పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో హీరోయిన్లను రిపీట్ చేయడం చాలా చాలా తక్కువ. ఒక్క రేణు దేశాయ్ మాత్రమే కథానాయికగా పవన్తో రెండు సినిమాలు చేసిన ఘనత సాధించింది కొన్నేళ్ల ముందు వరకు. ఆ తర్వాత పవన్ సినిమాల్లో రెండోసారి కథానాయికగా చేసింది శ్రుతి హాసన్ మాత్రమే. తొలిసారి ‘గబ్బర్ సింగ్లో నటించిన శ్రుతి.. ఆ తర్వాత ‘కాటమరాయుడు’లో ఆయనతో జోడీ కట్టింది.
ఇప్పుడు పవన్తో మూడుసార్లు నటించిన ఏకైక కథానాయికగా ఆమె రికార్డు సృష్టించబోతోంది. ఆమె ‘వకీల్ సాబ్’ సినిమాలో పవన్తో జోడీ కట్టబోతున్నట్లు చాన్నాళ్లుగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా శ్రుతినే స్వయంగా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. త్వరలోనే పవన్ సినిమా సెట్లో అడుగు పెట్టబోతున్నట్లు ఆమె వెల్లడించింది.
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘వకీల్ సాబ్’లో తాను కూడా భాగమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని శ్రుతి చెప్పింది. జనవరి నుంచి ‘వకీల్ సాబ్’ చిత్రీకరణలో పాల్గొంటానని ఆమె వెల్లడించింది. తాను చేయబోయే పాత్ర కోసం ప్రిపరేషన్లో ఉన్నట్లు ఆమె తెలిపింది. తాను ఒక హీరోతో మూడోసారి పని చేయడం ఇదే తొలిసారని శ్రుతి చెప్పింది. రవితేజ, సూర్యలతో మాత్రమే రెండేసి చిత్రాలు చేశానంది. గబ్బర్ సింగ్, కాటమరాయుడు చిత్రాల తర్వాత పవన్తో మళ్లీ సినిమా చేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆమె చెప్పింది.
బాలీవుడ్లోనూ కొత్తగా ఒక చిత్రానికి సంతకం చేసినట్లు శ్రుతి వెల్లడించింది. ఐతే ‘వకీల్ సాబ్’ చిత్రీకరణ గత నెలలోనే పున:ప్రారంభం కాగా.. ఈ నెలలో పవన్ కూడా సెట్లోకి అడుగుపెట్టాడు. త్వరలోనే చిత్రీకరణ పూర్తవుతుందేమో అనుకుంటే.. శ్రుతి జనవరి ఈ చిత్ర సెట్లోకి అడుగు పెట్టనున్నట్లు చెబుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీన్ని బట్టి బ్యాలెన్స్ షూటింగ్ చాలా ఎక్కువే ఉందన్నమాట.
This post was last modified on November 25, 2020 2:27 pm
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…