ఇంకో రెండు వారాల్లో ఓజి వచ్చేస్తున్నాడు. ప్రస్తుతానికి సౌండ్ కొంచెం తక్కువగా అనిపిస్తున్నప్పటికీ రిలీజ్ రోజు నాటికి ఏర్పడే వాతావరణం ఊహించుకోవడం కూడా కష్టమే. నెలలు, సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న క్షణం వస్తుండటంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఫ్యాన్స్ చర్చలు ప్రధానంగా రెండు విషయాల మీద జరుగుతున్నాయి. వాటిలో మొదటిది టికెట్ రేట్లు. ఏపీ తెలంగాణలో పెంచుకునే వెసులుబాటు చిన్నా పెద్ద తేడా లేకుండా అన్ని సినిమాలకు ప్రభుత్వాలు ఇస్తున్నాయి కాబట్టి డివివి ఎంటర్ టైన్మెంట్స్ దాన్ని వాడుకోకుండా ఉండదు.
అదే జరిగితే గరిష్టంగా వంద రూపాయల నుంచి నూటా యాభై రూపాయల మధ్యలో ప్రతి టికెట్ మీద పెంపు అడగొచ్చు. ఏపీలో పర్మిషన్లు ఈజీనే కానీ తెలంగాణలో ఇప్పటికే ఉన్న గరిష్ట మల్టీప్లెక్స్ ధర 295 మీద ఇంకెంత హైక్ ఇస్తారనేది సస్పెన్స్ గా నిలిచింది. డివివి టీమ్ మాత్రం ఆంధ్రప్రదేశ్ నుంచి కనిష్టంగా వందకు పైనే హైక్ ఆశిస్తోందని ఇన్ సైడ్ టాక్. ఇక రెండో అంశం ప్రీమియర్లు. అర్ధరాత్రి ఒంటి గంట నుంచి షోలు వేయాలని అప్పుడే డిస్ట్రిబ్యూటర్ల మీద అభిమాన సంఘాలు ఒత్తిడి పెడుతున్నాయట. హరిహర వీరమల్లుకే 600 రూపాయలు పెట్టినప్పుడు ఓజికి ఎంత డిసైడ్ చేస్తారనేది వేచి చూడాల్సిన విషయం.
ఇప్పటిదాకా హయ్యెస్ట్ ప్రీమియర్ టికెట్ రేట్ రికార్డు పుష్ప 2 ది రూల్ మీద ఉంది. 800 రూపాయల నుంచి 1000 మధ్యలో పెట్టి ముందు రోజే సెకండ్ షోలు వేయడం ద్వారా మైత్రి కొత్త స్ట్రాటజీకి తెరతీసింది. మరి ఇప్పుడు ఓజి దానికి ఏ మాత్రం తీసిపోని బజ్ తో క్రేజ్ సంపాదించుకుంది. కాకపోతే పవన్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి మరీ ఎక్కువ పెంపు ఇచ్చినా ప్రతిపక్షాలకు ఆయుధం అయ్యే ఛాన్స్ ఉంది. ప్రీమియర్ రేట్ ఎంత పెట్టినా బయట బ్లాక్ లో మాత్రం కనిష్టంగా వెయ్యి నుంచి అయిదు వేల దాకా పలుకుతుందని ఫ్యాన్స్ ముందస్తు అంచనా వేస్తున్నారు. నిజమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు.
This post was last modified on September 11, 2025 6:12 pm
డివైడ్ టాక్ తెచ్చుకున్న చిన్న సినిమాలు థియేటర్లలో బలంగా నిలబడ్డం అంటే చిన్న విషయం కాదు. చెన్నై లవ్ స్టోరీ…
ఒకప్పుడు యుఎస్లో తెలుగు సినిమాలు విడుదల కావడాన్నే గొప్పగా భావించేవాళ్లం. అలాంటిది అది తెలుగు సినిమాలకు పెద్ద మార్కెట్గా తయారైంది. మన…
మనమేదో ఆహా ఓహో అంటూ ఛాన్స్ దొరికినప్పుడంతా మలయాళం సినిమాలను తెగ పొగిడేస్తూ ఉంటాం కాని అక్కడి దర్శకులు కూడా…
టికెట్ రేటు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు కానీ.. మల్టీప్లెక్సుల్లోనే సినిమాలు చూద్దాం అనుకునే ప్రేక్షకులు పెరిగిపోయారు గత కొన్నేళ్లలో. దాని…
వైసీపీ అధినేత జగన్ పర్యటనల్లో భాగంగా ఇటీవల కాలంలో `రప్పా-రప్పా` డైలాగులు తరచుగా వినిపించేవి. రప్పా-రప్పా అని రాసున్న బ్యానర్లు,…
వరుణ్ తేజ్ ప్రస్తుతం మనసులో అనుకుంటున్న మాట ఇదే. కొరియన్ కనకరాజుకి ఒక రోజు ముందే ప్రీమియర్లు వేయడం రిస్కని…