Movie News

సినిమాలు వదిలేసినందుకు బాధ లేదు


రెండు భాషల్లో పేరున్న హీరోల సరసన అవకాశాలు.. మంచి ఊపు మీద కెరీర్.. చివరగా నటించిన సినిమాలో తాను చేసిన పాత్రకు గొప్ప ప్రశంసలు.. ఇలా కెరీర్ నడుస్తున్న హీరోయిన్ ఉన్నట్లుండి సినిమాలు మానేస్తుందా? తనకు సినిమాల కంటే చదువే ముఖ్యం అని ఫారిన్‌కు వెళ్లిపోతుందా? బహుశా ఇంతకుముందు ఏ హీరోయిన్ విషయంలోనూ ఇలా జరిగి ఉండదేమో. కానీ బెంగాలీ భామ రిచా గంగోపాధ్యాయ ఇదే చేసింది.

తెలుగులో లీడర్, బాయ్, మిరపకాయ్ లాంటి సినిమాల్లో నటించి.. ఆ తర్వాత తమిళంలో స్టార్ హీరోల సరసన నటించిన రిచా.. తొమ్మిదేళ్ల కిందట ఉన్నట్లుండి సినిమాలు వదిలేసింది. ధనుష్ సరసన సెల్వ రాఘవన్ దర్శకత్వంలో చేసిన ‘మయక్కం ఎన్నా’నే ఆమె చివరి సినిమా. ఆ సినిమా మంచి విజయం సాధించింది. రిచాకు మంచి పేరూ తెచ్చిపెట్టింది.

కానీ ఆ సమయంలోనే ఎంబీఏ చేయడం కోసం సినిమాలు వదిలేసి యుఎస్ వెళ్లిపోయింది రిచా. అక్కడే తన క్లాస్ మేట్ అయిన యుఎస్ సిటిజన్‌తో ప్రేమలో పడి కొన్నేళ్ల కిందట అతణ్ని పెళ్లి కూడా చేసుకుంది. ఐతే ‘మయక్కం ఎన్నా’ విడుదలై తొమ్మిదేళ్లు పూర్తయిన నేపథ్యంలో తాజాగా రిచా తన సినీ కెరీర్ అర్ధంతరంగా ముగిసిపోవడం గురించి మాట్లాడింది. మార్కెటింగ్‌లో ఎంబీఏ చేయాలన్నది తన కల అని.. దానికి అదే సరైన సమయం అనిపించి సినిమాలు వదిలేశానని.. అలా తన రీల్ లైఫ్‌కు తెర పడిందని.. దీని గురించి తనకు ఎంతమాత్రం చింత లేదని చెప్పింది.

నటి కావడం వల్ల చాలామంది స్నేహితులకు తాను దూరం అయ్యానని.. ఎంబీఏ చేరాక మళ్లీ స్నేహితులందరినీ కలుసుకునే అవకాశం లభించిందని.. అలాగే తన జీవిత భాగస్వామి కూడా ఎంబీఏలోనే దొరికాడని రిచా చెప్పింది. ప్రస్తుత తన జీవితం పట్ల పూర్తి సంతోషంగా ఉన్నట్లు ఆమె స్పష్టం చేసింది.

This post was last modified on November 25, 2020 6:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

11 సీట్లు ఎలా వచ్చాయన్నదానిపై కోటి సంతకాలు చేయించాలి

ఏపీలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కొనసాగుతోంది. దీనికి డెడ్‌లైన్‌ను మళ్లీ…

41 minutes ago

రాజా సాబ్ సంగీతానికి అభిమానుల సూచనలు

సంగీత దర్శకుడు తమన్ అఖండ 2 కోసం ఇచ్చిన సంగీతం మీద మిశ్రమ స్పందనే దక్కింది. ఆడియో శివ భక్తులకు…

1 hour ago

అమరావతి రైతులు… హ్యాపీనా?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో కీల‌క స‌మ‌స్య‌గా ఉన్న రైతుల అంశాన్ని ప్ర‌భుత్వం దాదాపు ప‌రిష్క‌రించింది. ముగ్గురు స‌భ్యుల‌తో కూడిన క‌మిటీని…

3 hours ago

కోటి సంతకాలు తెస్తాం.. ఒక్క సంతకం పెట్టండి!

రాష్ట్రంలో కొత్త మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…

6 hours ago

అక్కడ మెస్సీ అభిమానుల విధ్వంసం.. ఇక్కడి మ్యాచ్ పై ఉత్కంఠ!

కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియంలో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…

6 hours ago

శుక్రవారం రికార్డును తొక్కి పడేసింది

బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…

6 hours ago