కొన్ని నెలల క్రితం స్పిరిట్ కోసం దీపికా పదుకునేని వద్దనుకుని త్రిప్తి డిమ్రిని తీసుకోవడం పట్ల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ మీడియా హౌసెస్ కు టార్గెట్ అయ్యాడు. ఆమె డిమాండ్లను తట్టుకోలేకే వద్దనుకున్నాడని అందరికీ తెలిసినా దీపికా కొత్తగా తల్లయ్యిందనే కోణంలో తన మీద సింపతీ తెచ్చేందుకు గట్టి ప్రయత్నాలే జరిగాయి. కానీ సందీప్ వాటిని కేర్ చేయలేదు. ప్రభాస్ లాంటి ప్యాన్ ఇండియా హీరోతో సినిమా చేస్తున్నప్పుడు కొన్ని విషయాల్లో హీరోయిన్ తో సహా అందరికీ రాజీ ఉండాలి. అంతే తప్ప నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు, నేను చెప్పిందే జరగాలంటే ఇదిగో ఇలాంటి రాద్ధాంతాలే జరుగుతాయి.
తాజాగా కల్కి 2 నుంచి దీపికా పదుకునేని తప్పించడం చూస్తే సందీప్ వంగ చేసింది ముమ్మాటికి రైటేనని చెప్పడంలో డౌట్లు అక్కర్లేదు. డిమాండ్లు చేయడం తప్పు కాదు. కానీ అవి గొంతెమ్మ కోరికల్లా అనిపించకూడదు. ఇప్పుడు హిందీ మీడియాలో ఇదే టాపిక్ అవుతోంది. ఆవిడ గతంలో చేసిన సినిమాల దర్శక నిర్మాతల అనుభవాలను తవ్వి తీసి మరీ వీడియోలు, ఇంటర్వ్యూల రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఒకవేళ దీపికా వైపు నుంచి ఎలాంటి సమస్య లేకపోతే అదేదో స్పిరిట్ నుంచి తప్పుకున్నప్పుడే క్లారిటీ ఇవ్వాల్సింది. మౌనంగా ఉండటమే మరిన్ని అనుమానాలకు తావిచ్చేలా చేసింది.
మరి అల్లు అర్జున్ – అట్లీ మూవీకి ఈ సమస్య రాలేదా అనే డౌట్ రావడం సహజం. ఇక్కడో మెలిక ఉంది. జవాన్ టైంలోనే అట్లీ దీపికాకు తన సూపర్ హీరో సబ్జెక్టు గురించి చూచాయగా చెప్పాడట. అప్పుడే చేస్తానని మాట ఇచ్చిందట. దానికి తోడు ఇప్పుడు ఏఏ 22కి భారీ రెమ్యునరేషన్ ఇవ్వడంతో గ్రీన్ సిగ్నల్ వచ్చిందని అంటున్నారు. మరి నాగ్ అశ్విన్, సందీప్ వంగాలకు వచ్చిన ప్రాబ్లమ్ మున్ముందు అట్లీకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాకపోతే ఇష్యూ బయటికి రాదంతే. ఏది ఏమైనా తన ప్రమేయం లేని టాపిక్ లో సందీప్ రెడ్డి వంగా మరోసారి హైలైట్ అవుతున్నారు. మన దగ్గరే కాదు నార్త్ సర్కిల్స్ లో కూడా.
This post was last modified on September 18, 2025 3:31 pm
నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిణామాలను గమనిస్తే.. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్కు యువత పెద్ద ఎత్తున…
సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ డెబ్యూ ఫలితం తేలిపోయింది. కుర్రాడి నటనకు కాసిన్ని ప్రశంసలు దక్కినప్పటికీ కంటెంట్ పరంగా…
త్వరలోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు తెరదీయనున్నారు. సెప్టెంబరు-అక్టోబరు మధ్య మునిసిపాలిటీ… నవంబరు-డిసెంబరు మధ్య కార్పోరేషన్లు, జనవరిలో పంచాయతీ ఎన్నికలు…
శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ నుంచి బుమ్రా గాయం కారణంగా తప్పుకున్నాడు. అయితే అతని స్థానంలో సీనియర్ బౌలర్…
ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించిన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియా దిగ్గజం మెటా…