Movie News

జాతకం మార్చేసిన 200 కోట్ల సినిమా

ఇండస్ట్రీలో అంతే. ఒకే ఒక్క సినిమా రాత్రికి రాత్రి జాతకాలను మార్చేస్తుంది. చిరంజీవికి ఖైదీ, నాగార్జునకు శివ అలా నిలిచిపోయినవే. కాకపోతే హీరోయిన్లకు ఇలాంటి బ్రేక్స్ దొరకడం కష్టం. విజయశాంతికి కర్తవ్యం లాగా ప్రతి ఒక్కరికి అవి సాధ్యం కావు. కానీ కళ్యాణి ప్రియదర్శన్ సుడి బాగుంది. ఇటీవలే విడుదలైన కొత్త లోక చాప్టర్ 1తో ఏకంగా 200 కోట్ల క్లబ్బులో అడుగు పెట్టడంతో తన స్టార్ డమ్ అమాంతం పెరిగిపోయింది. లోకకు సంబంధించి లీడ్ రోల్ తనదే కావడంతో హీరో నస్లీన్ ఎక్కువసేపు కనిపించినా కూడా ఆమె స్థాయిలో గుర్తింపు దక్కించుకోలేకపోయాడు. అలా కళ్యాణికి దశ తిరుగుతోందన్న మాట.

తొమ్మిది సంవత్సరాల క్రితం వచ్చిన కళ్యాణి ప్రియదర్శన్ సరైన బ్రేక్ కోసం చాలానే ఎదురు చూసింది. తెలుగులో డెబ్యూ చేసిన హలో పోయినా చిత్రలహరి మంచి హిట్ గానే నిలిచింది. కానీ రణరంగం డిజాస్టర్ కావడంతో మళ్ళీ ఈ వైపుకు రాలేదు. మలయాళం, తమిళం మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఇప్పటిదాకా ఈ అమ్మాయికి పెర్ఫార్మన్స్ పరంగా గొప్ప మార్కులు పడేవి కాదు. హృదయం, తాలుమాల నుంచి తనలో నటిని బయటికి తీసుకురావడం మొదలుపెట్టింది. లోకలోనూ కథ డిమాండ్ మేరకు సీరియస్ ఎక్స్ ప్రెషన్లు ఎక్కువ పెట్టింది కానీ యాక్టింగ్ పరంగా మెరుగయ్యిందనేది వాస్తవం.

కూతురు సక్సెస్ పట్ల తండ్రి ప్రియదర్శన్ చాలా సంతోషంగా ఉన్నారు. బ్లాక్ బస్టర్ దర్శకుడిగా ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చిన ఈయన ఇప్పుడు కూడా డైరెక్షన్ చేస్తూనే ఉన్నారు. 90 దశకంలో నాగార్జున నిర్ణయం, బాలకృష్ణ గాండీవం తీశారు కానీ ఆ రెండూ ఆశించిన అంచనాలు అందుకోలేకపోయాయి. తర్వాత మళ్ళీ ఇటువైపు రాలేదు. కళ్యాణి తెలుగులో చేసినవి రెండు సినిమాలే అయితే ప్రియదర్శన్ కూడా రెండింటికే పరిమితం కావడం గమనించాల్సిన విషయం. కళ్యాణి ప్రస్తుతం రవి మోహన్ తో చేసిన ఫాంటసీ మూవీ జీనీ త్వరలో విడుదలకు రెడీ అవుతుండగా కార్తీ మార్షల్ నిర్మాణంలో ఉంది.

This post was last modified on September 11, 2025 11:55 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

3 hours ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

5 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

5 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

6 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

7 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

8 hours ago