కళ్యాణి ప్రియదర్శన్ మలయాళంలో స్టార్ ఇమేజ్ ఉన్న కథానాయికేమీ కాదు. ఆమెను అప్ కమింగ్ హీరోయిన్గానే భావించాలి. ఆమెను లీడ్ రోల్లో పెట్టి రూ.30 కోట్ల బడ్జెట్లో సినిమా తీయడమంటే సాహసం అనే చెప్పాలి. కానీ దుల్కర్ సల్మాన్ మాత్రం ధైర్యం చేశాడు. డొమినిక్ అరున్ అనే దర్శకుడి కథను నమ్మి ‘లోక’ సినిమాను పెద్ద బడ్జెట్లో నిర్మించాడు.
ఈ సినిమా పట్ల బయ్యర్లలో పెద్దగా ఆసక్తి కనిపించకపోవడంతో నష్టాలు తప్పవని అతను ఫిక్సయిపోయాడట. కానీ రిలీజ్ ముంగిట అనూహ్యమైన క్రేజ్ తెచ్చుకున్న ‘లోక’ మలయాళంలోనే కాక వేరే భాషల్లోనూ అద్భుతమైన స్పందన తెచ్చుకుని బ్లాక్ బస్టర్ అయింది. బాక్సాఫీస్ దగ్గర ఒక్కో మైలరాయిని దాటుకుంటూ వెళ్తున్న ‘లోకా’ ఇప్పుడు అసాధారణమైన రికార్డు ముంగిట నిలిచింది. ఈ సినిమా మలయాళ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ ఏడాదే మోహన్ లాల్ సినిమా ‘ఎల్2: ఎంపురాన్’ రూ.268 కోట్లతో ఆల్ టైం హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది. రెండో స్థానంలో కూడా లాల్ సినిమా ‘తుడురమ్’యే ఉండడం విశేషం. ఆ చిత్రం రూ.242 కోట్లు వసూలు చేసింది. ‘లోక’ ఆల్రెడీ ఆ రికార్డును దాటేసింది. ప్రస్తుతం ఈ సినిమా వసూళ్లు రూ.260 కోట్లకు చేరుకున్నాయి. ఇంకో ఏడెనిమిది కోట్లు వసూలు చేస్తే ‘లోక’నే నంబర్ వన్ అవుతుంది. ఐతే ‘లోక’ రిలీజై మూడు వారాలు దాటిపోయింది.
ప్రస్తుతం ఆ సినిమాకు ఓ మోస్తరు వసూళ్లు వస్తున్నాయి. ఈ వీకెండ్ అయ్యేసరికి కొంచెం కష్టపడి అయినా ‘లోక’.. ‘ఎంపురాన్’ వసూళ్లను దాటేస్తుందని భావిస్తున్నారు. మొత్తానికి థియేట్రికల్ రన్ అయ్యేసరికి ‘లోక’ ఈ అద్భుత రికార్డును అందుకోవడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. ఒక అప్కమింగ్ హీరోయిన్ని పెట్టి తీసిన లేడీ ఓరియెంటెడ్ సినిమా.. మోహన్ లాల్ పేరిట ఉన్న ఇండస్ట్రీ హిట్ రికార్డును దాటడం అంటే చిన్న విషయం కాదు.
This post was last modified on September 19, 2025 9:30 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…