గత కొన్నేళ్లుగా సినిమాల సక్సెస్ రేట్ తగ్గుతూ వస్తోంది. థియేటర్ల పరిస్థితి అంతకంతకూ దిగజారిపోతోంది. అందుకు కారణాలు అనేకం. ఈ ఏడాది అయితే బాక్సాఫీస్ మరీ డల్లుగా మారిపోవడంతో ఇండస్ట్రీలో ఆందోళన వ్యక్తమైంది. క్రేజీ సీజన్ అయిన సమ్మర్ పెద్ద సిమాలు లేక కళ తప్పింది. ఆ తర్వాత ఎన్నో అంచనాలు, ఆశలు పెట్టుకున్న సినిమాలు వరుసగా నిరాశపరిచాయి. హరిహర వీరమల్లు, కింగ్డమ్, కూలీ, వార్-2.. ఇవన్నీ ప్రేక్షకులకు షాకులే ఇచ్చాయి. దీంతో బాక్సాఫీస్ మళ్లీ ఎప్పుడు పుంజుకుంటుందో అన్న ఆందోళన వ్యక్తమయ్యాయి. ఐతే సెప్టెంబరు నెల పాజిటివ్ నోట్తో మొదలైంది.
తొలి వారంలో ‘లిటిల్ హార్ట్స్’ అనే చిన్న సినిమా సంచలనం రేపింది. ఎవ్వరూ ఊహించని స్థాయిలో బాక్సాఫీస్ నంబర్లతో తొలి వారంలో ఈ సినిమా దూసుకెళ్లింది. ఇంకో రెండు వారాలు ఈ సినిమాకు చెప్పుకోదగ్గ వసూళ్లే వచ్చేలా ఉన్నాయి. ఇక ఈ వారం రిలీజవుతున్న రెండు సినిమాలూ ప్రామిసింగ్గా కనిపిస్తున్నాయి. ‘మిరాయ్’ అయితే స్టార్ హీరోల సినిమాల స్థాయిలో హైప్ తెచ్చుకుంది. ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో కూడా అంతర్గతంగా చాలా పాజిటివ్గా మాట్లాడుకుంటున్నారు.
తేజ సజ్జ చివరి చిత్రం ‘హనుమాన్’ లాగే పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేయగల సత్తా ఉన్న సినిమా అంటున్నారు. దీనికి అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి. ఇక ఈ వీకెండ్ రాబోతున్న మరో చిత్రం ‘కిష్కింధపురి’కి కొంచెం లేటుగా బజ్ క్రియేట్ అయింది. రెండు రోజుల ముందే పెయిడ్ ప్రిమియర్స్ వేయగా.. దానికి ఫుల్ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఎవ్వరూ సినిమా గురించి నెగెటివ్గా మాట్లాడట్లేదు. ‘రాక్షసుడు’ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్కు మరో హిట్ పడ్డట్లే అంటున్నారు. నిర్మాత చాలా ధీమాగా గురువారం కూడా పెద్ద సంఖ్యలో ప్రిమియర్స్ ప్లాన్ చేశాడు. ఈ రెండు చిత్రాలకూ పాజిటివ్ టాక్ వస్తే రెండు వారాల వరకు బాక్సాఫీస్ కళకళలాడుతుంది. ఆ తర్వాత ఎలాగూ ‘ఓజీ’ సందడి ఉంటుంది.
This post was last modified on September 11, 2025 9:59 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…