ఇండస్ట్రీలో అంతే. ఒకే ఒక్క సినిమా రాత్రికి రాత్రి జాతకాలను మార్చేస్తుంది. చిరంజీవికి ఖైదీ, నాగార్జునకు శివ అలా నిలిచిపోయినవే. కాకపోతే హీరోయిన్లకు ఇలాంటి బ్రేక్స్ దొరకడం కష్టం. విజయశాంతికి కర్తవ్యం లాగా ప్రతి ఒక్కరికి అవి సాధ్యం కావు. కానీ కళ్యాణి ప్రియదర్శన్ సుడి బాగుంది. ఇటీవలే విడుదలైన కొత్త లోక చాప్టర్ 1తో ఏకంగా 200 కోట్ల క్లబ్బులో అడుగు పెట్టడంతో తన స్టార్ డమ్ అమాంతం పెరిగిపోయింది. లోకకు సంబంధించి లీడ్ రోల్ తనదే కావడంతో హీరో నస్లీన్ ఎక్కువసేపు కనిపించినా కూడా ఆమె స్థాయిలో గుర్తింపు దక్కించుకోలేకపోయాడు. అలా కళ్యాణికి దశ తిరుగుతోందన్న మాట.
తొమ్మిది సంవత్సరాల క్రితం వచ్చిన కళ్యాణి ప్రియదర్శన్ సరైన బ్రేక్ కోసం చాలానే ఎదురు చూసింది. తెలుగులో డెబ్యూ చేసిన హలో పోయినా చిత్రలహరి మంచి హిట్ గానే నిలిచింది. కానీ రణరంగం డిజాస్టర్ కావడంతో మళ్ళీ ఈ వైపుకు రాలేదు. మలయాళం, తమిళం మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఇప్పటిదాకా ఈ అమ్మాయికి పెర్ఫార్మన్స్ పరంగా గొప్ప మార్కులు పడేవి కాదు. హృదయం, తాలుమాల నుంచి తనలో నటిని బయటికి తీసుకురావడం మొదలుపెట్టింది. లోకలోనూ కథ డిమాండ్ మేరకు సీరియస్ ఎక్స్ ప్రెషన్లు ఎక్కువ పెట్టింది కానీ యాక్టింగ్ పరంగా మెరుగయ్యిందనేది వాస్తవం.
కూతురు సక్సెస్ పట్ల తండ్రి ప్రియదర్శన్ చాలా సంతోషంగా ఉన్నారు. బ్లాక్ బస్టర్ దర్శకుడిగా ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చిన ఈయన ఇప్పుడు కూడా డైరెక్షన్ చేస్తూనే ఉన్నారు. 90 దశకంలో నాగార్జున నిర్ణయం, బాలకృష్ణ గాండీవం తీశారు కానీ ఆ రెండూ ఆశించిన అంచనాలు అందుకోలేకపోయాయి. తర్వాత మళ్ళీ ఇటువైపు రాలేదు. కళ్యాణి తెలుగులో చేసినవి రెండు సినిమాలే అయితే ప్రియదర్శన్ కూడా రెండింటికే పరిమితం కావడం గమనించాల్సిన విషయం. కళ్యాణి ప్రస్తుతం రవి మోహన్ తో చేసిన ఫాంటసీ మూవీ జీనీ త్వరలో విడుదలకు రెడీ అవుతుండగా కార్తీ మార్షల్ నిర్మాణంలో ఉంది.
This post was last modified on September 11, 2025 11:55 am
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…
విద్యార్థి ఉద్యమాలకు తెరదీసిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నాయకులు, కార్యకర్తలకు తొలిసారి పరాభవం ఎదురైంది. ఇటీవల నీట్ ప్రశ్న పత్రం…
ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…
హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్రభుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్నడూ లేని విధంగా కళ్లు చెదిరే…