అభిమానులు ప్రేమతో లాలెట్టాన్ అని పిలుచుకునే కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించడం మూవీ లవర్స్ ని సంతోషంలో ముంచెత్తుతోంది. మలయాళ పరిశ్రమకు చెందిన హీరో అయినప్పటికీ డబ్బింగ్ సినిమాల ద్వారా మనకూ ఎంతో సుపరిచితుడైన మోహన్ లాల్ ని ఈ పురస్కారం ఎప్పుడో వరించాల్సింది. ఎందుకంటే అన్ని అర్హతలు ఆయనకు ఉన్నాయి కాబట్టి. నాలుగు దశాబ్దాల సుదీర్ఘమైన ప్రయాణంలో ఈ విలక్షణ నటుడి కెరీర్ మీద ఒక్కసారి లుక్ వేస్తే ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. అంత ట్రాక్ రికార్డు సొంతం చేసుకున్నారు.
చాలా పరిమితమైన మార్కెట్ ఉండే మల్లువుడ్ కి మోహన్ లాల్ 1978లో వచ్చారు. అప్పటికి ఆ పరిశ్రమ మీద ఎక్కువ అశ్లీల చిత్రాలు తీస్తారనే ముద్ర ఉండేది. తొలినాళ్ళలో విలన్ వేషాలే దక్కాయి. 1980లో మంజిల్ విరింజ పూక్కల్ తో తొలి బ్రేక్ అందుకున్న మోహన్ లాల్ అక్కడి నుంచి వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. ఒకపక్క కమర్షియల్ మార్కెట్ పెంచుకుంటూనే మరోపక్క ప్రయోగాలు చేయడానికి వెనుకాడని తత్వం ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచింది. గ్యాంగ్ స్టర్ డ్రామాలు, మాస్ మాసాలాలతో పాటు వానప్రస్తం లాంటి అవార్డు విన్నింగ్ మూవీస్ తో ఏకాకాలంలో మెప్పించడం మోహన్ లాల్ కే చెల్లింది.
2001లో పద్మశ్రీ, 2019లో పద్మభూషణ్ అందుకున్న మోహన్ లాల్ అయిదు సార్లు ఉత్తమ నటుడిగా, ఒకసారి నిర్మాతగా జాతీయ అవార్డు అందుకోవడం ఈయనకే చెల్లింది. అరవై అయిదేళ్ల వయసులో కూడా ఏడాదికి మూడు సినిమాలు చేస్తున్న మోహన్ లాల్ ఇప్పటిదాకా నాలుగు వందల పైచిలుకు చిత్రాల్లో విభిన్నమైన విలక్షణమైన పాత్రలు లెక్కలేనన్ని చేశారు. తెలుగులో జనతా గ్యారేజ్, మనమంతా, కన్నప్పలో నటించిన మోహన్ లాల్ గాండీవంలో ఏఎన్ఆర్ పక్కన స్టెప్పులు వేయడం కోసం ఒక పాట చేయడం ఒక విశేషం. ఇప్పటికీ నిత్య యవ్వనంతో ఉరకలు వేసే మోహన్ లాల్ త్వరలో వృషభతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…