Movie News

దిల్‍ రాజుకి ఝలక్‍ ఇచ్చిన వరుణ్‍ తేజ్‍!

ఎఫ్‍ 2 చిత్రాన్ని సైన్‍ చేసినప్పటికే వరుణ్‍ తేజ్‍కి కొన్ని హిట్లున్నాయి కానీ అప్పుడు వెంకటేష్‍తో కలిసి నటించడానికి వరుణ్‍ తేజ్‍ పెద్దగా ఆంక్షలేమీ పెట్టలేదు. దిల్‍ రాజు ఇస్తానని చెప్పినంత పారితోషికమే తీసుకున్నాడు. పాత్ర పరంగా ఎలాంటి డిమాండ్లు కూడా చేయలేదు. కానీ ఇప్పుడా సినిమా సీక్వెల్‍కి మాత్రం వరుణ్‍ తేజ్‍ తగ్గేది లేదంటున్నాడట. ఈసారి తన పారితోషికం భారీగా పెంచేసి అడుగుతున్నాడట. అలాగే పాత్ర పరంగా తనకు సమాన ప్రాధాన్యం వుండాలని చెప్పాడట.

వరుణ్‍ తేజ్‍ ఇప్పుడిలా పట్టుబట్టడంతో దిల్‍ రాజు దీనిని ఎలా తెగ్గొట్టాలా అని చూస్తున్నాడట. ఎఫ్‍ 2 చిత్రానికి దిల్‍ రాజుకి ముప్పయ్‍ కోట్లకు పైగా లాభాలు వచ్చాయి. సీక్వెల్‍ అంటే తప్పకుండా క్రేజ్‍ భారీ స్థాయిలో వుంటుంది కనుక ఈసారి వరుణ్‍ అయినా, వెంకటేష్‍ అయినా తక్కువకు సర్దుకుపోయే అవకాశం లేదు. అలాగే అనిల్‍ రావిపూడికి కూడా మునుపటి కంటే అధిక పారితోషికం ఇవ్వక తప్పదు.

అప్పుడు ముప్పయ్‍ కోట్ల లోపు బడ్జెట్‍లో రూపొందిన ఎఫ్‍ 2కి ఈసారి కనీసం యాభై నుంచి అరవై కోట్లు ఖర్చు పెట్టక తప్పదంటున్నారు. కరోనా సాకు చూపించి బడ్జెట్‍ పరంగా కోతలు విధించాలని చూస్తోన్న దిల్‍ రాజుకి ఈ చిత్రం విషయంలో ఆ రాయితీలు వచ్చేట్టు లేవు.

This post was last modified on November 26, 2020 1:28 am

Share
Show comments
Published by
suman

Recent Posts

హైద‌రాబాదీలు… 100 కోట్ల విల్లా కొంటారా?

ఇప్పుడు మ‌ధ్య త‌ర‌గ‌తి వాళ్లు సైతం కోటి.. అంత‌కంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వ‌చ్చేశాయి. ధ‌ర‌లు అంత‌గా…

1 hour ago

కీరవాణి అది తప్పని ఋజువు చేయాలి

సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…

2 hours ago

తిరస్కరించిన సినిమాకు హడావిడి ఎందుకయ్యా

ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…

5 hours ago

అప్పులు కట్టుకుంటున్న మంచు లక్ష్మీ

టాలీవుడ్లో ఘ‌న చ‌రిత్ర ఉన్న బేన‌ర్లో ల‌క్ష్మీప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ ఒక‌టి. ఈ బేన‌ర్ మీద ప‌దుల సంఖ్య‌లో సినిమాలు తీశారు…

6 hours ago

రెండో పెళ్లి మీద హీరోయిన్ ఆసక్తి

‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…

9 hours ago

మరోసారి కన్నీరు పెట్టిన ఎర్రబెల్లి

ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…

10 hours ago