తాను బయట కనిపించకపోయినా పర్లేదు తెరమీద దర్శనమిస్తే చాలు టికెట్లు కొనే జనాలున్నారన్న అనుష్క అంచనాలను ఘాటీ పూర్తిగా మాయం చేసింది. వచ్చిన కాసిన్ని ఓపెనింగ్స్ ఆమె ఖాతాలోకే వేసినా అవి కూడా మరీ తీసికట్టుగా ఉండటం ఆలోచించాల్సిన విషయం. ఆచార్య, ఆఫీసర్, రూలర్ లాంటి డిజాస్టర్లతో పోలుస్తున్నారంటే సినిమా ఏ స్థాయిలో ఆడిందో అర్థం చేసుకోవచ్చు. ఆడియో రూపంలో స్వీటీ చేసిన పబ్లిసిటీ వల్ల ఏ ఉపయోగం కలగలేదు. ఇప్పుడు తన నుంచి వస్తున్న నెక్స్ట్ మూవీ మలయాళంలో తీసిన కథనర్. ఇది పీరియాడిక్ డ్రామా. తెలుగులోనూ డబ్బింగ్ చేసి సమాంతరంగా వదులుతారు.
ఇక అనుష్క ఏదో ఒకటి తేల్చుకునే టైం అయితే వచ్చేసింది. సినిమాలు కొనసాగించాలంటే స్పీడ్ పెంచాలి. నాలుగు పదుల వయసు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకపోవడం తన వ్యక్తిగత విషయం. ఆ మాటకొస్తే త్రిష లాంటి వాళ్ళు కూడా ఈ క్లబ్బులో ఉన్నారు. ఇప్పటికీ చేతి నిండా నాలుగైదు సినిమాలతో ఆమె బిజీగా ఉంది. కానీ అనుష్క సంగతి వేరు. మీడియా కెమెరాల ముందుకు రావడం లేదు. తన రూపం కోసం ఆలా చేస్తోందా లేక ఇంకేమైనా కారణాలున్నాయా అనేది తెలియలేదు, ఇకపై తన దగ్గరికి వచ్చే కథలు, దర్శకులను వెయిట్ చేయించకుండా త్వరగా నిర్ణయాలు తీసుకుంటే కెరీర్ బాగుటుంది.
ఘాటీలో అనుష్క మరీ బ్యాడ్ గా అనిపించలేదు. కొంచెం బొద్దుగా ఉన్నా చూడబుల్ గా ఉంది. కొన్ని సీన్స్ లో బాగా పెర్ఫార్మ్ చేసింది కూడా. అలాంటప్పుడు రెగ్యులర్ గా చేస్తూ ఉంటే ఆడియన్స్ తో కనెక్టివిటీ ఉంటుంది. ఎక్కువ గ్యాప్ తీసుకున్నా పాత స్థాయిలో ఆదరణ దక్కించుకునే వెసులుబాటు హీరోయిన్లకు ఉండదు. ఎనిమిదేళ్లు మేకప్ కి దూరంగా ఉన్నా చిరంజీవిని ఆదరించిన జనం విజయశాంతిని అదే స్థాయిలో రిసీవ్ చేసుకోలేకపోయారు. సో కంటిన్యూటీ చాలా అవసరం. మరి అనుష్క కనక ఫిల్మోగ్రఫీ పెంచుకునే ఉద్దేశంలో ఉంటే మాత్రం యువి క్రియేషన్స్ కాకుండా బయట సంస్థలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి.
This post was last modified on September 10, 2025 3:03 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…