‘కాంతార: చాప్టర్-1’లో బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య విలన్ పాత్ర పోషించాడు. హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 2న రిలీజ్ కానుంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఈజీగా 500 కోట్ల వసూళ్లు వస్తాయని ట్రేడ్ పండిట్లు అంచనా వేస్తున్నారు.
This post was last modified on September 24, 2025 7:57 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…