తాను బయట కనిపించకపోయినా పర్లేదు తెరమీద దర్శనమిస్తే చాలు టికెట్లు కొనే జనాలున్నారన్న అనుష్క అంచనాలను ఘాటీ పూర్తిగా మాయం చేసింది. వచ్చిన కాసిన్ని ఓపెనింగ్స్ ఆమె ఖాతాలోకే వేసినా అవి కూడా మరీ తీసికట్టుగా ఉండటం ఆలోచించాల్సిన విషయం. ఆచార్య, ఆఫీసర్, రూలర్ లాంటి డిజాస్టర్లతో పోలుస్తున్నారంటే సినిమా ఏ స్థాయిలో ఆడిందో అర్థం చేసుకోవచ్చు. ఆడియో రూపంలో స్వీటీ చేసిన పబ్లిసిటీ వల్ల ఏ ఉపయోగం కలగలేదు. ఇప్పుడు తన నుంచి వస్తున్న నెక్స్ట్ మూవీ మలయాళంలో తీసిన కథనర్. ఇది పీరియాడిక్ డ్రామా. తెలుగులోనూ డబ్బింగ్ చేసి సమాంతరంగా వదులుతారు.
ఇక అనుష్క ఏదో ఒకటి తేల్చుకునే టైం అయితే వచ్చేసింది. సినిమాలు కొనసాగించాలంటే స్పీడ్ పెంచాలి. నాలుగు పదుల వయసు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకపోవడం తన వ్యక్తిగత విషయం. ఆ మాటకొస్తే త్రిష లాంటి వాళ్ళు కూడా ఈ క్లబ్బులో ఉన్నారు. ఇప్పటికీ చేతి నిండా నాలుగైదు సినిమాలతో ఆమె బిజీగా ఉంది. కానీ అనుష్క సంగతి వేరు. మీడియా కెమెరాల ముందుకు రావడం లేదు. తన రూపం కోసం ఆలా చేస్తోందా లేక ఇంకేమైనా కారణాలున్నాయా అనేది తెలియలేదు, ఇకపై తన దగ్గరికి వచ్చే కథలు, దర్శకులను వెయిట్ చేయించకుండా త్వరగా నిర్ణయాలు తీసుకుంటే కెరీర్ బాగుటుంది.
ఘాటీలో అనుష్క మరీ బ్యాడ్ గా అనిపించలేదు. కొంచెం బొద్దుగా ఉన్నా చూడబుల్ గా ఉంది. కొన్ని సీన్స్ లో బాగా పెర్ఫార్మ్ చేసింది కూడా. అలాంటప్పుడు రెగ్యులర్ గా చేస్తూ ఉంటే ఆడియన్స్ తో కనెక్టివిటీ ఉంటుంది. ఎక్కువ గ్యాప్ తీసుకున్నా పాత స్థాయిలో ఆదరణ దక్కించుకునే వెసులుబాటు హీరోయిన్లకు ఉండదు. ఎనిమిదేళ్లు మేకప్ కి దూరంగా ఉన్నా చిరంజీవిని ఆదరించిన జనం విజయశాంతిని అదే స్థాయిలో రిసీవ్ చేసుకోలేకపోయారు. సో కంటిన్యూటీ చాలా అవసరం. మరి అనుష్క కనక ఫిల్మోగ్రఫీ పెంచుకునే ఉద్దేశంలో ఉంటే మాత్రం యువి క్రియేషన్స్ కాకుండా బయట సంస్థలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి.
This post was last modified on September 10, 2025 3:03 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…