ఇసైజ్ఞాని, మాస్ట్రో ఇళయరాజాని అభిమానించని సౌత్ ఇండియా ప్రేక్షకులు బహుశా ఉండరు. ఇంత వయసులోనూ సినిమాలకు మ్యూజిక్ కంపోజింగ్ చేయడమే కాక లైవ్ కన్సర్ట్స్ నిర్వహిస్తూ తన అభిమానులను పరవశంలో ముంచెత్తుతూనే ఉంటారు. కొత్త తరంలో ఎన్నో వందల వేల పాటలు వచ్చి ఉండొచ్చు కానీ ఇప్పటికీ జనాలు చెవి కోసుకునేది, గీతాంజలి, ప్రేమ, అభినందన లాంటి ఎవర్ గ్రీన్ ఆల్బమ్స్ కే. కేవలం పోస్టర్ లో ఈయన పేరు చూసి పబ్లిక్ నేరుగా థియేటర్లకు వెళ్లిపోయేవారంటే ఎంత ప్రభావం చూపించారో అర్థం చేసుకోవచ్చు. ఇటీవలే ఇళయరాజా 50 వసంతాల వేడుక కూడా జరిగింది.
అయితే ఏదైనా సినిమాలో ఒక నోస్టాల్జిక్ ఫిలింగ్ రప్పించాలంటే ఇళయరాజా పాటలు, ట్యూన్స్ వాడుకోవడం ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. ఆయన అనుమతి తీసుకుని తగిన రాయల్టీ చెల్లిస్తే ఏ సమస్యా లేదు. కాదు కూడదని మ్యూజిక్ కంపెనీ పర్మిషన్ ఉంది కదా ఇంకేం అక్కర్లేదని భావిస్తే మాత్రం షాకులు తప్పవు. తాజాగా నెట్ ఫ్లిక్స్ లో అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీని తీసేశారు. తన అంగీకారం లేకుండా పాటలు వాడుకున్నారనే కేసులో ఇళయరాజా విజయం సాధించారు. టాలీవుడ్ కు చెందిన మైత్రి మూవీ మేకర్స్ దీన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. కేసులో నెక్స్ట్ ఎలా మూవ్ అవుతారనేది తర్వాత సంగతి.
ఇకపై మాత్రం దర్శకులు ఇలాంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే. ఆ మధ్య సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ ఇంట్రో కోసం అనిల్ రావిపూడి పెట్టిన కూలి నెంబర్ వన్ సాంగ్ ఇళయరాజా కంపోజింగే. ముందే ఫార్మాలిటీస్ చేసుకోవడంతో ఇబ్బంది తలెత్తలేదు. గతంలో ఎస్పి బాలసుబ్రమణ్యం పబ్లిక్ స్టేజిల మీద తన పాటలు పడకుండా కోర్ట్ స్టే దాకా వెళ్లిన ఇళయరాజా ఇప్పుడు సినిమాలను మాత్రం వదులుతారా. ఆప్త మిత్రుడికే మినహాయింపు ఇవ్వలేదు. ఈ అంశాన్ని నెగటివ్ కోణంలో చూసేవాళ్ళు కూడా లేకపోలేదు. రాజా వేసిన ముద్ర కావాలి కానీ ఆయన షరతులు మాత్రం వద్దంటే ఎలా అనేది ఫ్యాన్స్ వెర్షన్.
This post was last modified on September 17, 2025 12:17 pm
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన చెన్నై లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో…