తాను బయట కనిపించకపోయినా పర్లేదు తెరమీద దర్శనమిస్తే చాలు టికెట్లు కొనే జనాలున్నారన్న అనుష్క అంచనాలను ఘాటీ పూర్తిగా మాయం చేసింది. వచ్చిన కాసిన్ని ఓపెనింగ్స్ ఆమె ఖాతాలోకే వేసినా అవి కూడా మరీ తీసికట్టుగా ఉండటం ఆలోచించాల్సిన విషయం. ఆచార్య, ఆఫీసర్, రూలర్ లాంటి డిజాస్టర్లతో పోలుస్తున్నారంటే సినిమా ఏ స్థాయిలో ఆడిందో అర్థం చేసుకోవచ్చు. ఆడియో రూపంలో స్వీటీ చేసిన పబ్లిసిటీ వల్ల ఏ ఉపయోగం కలగలేదు. ఇప్పుడు తన నుంచి వస్తున్న నెక్స్ట్ మూవీ మలయాళంలో తీసిన కథనర్. ఇది పీరియాడిక్ డ్రామా. తెలుగులోనూ డబ్బింగ్ చేసి సమాంతరంగా వదులుతారు.
ఇక అనుష్క ఏదో ఒకటి తేల్చుకునే టైం అయితే వచ్చేసింది. సినిమాలు కొనసాగించాలంటే స్పీడ్ పెంచాలి. నాలుగు పదుల వయసు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకపోవడం తన వ్యక్తిగత విషయం. ఆ మాటకొస్తే త్రిష లాంటి వాళ్ళు కూడా ఈ క్లబ్బులో ఉన్నారు. ఇప్పటికీ చేతి నిండా నాలుగైదు సినిమాలతో ఆమె బిజీగా ఉంది. కానీ అనుష్క సంగతి వేరు. మీడియా కెమెరాల ముందుకు రావడం లేదు. తన రూపం కోసం ఆలా చేస్తోందా లేక ఇంకేమైనా కారణాలున్నాయా అనేది తెలియలేదు, ఇకపై తన దగ్గరికి వచ్చే కథలు, దర్శకులను వెయిట్ చేయించకుండా త్వరగా నిర్ణయాలు తీసుకుంటే కెరీర్ బాగుటుంది.
ఘాటీలో అనుష్క మరీ బ్యాడ్ గా అనిపించలేదు. కొంచెం బొద్దుగా ఉన్నా చూడబుల్ గా ఉంది. కొన్ని సీన్స్ లో బాగా పెర్ఫార్మ్ చేసింది కూడా. అలాంటప్పుడు రెగ్యులర్ గా చేస్తూ ఉంటే ఆడియన్స్ తో కనెక్టివిటీ ఉంటుంది. ఎక్కువ గ్యాప్ తీసుకున్నా పాత స్థాయిలో ఆదరణ దక్కించుకునే వెసులుబాటు హీరోయిన్లకు ఉండదు. ఎనిమిదేళ్లు మేకప్ కి దూరంగా ఉన్నా చిరంజీవిని ఆదరించిన జనం విజయశాంతిని అదే స్థాయిలో రిసీవ్ చేసుకోలేకపోయారు. సో కంటిన్యూటీ చాలా అవసరం. మరి అనుష్క కనక ఫిల్మోగ్రఫీ పెంచుకునే ఉద్దేశంలో ఉంటే మాత్రం యువి క్రియేషన్స్ కాకుండా బయట సంస్థలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి.
This post was last modified on September 10, 2025 3:03 pm
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…