ఎఫ్ 2 చిత్రాన్ని సైన్ చేసినప్పటికే వరుణ్ తేజ్కి కొన్ని హిట్లున్నాయి కానీ అప్పుడు వెంకటేష్తో కలిసి నటించడానికి వరుణ్ తేజ్ పెద్దగా ఆంక్షలేమీ పెట్టలేదు. దిల్ రాజు ఇస్తానని చెప్పినంత పారితోషికమే తీసుకున్నాడు. పాత్ర పరంగా ఎలాంటి డిమాండ్లు కూడా చేయలేదు. కానీ ఇప్పుడా సినిమా సీక్వెల్కి మాత్రం వరుణ్ తేజ్ తగ్గేది లేదంటున్నాడట. ఈసారి తన పారితోషికం భారీగా పెంచేసి అడుగుతున్నాడట. అలాగే పాత్ర పరంగా తనకు సమాన ప్రాధాన్యం వుండాలని చెప్పాడట.
వరుణ్ తేజ్ ఇప్పుడిలా పట్టుబట్టడంతో దిల్ రాజు దీనిని ఎలా తెగ్గొట్టాలా అని చూస్తున్నాడట. ఎఫ్ 2 చిత్రానికి దిల్ రాజుకి ముప్పయ్ కోట్లకు పైగా లాభాలు వచ్చాయి. సీక్వెల్ అంటే తప్పకుండా క్రేజ్ భారీ స్థాయిలో వుంటుంది కనుక ఈసారి వరుణ్ అయినా, వెంకటేష్ అయినా తక్కువకు సర్దుకుపోయే అవకాశం లేదు. అలాగే అనిల్ రావిపూడికి కూడా మునుపటి కంటే అధిక పారితోషికం ఇవ్వక తప్పదు.
అప్పుడు ముప్పయ్ కోట్ల లోపు బడ్జెట్లో రూపొందిన ఎఫ్ 2కి ఈసారి కనీసం యాభై నుంచి అరవై కోట్లు ఖర్చు పెట్టక తప్పదంటున్నారు. కరోనా సాకు చూపించి బడ్జెట్ పరంగా కోతలు విధించాలని చూస్తోన్న దిల్ రాజుకి ఈ చిత్రం విషయంలో ఆ రాయితీలు వచ్చేట్టు లేవు.
This post was last modified on November 26, 2020 1:28 am
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్కు రఘురామకు…
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…