తన పాత్ర పెర్ఫార్మన్స్ డిమాండ్ చేస్తే తప్ప అంత ఈజీగా ఏ సినిమా ఒప్పుకోని సాయిపల్లవి తండేల్ తర్వాత మళ్ళీ తెరమీద కనిపించలేదు. గత ఏడాది అమరన్ రూపంలో బ్లాక్ బస్టర్ దక్కినా కూడా స్పీడ్ పెంచలేదు. ప్రస్తుతం తన ధ్యాసంతా రామాయణ మీదే ఉంది. నాలుగు వేల కోట్ల బడ్జెట్ తో తీసినట్టుగా నిర్మాత చెబుతున్న ఈ ప్యాన్ ఇండియా మూవీ ద్వారా తనకు ప్రపంచ స్థాయి గుర్తింపు వస్తుందనే నమ్మకంతో ఫిదా భానుమతి ఉంది. మొదటి భాగం వచ్చే ఏడాది, పార్ట్ టూ 2027లో విడుదల కాబోతున్న రామాయణ మన ఇతిహాసమే అయినప్పటికీ ప్రపంచ ప్రేక్షకులను టార్గెట్ చేసుకుని రూపొందుతోంది.
ఇంత పెద్ద గ్రాండియర్ లో భాగమైనప్పుడు తర్వాతి లైనప్ మరింత ప్రత్యేకంగా ఉండాలి. చెన్నై టాక్ ప్రకారం సాయిపల్లవి దగ్గరికి శింబు 49 ఆఫర్ వచ్చిందట. వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందబోయే గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ కథలో హీరోయిన్ క్యారెక్టర్ కు చాలా ప్రాధాన్యం ఉంటుందట. గ్లామర్ ఉన్న వాళ్ళు కాకుండా నటన బెస్ట్ ఇచ్చే వాళ్ళైతేనే న్యాయం చేయగలరని భావించి వెట్రిమారన్ ఈమెను సంప్రదించినట్టు కోలీవుడ్ కథనం. అయితే ఇదే సినిమాకు పూజా హెగ్డేని అడిగారనే వార్త ఈ మధ్యే వచ్చింది. రెట్రోలో ఆమె నటన చూసి తనైతే ఎలా ఉంటుందనే కోణంలో ఆలోచన చేసినట్టు సమాచారం.
ఇది పక్కన పెడితే సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ ఏక్ దిన్ విడుదలకు సిద్ధంగా ఉంది. జునైద్ ఖాన్ హీరోగా నటించిన ఈ లవ్ ఎంటర్ టైనర్ ని ఆమె ఎందుకు ఒప్పుకుందనే ప్రశ్న ఫ్యాన్స్ లో ఇప్పటికీ ఉంది. రిలీజ్ డేట్ విషయంలో జరుగుతున్న ఆలస్యం పలు అనుమానాలు లేవనెత్తుతోంది. జానర్ ప్రేమకు సంబంధించినదే అయినా చాలా డిఫరెంట్ పాయింట్ తో ఏక్ దిన్ రూపొందిందట. అయినా రామాయణ లాంటి మూవీ చేతిలో పెట్టుకుని ఇప్పుడు వెట్రిమారన్ కు సాయిపల్లవి ఓకే చెబుతుందా అనేది డౌట్ గానే ఉంది. ఇవి కాకుండా తను వింటున్న కథలు, ఒప్పుకున్న సినిమాలు ఏవీ లేకపోవడం గమనార్హం.
This post was last modified on September 13, 2025 11:52 am
ఏపీ సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఏడాది దావోస్ లోని ప్రపంచ ఆర్ధిక సదస్సులో కుదుర్చుకున్న మరో…
తమిళ సినిమాల మీద తెలుగు ప్రేక్షకుల ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దశాబ్దాలుగా అక్కడి నుంచి వచ్చే అనువాద…
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…