మిరాయ్ లో కొంచెం కామెడీ టచ్ ఉన్న పోలీస్ ఆఫీసర్ పాత్ర ఒకటుంది. దాన్ని చేసిన నటుడిని చాలా మంది గుర్తించలేకపోయారు. యాక్టింగ్ పరంగా ఇబ్బంది పడుతున్న వైనం కనిపించినప్పటికీ ఓవరాల్ గా కొంచెం డిఫరెంట్ ఫీలింగ్ ఇవ్వడంలో సక్సెస్ అయ్యాడు. అతనెవరో కాదు కిషోర్ తిరుమల. ఇప్పటిదాకా డైరెక్షన్ కు మాత్రమే పరిమితమైన ఈయన హఠాత్తుగా యాక్టర్ గా ఎందుకు మారారంటే దీని వెనుకో కారణం కనిపిస్తోంది. రవితేజతో సినిమా తీస్తున్న కిషోర్ తిరుమల పనితనం చూసి బహుశా హీరో రికమండేషన్ తోనే మిరాయ్ లో ఛాన్స్ కొట్టేసినట్టు అనుకోవచ్చు.
ఈగల్ నుంచి రవితేజకు కార్తీక్ ఘట్టమనేనితో ఏర్పడ్డ చనువు ఇప్పుడు కిషోర్ ని మిరాయ్ లో భాగం చేసిందని ఇన్ సైడ్ టాక్. ఇదే సినిమాలో కనిపించిన ఇంకో నటుడు వెంకటేష్ మహా. తనకు యాక్టింగ్ కొత్త కాదు. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లోనూ కనిపిస్తూ ఉంటాడు. ప్రస్తుతం తను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో దర్శకుడిగా వేరే ప్రాజెక్టు లేనప్పటికీ భవిష్యత్తులో ఒక కాంబో అయితే ఉందని ఆల్రెడీ టాక్ ఉంది. సో ఆ అనుబంధంతో స్పెషల్ ఆఫీసర్ గా కనిపించి ఉండొచ్చు. అయితే నిడివి దృష్ట్యా వెంకటేష్ మహా, కిషోర్ తిరుమలకు ఎక్కువ స్కోప్ దక్కలేదు. ఉన్నంతలో తమకు చేతనైంది చేశారు.
వీళ్ళే కాదు అవకాశం దొరికినప్పుడు తెరమీద కనిపించాలనే కోరిక చాలా మంది దర్శకులకు ఉంటుంది. దాసరి నారాయణరావు లాంటి గ్రేట్ యాక్టర్ ని సృష్టించింది ఆ ఆకాంక్షే. ఈయనతో పైన చెప్పిన వాళ్ళను పోల్చడం ఎంత మాత్రం సబబు కాదు కానీ పనిలో పని మిరాయ్ లో కార్తిక్ ఘట్టమనేని కూడా కనిపించి ఉంటే బాగుండేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అయినా దర్శకత్వం, ఛాయాగ్రహణం రెండు బాధ్యతలు నెత్తిన వేసుకున్నప్పుడు ఇంకో రోల్ నిర్వహించడం కష్టం. ఏది ఏమైనా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న మిరాయ్ వసూళ్ల పరంగా పెద్ద స్థాయికే వెళ్లేలా ఉంది.
This post was last modified on September 12, 2025 2:46 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…