కాదేది బయోపిక్కుకి అనర్హం అన్నట్టుంది ట్రెండ్. స్పోర్ట్స్ స్టార్స్, రాజకీయ నాయకులు, సినిమా తారలు ఇలా వీళ్ళ కథలు చూసి చూసి బోర్ కొట్టిందేమో దర్శకుడు టీజె జ్ఞానవేల్ కొత్త ఆలోచన చేస్తున్నారు. తమిళనాడులో దోశె కింగ్ గా ప్రసిద్ధి పొందిన శరవణ భవన్ వ్యవస్థాపకుడు పి రాజగోపాల్ జీవితం ఆధారంగా ఒక సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నారట. స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని లాలెట్టాన్ మోహన్ లాల్ ని దాదాపుగా ఒప్పించారని సమాచారం. అయితే ఈయన జీవితంలో ఎన్నో గొప్ప ఎత్తులకు చేరుకున్నాడు కానీ దానికి సమానమైన నేర చరిత్ర కూడా ఉంది. అదే ఈ కథలో కీలకం కానుంది.
తమిళనాడులోని మారుమూల పల్లెకు చెందిన రాజగోపాల్ పెద్దగా చదువుకోలేదు. కిరాణా కొట్టుతో వ్యాపారం మొదలుపెట్టి 1981లో చిన్న హోటల్ ప్రారంభించాడు. దోసెలు మహా రుచిగా వేయడంతో తక్కువ టైంలోనే పాపులారిటీ సంపాదించుకున్నాడు. క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా బ్రాంచీలు ఓపెన్ చేసి వేల నుంచి కోట్ల రూపాయలకు పడగలెత్తాడు. ఒక జ్యోతిష్యుడి సలహా మేరకు అసిస్టెంట్ మేనేజర్ కూతురైన జీవజ్యోతిని పెళ్లాడాలని తెగ ప్రయత్నించాడు. కానీ ఆమెకు అప్పటికే శాంత కుమార్ అనే వ్యక్తితో పెళ్ళైపోయి ఉంటుంది. 2001లో శరత్ మృతదేహం ఒక అడవిలో దొరికింది. రాజగోపాల్ మీద కిడ్నాప్, హత్యకేసు నమోదయ్యింది.
నేరం ఋజువు కావడంతో 2010లో రాజగోపాల్ కు పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడింది. 2019లో సుప్రీమ్ కోర్టు దాన్ని యావజ్జీవ ఖైదుగా మార్చింది. అదే సంవత్సరం కోర్టుకు వచ్చి లొంగిపోయే క్రమంలో రాజగోపాల్ గుండెపోటుతో చనిపోయారు. ఒక ఆడదాన్ని ఇష్టపడటం వల్ల ఇటుక ఇటుక పేర్చి కట్టుకున్న సామ్రాజ్యాన్ని కూల్చేసుకున్న ఇతని జీవితం మీద ఎన్నో కథనాలు వచ్చాయి. వెట్టయన్, జై భీంతో పేరు తెచ్చుకున్న టీజె జ్ఞానవేల్ మరి రాజగోపాల్ ని పాజిటివ్ గా చూపిస్తారా లేక ఉన్నద్ధున్నట్టు ప్రెజెంట్ చేస్తారో చూడాలి. మోహన్ లాల్ అయితే సానుకూలంగా స్పందించినట్టు చెన్నై అప్డేట్.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…