గత ఏడాది విడుదలై రికార్డుల మోత మ్రోగించిన కల్కి 2898 ఏడి సీక్వెల్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందనేది ఇంకా క్లారిటీ లేదు కానీ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఒక పెద్ద బాంబు పేల్చింది. కల్కి కొనసాగింపులో హీరోయిన్ దీపికా పదుకునే ఉండదని, అధికారికంగా ప్రకటిస్తున్నామని, తనతో భాగస్వామ్యం కుదకరపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని, కమిట్ మెంట్ ఎక్కువగా కోరుకునే ఇలాంటి పాత్ర కోసం సరైన ప్రత్యాన్మయం చూస్తామని పేర్కొంది. అయితే కారణాలు పేర్కొనలేదు కానీ అంతర్గతంగా ఆమెతో ఏర్పడిన విభేదాలే ఈ కఠిన నిర్ణయానికి ఉసిగొలిపి ఉంటాయని ఫిలిం నగర్ వర్గాల కథనం.
ఆ మధ్య స్పిరిట్ కోసం ముందు దీపికా పదుకునేని తీసుకున్న సందీప్ రెడ్డి వంగా తర్వాత ఆమె డిమాండ్లను భరించలేక త్రిప్తి డిమ్రిని లాక్ చేసుకోవడం నేషనల్ వైడ్ హాట్ టాపిక్ అయ్యింది. రెండు వర్గాలు దీని గురించి అధికారికంగా స్పందించకపోయినా ప్రచారమైతే జోరుగా జరిగింది. ఇప్పుడు కల్కి 2898 ఏది నుంచి దీపికాని తప్పించడం వెనుక ఏం జరిగిందనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అల్లు అర్జున్ – అట్లీ కాంబో మూవీ చేయడం వల్లే దీనికి డేట్లు కేటాయించలేనని చెప్పిందా లేక తెరవెనుక ఇంకేదైనా మతలబు ఉందా అనేది దర్శకుడు నాగ అశ్విన్ బయటికి వచ్చి చెబితే తప్ప ఈ ఇష్యూ గురించి క్లారిటీ రాదు.
ఇదంతా బాగానే ఉంది కథలో కీలకమైన సుమతి పాత్ర ఇప్పుడు ఎవరికి ఇస్తారనేది అసలు చిక్కు. మృణాల్ ఠాకూర్ లాంటి వాళ్లకు ఛాన్స్ లేదు. ఎందుకంటే తను ఆల్రెడీ ఇందులోనే చిన్న క్యామియో చేసింది కాబట్టి. రష్మిక మందన్న, జాన్వీ కపూర్ లాంటి ఆప్షన్లు చూడొచ్చు. కాకపోతే ప్రభాస్ ఎప్పుడు కల్కి 2 సెట్స్ లోకి అడుగు పెడతాడనేది ముందు చూడాలి. ది రాజా సాబ్ జనవరిలో రిలీజయ్యాక స్పిరిట్ షూట్ ఏకధాటిగా జరగనుంది. ఆలోగానే ఫౌజీకి గుమ్మడికాయ కొట్టొచ్చు. అలా చూసుకుంటే స్క్రిప్ట్ ఎంత సిద్ధంగా ఉన్నా 2027 కన్నా ముందు కల్కి 2 మొదలుపెట్టే ఛాన్స్ దాదాపు లేనట్టే. చూడాలి ఏం చేస్తారో.
టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. రాజమౌళి కాకుండా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లేని దర్శకుడు…
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…
అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…
విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ సీఐ నాగరాజుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే..…
టాలీవుడ్ లో హీరోల సినిమాల వసూళ్ల మీద సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరగడం ఎప్పటినుంచో చూస్తున్నాం. అయితే ఇప్పుడు…
వచ్చే మూడేళ్లలో తానేంటో చూపిస్తానని.. వైసీపీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…