ఇండస్ట్రీలో అంతే. ఒకే ఒక్క సినిమా రాత్రికి రాత్రి జాతకాలను మార్చేస్తుంది. చిరంజీవికి ఖైదీ, నాగార్జునకు శివ అలా నిలిచిపోయినవే. కాకపోతే హీరోయిన్లకు ఇలాంటి బ్రేక్స్ దొరకడం కష్టం. విజయశాంతికి కర్తవ్యం లాగా ప్రతి ఒక్కరికి అవి సాధ్యం కావు. కానీ కళ్యాణి ప్రియదర్శన్ సుడి బాగుంది. ఇటీవలే విడుదలైన కొత్త లోక చాప్టర్ 1తో ఏకంగా 200 కోట్ల క్లబ్బులో అడుగు పెట్టడంతో తన స్టార్ డమ్ అమాంతం పెరిగిపోయింది. లోకకు సంబంధించి లీడ్ రోల్ తనదే కావడంతో హీరో నస్లీన్ ఎక్కువసేపు కనిపించినా కూడా ఆమె స్థాయిలో గుర్తింపు దక్కించుకోలేకపోయాడు. అలా కళ్యాణికి దశ తిరుగుతోందన్న మాట.
తొమ్మిది సంవత్సరాల క్రితం వచ్చిన కళ్యాణి ప్రియదర్శన్ సరైన బ్రేక్ కోసం చాలానే ఎదురు చూసింది. తెలుగులో డెబ్యూ చేసిన హలో పోయినా చిత్రలహరి మంచి హిట్ గానే నిలిచింది. కానీ రణరంగం డిజాస్టర్ కావడంతో మళ్ళీ ఈ వైపుకు రాలేదు. మలయాళం, తమిళం మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఇప్పటిదాకా ఈ అమ్మాయికి పెర్ఫార్మన్స్ పరంగా గొప్ప మార్కులు పడేవి కాదు. హృదయం, తాలుమాల నుంచి తనలో నటిని బయటికి తీసుకురావడం మొదలుపెట్టింది. లోకలోనూ కథ డిమాండ్ మేరకు సీరియస్ ఎక్స్ ప్రెషన్లు ఎక్కువ పెట్టింది కానీ యాక్టింగ్ పరంగా మెరుగయ్యిందనేది వాస్తవం.
కూతురు సక్సెస్ పట్ల తండ్రి ప్రియదర్శన్ చాలా సంతోషంగా ఉన్నారు. బ్లాక్ బస్టర్ దర్శకుడిగా ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చిన ఈయన ఇప్పుడు కూడా డైరెక్షన్ చేస్తూనే ఉన్నారు. 90 దశకంలో నాగార్జున నిర్ణయం, బాలకృష్ణ గాండీవం తీశారు కానీ ఆ రెండూ ఆశించిన అంచనాలు అందుకోలేకపోయాయి. తర్వాత మళ్ళీ ఇటువైపు రాలేదు. కళ్యాణి తెలుగులో చేసినవి రెండు సినిమాలే అయితే ప్రియదర్శన్ కూడా రెండింటికే పరిమితం కావడం గమనించాల్సిన విషయం. కళ్యాణి ప్రస్తుతం రవి మోహన్ తో చేసిన ఫాంటసీ మూవీ జీనీ త్వరలో విడుదలకు రెడీ అవుతుండగా కార్తీ మార్షల్ నిర్మాణంలో ఉంది.
This post was last modified on September 11, 2025 11:55 am
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…