ముందు రోజు రాత్రే ఓజి ప్రీమియర్లు చూసి సంబరాలను అంబరాన్ని తాకేలా చేసుకుందామని ప్లాన్ చేసుకున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గుండెల్లో బాంబు పేలేలా ఉంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఓజి స్పెషల్ నైట్ షోలు ఉండకపోవచ్చు. సెప్టెంబర్ 25 తెల్లవారుఝాము 1 గంట లేదా 4 గంటల నుంచి స్క్రీనింగ్స్ మొదలుపెట్టొచ్చట. ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్లకు అనఫీషియల్ ఇన్ఫో వచ్చిందని టాక్. నిర్మాణ సంస్థ డివివి ఎంటర్ టైన్మెంట్స్ ఇప్పటిదాకా దీని గురించి స్పందించలేదు. అనుమతులు, టికెట్ రేట్ల పెంపు తాలూకు జిఓలు వచ్చే దాకా ప్రొడక్షన్ హౌస్ నుంచి ఏ న్యూస్ ఉండవు.
పక్కాగా ప్రీమియర్లు ఉంటాయనే నమ్మకంతో ఫ్యాన్స్ బోలెడు ప్లాన్లు వేసుకున్నారు. హైదరాబాద్ మల్కాజ్గిరిలోని ఒక సింగల్ స్క్రీన్ కోసం ఏకంగా ఒక టన్ను పేపర్ కటింగ్స్ సిద్ధం చేసుకున్నారంటే ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వీటి మొదటి టికెట్ అమ్మకాలు వేలం వేసి మరీ లక్ష రూపాయలకు అమ్మిన ఉదంతాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఒకవేళ షోలు లేకపోతే పాడుకున్న వాళ్ళకు గుండెపోటే. కాకపోతే జనసేన విరాళం కోసం కాబట్టి అదేమంత సమస్య కాదు కానీ అసలు ఎప్పటి నుంచి షోలు స్టార్ట్ అవుతాయనే దాని మీద క్లారిటీ రావాల్సి ఉంది.
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఓజికి సంబంధించిన ఏ న్యూస్ అయినా సెన్సేషన్ గా నిలుస్తోంది. ఓపెనింగ్స్ ఏఏ రికార్డులను బద్దలు బద్దలుకొడతాయో ఊహకు అందడం లేదు. మొదటిసారి పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో ప్రపంచానికి ఓజితో తెలుస్తుందని ఫ్యాన్స్ చాలా ధీమాగా ఉన్నారు. దర్శకుడు సుజిత్ వదులుతున్న కంటెంట్ దానికి తగ్గట్టే ఉండగా తమన్ పాటలు హైప్ ని అంతకంతా పెంచుతున్నాయి. హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ హైదరాబాద్ వచ్చి ఇంటర్వ్యూలు మొదలుపెట్టింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక, డేట్ గురించి ఏవేవో ప్రచారాలు జరుగుతున్నాయి. విజయవాడ లేదా హైదరాబాద్ ఏదో ఒకటి ఫిక్స్ అవ్వొచ్చు.
This post was last modified on September 16, 2025 1:14 pm
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…