పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో హీరోయిన్లను రిపీట్ చేయడం చాలా చాలా తక్కువ. ఒక్క రేణు దేశాయ్ మాత్రమే కథానాయికగా పవన్తో రెండు సినిమాలు చేసిన ఘనత సాధించింది కొన్నేళ్ల ముందు వరకు. ఆ తర్వాత పవన్ సినిమాల్లో రెండోసారి కథానాయికగా చేసింది శ్రుతి హాసన్ మాత్రమే. తొలిసారి ‘గబ్బర్ సింగ్లో నటించిన శ్రుతి.. ఆ తర్వాత ‘కాటమరాయుడు’లో ఆయనతో జోడీ కట్టింది.
ఇప్పుడు పవన్తో మూడుసార్లు నటించిన ఏకైక కథానాయికగా ఆమె రికార్డు సృష్టించబోతోంది. ఆమె ‘వకీల్ సాబ్’ సినిమాలో పవన్తో జోడీ కట్టబోతున్నట్లు చాన్నాళ్లుగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా శ్రుతినే స్వయంగా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. త్వరలోనే పవన్ సినిమా సెట్లో అడుగు పెట్టబోతున్నట్లు ఆమె వెల్లడించింది.
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘వకీల్ సాబ్’లో తాను కూడా భాగమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని శ్రుతి చెప్పింది. జనవరి నుంచి ‘వకీల్ సాబ్’ చిత్రీకరణలో పాల్గొంటానని ఆమె వెల్లడించింది. తాను చేయబోయే పాత్ర కోసం ప్రిపరేషన్లో ఉన్నట్లు ఆమె తెలిపింది. తాను ఒక హీరోతో మూడోసారి పని చేయడం ఇదే తొలిసారని శ్రుతి చెప్పింది. రవితేజ, సూర్యలతో మాత్రమే రెండేసి చిత్రాలు చేశానంది. గబ్బర్ సింగ్, కాటమరాయుడు చిత్రాల తర్వాత పవన్తో మళ్లీ సినిమా చేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆమె చెప్పింది.
బాలీవుడ్లోనూ కొత్తగా ఒక చిత్రానికి సంతకం చేసినట్లు శ్రుతి వెల్లడించింది. ఐతే ‘వకీల్ సాబ్’ చిత్రీకరణ గత నెలలోనే పున:ప్రారంభం కాగా.. ఈ నెలలో పవన్ కూడా సెట్లోకి అడుగుపెట్టాడు. త్వరలోనే చిత్రీకరణ పూర్తవుతుందేమో అనుకుంటే.. శ్రుతి జనవరి ఈ చిత్ర సెట్లోకి అడుగు పెట్టనున్నట్లు చెబుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీన్ని బట్టి బ్యాలెన్స్ షూటింగ్ చాలా ఎక్కువే ఉందన్నమాట.
This post was last modified on November 25, 2020 2:27 pm
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…