ఎఫ్ 2 చిత్రాన్ని సైన్ చేసినప్పటికే వరుణ్ తేజ్కి కొన్ని హిట్లున్నాయి కానీ అప్పుడు వెంకటేష్తో కలిసి నటించడానికి వరుణ్ తేజ్ పెద్దగా ఆంక్షలేమీ పెట్టలేదు. దిల్ రాజు ఇస్తానని చెప్పినంత పారితోషికమే తీసుకున్నాడు. పాత్ర పరంగా ఎలాంటి డిమాండ్లు కూడా చేయలేదు. కానీ ఇప్పుడా సినిమా సీక్వెల్కి మాత్రం వరుణ్ తేజ్ తగ్గేది లేదంటున్నాడట. ఈసారి తన పారితోషికం భారీగా పెంచేసి అడుగుతున్నాడట. అలాగే పాత్ర పరంగా తనకు సమాన ప్రాధాన్యం వుండాలని చెప్పాడట.
వరుణ్ తేజ్ ఇప్పుడిలా పట్టుబట్టడంతో దిల్ రాజు దీనిని ఎలా తెగ్గొట్టాలా అని చూస్తున్నాడట. ఎఫ్ 2 చిత్రానికి దిల్ రాజుకి ముప్పయ్ కోట్లకు పైగా లాభాలు వచ్చాయి. సీక్వెల్ అంటే తప్పకుండా క్రేజ్ భారీ స్థాయిలో వుంటుంది కనుక ఈసారి వరుణ్ అయినా, వెంకటేష్ అయినా తక్కువకు సర్దుకుపోయే అవకాశం లేదు. అలాగే అనిల్ రావిపూడికి కూడా మునుపటి కంటే అధిక పారితోషికం ఇవ్వక తప్పదు.
అప్పుడు ముప్పయ్ కోట్ల లోపు బడ్జెట్లో రూపొందిన ఎఫ్ 2కి ఈసారి కనీసం యాభై నుంచి అరవై కోట్లు ఖర్చు పెట్టక తప్పదంటున్నారు. కరోనా సాకు చూపించి బడ్జెట్ పరంగా కోతలు విధించాలని చూస్తోన్న దిల్ రాజుకి ఈ చిత్రం విషయంలో ఆ రాయితీలు వచ్చేట్టు లేవు.
This post was last modified on November 26, 2020 1:28 am
సామాజిక పింఛన్ల పై పిడుగు పడినట్టు అయింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంటరి మహిళ లు.. వంటి సామాజిక పింఛనుపై…
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ వైసీపీ తాజాగా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. 2019…
స్టార్ హీరోల పోటీని తట్టుకుని బ్లాక్ బస్టర్ మించిన వసూళ్లను సాధించిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఆల్రెడీ ప్రకటించిన…
టాలీవుడ్లో ఎంతోమంది లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ల దగ్గర శిష్యరికం చేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు.…
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ను ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత.. వీటిని…
పెద్ద సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన షాకింగ్ సంగతులు ఎప్పుడో తర్వాత సంవత్సరాల్లో బయట పడతాయి. అలాంటిదే ఇది…