పవన్ కళ్యాణ్ అభిమానులు రేపు రాత్రి ఓజి ప్రీమియర్ కు ఎంతైతే ఎగ్జైట్ అవుతున్నారో అంతకన్నా ఎక్కువ టెన్షన్ ఓవర్సీస్ షోల గురించి పడుతున్నారు. ఎందుకంటే కంటెంట్, డ్రైవ్స్ ని డిస్పాచ్ చేయడంలో జరిగిన ఆలస్యం వల్ల నూటా ఎనభైకి పైగా లొకేషన్లలో షోలు తీసేశారనే టాక్ దావానలంలా మారింది. అక్కడి డిస్ట్రిబ్యూటర్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నప్పటికీ ఫైనల్ గా కంటెంట్ మొత్తం చేరిందని చెప్పడం లేదు. భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రికి ఈ లాంఛనం పూర్తవుతుందనేది ఇన్ సైడ్ టాక్. కొన్ని రీల్స్ మీద తమన్ రీ వర్క్ చేస్తున్నారనే టాక్ అంతర్గతంగా వినిపిస్తోంది.
ఫారిన్ లో అలా ఉంటే ఇండియాలో సీన్ ఇంకోలా ఉంది. 24 రాత్రి ప్రీమియర్ షోల టికెట్ల కోసం జరుగుతున్న పైరవీలు మాములుగా లేవు. హైదరాబాద్ లోని మంచి సింగల్ స్క్రీన్లలో అనధికార టికెట్ ధర మూడు నుంచి అయిదు వేల రూపాయల మధ్యలో ఉందట. అయినా సరే అంత సులభంగా దొరకడం లేదని సమాచారం. ఏపీ తెలంగాణలో మూలనబడిన పాత థియేటర్లలో సైతం వెయ్యి రూపాయల టికెట్లు సోల్డ్ అవుట్ పడుతున్నాయంటే ఓజి క్రేజ్ మాటల్లో చెప్పేందుకు సాధ్యం కావడం లేదు.
ఇప్పటికే యాభై కోట్ల గ్రాస్ దాటేసిన ఓజి ఫస్ట్ డే పాత రికార్డులన్నీ తుడిచిపెట్టేలా ఉంది. కాకపోతే వరల్డ్ వైడ్ ఓపెనింగ్ కి మాత్రం దెబ్బ పడొచ్చు. ఇప్పుడు రద్దు చేసిన షోలు పునరుద్ధరించి తిరిగి టికెట్లు అమ్మేలోపు పుణ్యకాలం వచ్చేస్తుంది. పైగా ఒక కీలక పంపిణీదారు తప్పుకోవడంతో కొంచెం ఇబ్బందులు తలెత్తుతున్నాయని వినికిడి. ఒకవేళ సరైన ప్లానింగ్ తో కంటెంట్ ని ముందుగానే సిద్ధం చేసుకుని ఉంటే 3 నుంచి 4 మిలియన్ల దాకా మొదటి రోజు నెంబర్ నమోదయ్యేదని ఎన్ఆర్ఐ ఫ్యాన్స్ వాపోతున్నారు. సరే ఎవరినని ఏం లాభమనే తరహాలో రేపు రాత్రి షో అయిపోయే దాకా ఈ డిస్కషన్లు చర్చలు తప్పవు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రముఖ ప్రవచ కర్త చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాలను పాఠ్యాంశాలుగా ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి…
ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…
ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…
భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…