హరి గౌర.. ఇప్పుడు టాలీవుడ్లో మార్మోగుతున్న పేరు. గత శుక్రవారం రిలీజై బ్లాక్బస్టర్ దిశగా దూసుకెళ్తున్న ‘మిరాయ్’ సినిమాకు ఇతనే సంగీత దర్శకుడు. ఈ సినిమా సక్సెస్ మీట్లో విలన్ పాత్రధారి మంచు మనోజ్ మాట్లాడుతూ.. సమీక్షల్లో, ప్రేక్షకులు ఇస్తున్న ఫీడ్ బ్యాక్లో ఆర్టిస్టుల పెర్ఫామెన్స్ కంటే ముందు హరి గౌర సంగీతం గురించి ప్రస్తావిస్తుండడం.. అతనే సినిమాకు అసలైన హీరో అనడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. అంతే కాక హరికి మనోజ్ పాదాభివందనం కూడా చేశాడు.
మనోజ్ మాటల్లో అతిశయోక్తి ఏమీ లేదు. అతనంత ఎగ్జైట్ కావడంలో ఆశ్చర్యం లేదు. థీమ్ సాంగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్తో ఈ సినిమాకు అతను ఇచ్చిన ఎలివేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమాకు అంత కసితో పని చేయడానికి కారణం ఉందని హరి గౌర చెప్పాడు. తాను ఎంతో కష్టపడి సంగీతం సమకూర్చిన ‘హనుమాన్’ విషయంలో తనకు రావాల్సిన క్రెడిట్ రాకపోవడమే ‘మిరాయ్’ విషయంలో కసిని పెంచిందని అతను చెప్పాడు.
హనుమాన్ సినిమా నిడివి 2 గంటల 38 నిమిషాలైతే.. రెండున్నర గంటల రన్ టైంకు తానే సంగీతం అందించానని.. మిగిలిన సమయంలో ఇద్దరు రెండు పాటలు ఇచ్చారని.. దీంతో ఈ సినిమాకు ముగ్గురు సంగీత దర్శకులు పని చేశారని చెబుతూ, తనకు రావాల్సిన గుర్తింపును వేరే వాళ్లకు పంచడం తనకు ఆవేదన కలిగించిందని హరి తెలిపాడు.
అందుకే ఈసారి చేస్తే హరి గౌర ఒక్కడే చేశాడు అని అందరూ చెప్పుకునేలా ఉండాలని ‘మిరాయ్’కి చాలా కసితో పని చేశానని.. ఇప్పుడు దీనికి రావాల్సిన గుర్తింపు రావడం తనకెంతో ఆనందంగా ఉందని హరి గౌర చెప్పాడు. ‘మిరాయ్’ తీసిన పీపుల్ మీడియా బేనర్లోనే హరి ఇంకో నాలుగు సినిమాలకు పని చేస్తుండడం విశేషం. ‘జాంబిరెడ్డి-2’తో పాటు ‘పినాక’, ‘రణమండల’, ‘కాలచక్ర’ అంటూ ఆ నాలుగు చిత్రాల వివరాలు వెల్లడించాడు హరి.
This post was last modified on September 16, 2025 1:34 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…