ఓటిటిల కండీషన్లలకు తలొగ్గి పెద్ద పెద్ద ప్యాన్ ఇండియా సినిమాలే 28 రోజుల విండోకు జై కొడుతున్న రోజులివి. ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా డిజాస్టర్ అయినా ఒకటే ట్రీట్ మెంట్, ఒకటే లెక్క అన్నట్టు మారిపోయింది. హరిహర వీరమల్లు, కింగ్డమ్, కూలీ అన్నింటిదీ ఇదే కథ. కానీ అసలెలాంటి హైప్ లేకుండా వచ్చిన యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహ అంచనాలకు అందని రీతిలో ఘనవిజయం సాధించి ఏకంగా 300 కోట్లకు పైగా వసూళ్లతో ట్రేడ్ పండితుల మతులు పోగొట్టడం చూస్తూనే ఉన్నాం. 56 రోజులు దాటుతున్నా సరే ఇంకా మెయిన్ సెంటర్స్ లో ఈ మూవీ ఆడుతూనే ఉండటం గమనించాల్సిన విషయం .
థియేటర్ రన్ పూర్తి చేసుకోబోతున్న తరుణంలో మహావతార్ నరసింహ నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేసింది. పెద్దగా హడావిడి చేయకుండా హఠాత్తుగా సెప్టెంబర్ 19 రిలీజ్ అంటూ కేవలం కొన్ని గంటల ముందు ప్రకటన ఇవ్వడం మూవీస్ లవర్స్ ని ఆశ్చర్యపరిచింది. నిజానికి రెండు నెలల క్రితం రిలీజ్ కు ముందు ఈ చిత్రానికి డిజిటల్ డీల్ జరగలేదు. ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన చూశాక ఓటిటిలు విపరీతంగా పోటీ పడ్డాయి. ఈ రేసులో నెట్ ఫ్లిక్స్ కప్పు గెలుచుకుంది. సౌత్ ఇండియన్ కంటెంట్ మీద పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్న ఈ సంస్థకు మహావతార్ నరసింహ బంగారు బాతులా మారనుందని ఒక అంచనా.
ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ కు రావడంలో హోంబాలే ఫిలిమ్స్ కీలకంగా వ్యవహరించినట్టు ఇన్ సైడ్ టాక్. ఈ సంస్థ నిర్మాణంలో వచ్చిన సలార్, బఘీరా లాంటివి ఈ కాంబోలోనే డీల్స్ జరుపుకున్నాయి. మహావతార్ నరసింహకు ప్రెజెంటర్ గా వ్యవహరించడమే కాకుండా డిస్ట్రిబ్యూషన్ పరంగా భారీ మద్దతు ఇచ్చిన హోంబాలే ఈ సిరీస్ లో రాబోయే మిగిలిన యానిమేషన్ సినిమాలకు ప్రొడక్షన్ పార్ట్ నర్ గా వ్యవహరించనుందట. సో కంటెంట్ లో దమ్ము ఉంటే రెండు నెలల తర్వాత ఓటిటిలో వచ్చినా ప్రేక్షకులు ఎదురు చూస్తారని చెప్పడానికి మహావతార్ నరసింహ ఒక ఉదాహరణగా నిలవడమే కాదు మార్గం కూడా చూపించింది.
This post was last modified on September 19, 2025 10:07 am
సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…