Movie News

హత్య చేసిన దోసెల రాజుగా మోహన్ లాల్ ?

కాదేది బయోపిక్కుకి అనర్హం అన్నట్టుంది ట్రెండ్. స్పోర్ట్స్ స్టార్స్, రాజకీయ నాయకులు, సినిమా తారలు ఇలా వీళ్ళ కథలు చూసి చూసి బోర్ కొట్టిందేమో దర్శకుడు టీజె జ్ఞానవేల్ కొత్త ఆలోచన చేస్తున్నారు. తమిళనాడులో దోశె కింగ్ గా ప్రసిద్ధి పొందిన శరవణ భవన్ వ్యవస్థాపకుడు పి రాజగోపాల్ జీవితం ఆధారంగా ఒక సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నారట. స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని లాలెట్టాన్ మోహన్ లాల్ ని దాదాపుగా ఒప్పించారని సమాచారం. అయితే ఈయన జీవితంలో ఎన్నో గొప్ప ఎత్తులకు చేరుకున్నాడు కానీ దానికి సమానమైన నేర చరిత్ర కూడా ఉంది. అదే ఈ కథలో కీలకం కానుంది.

తమిళనాడులోని మారుమూల పల్లెకు చెందిన రాజగోపాల్ పెద్దగా చదువుకోలేదు. కిరాణా కొట్టుతో వ్యాపారం మొదలుపెట్టి 1981లో చిన్న హోటల్ ప్రారంభించాడు. దోసెలు మహా రుచిగా వేయడంతో తక్కువ టైంలోనే పాపులారిటీ సంపాదించుకున్నాడు. క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా బ్రాంచీలు ఓపెన్ చేసి వేల నుంచి కోట్ల రూపాయలకు పడగలెత్తాడు. ఒక జ్యోతిష్యుడి సలహా మేరకు అసిస్టెంట్ మేనేజర్ కూతురైన జీవజ్యోతిని పెళ్లాడాలని తెగ ప్రయత్నించాడు. కానీ ఆమెకు అప్పటికే శాంత కుమార్ అనే వ్యక్తితో పెళ్ళైపోయి ఉంటుంది. 2001లో శరత్ మృతదేహం ఒక అడవిలో దొరికింది. రాజగోపాల్ మీద కిడ్నాప్, హత్యకేసు నమోదయ్యింది.

నేరం ఋజువు కావడంతో 2010లో రాజగోపాల్ కు పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడింది. 2019లో సుప్రీమ్ కోర్టు దాన్ని యావజ్జీవ ఖైదుగా మార్చింది. అదే సంవత్సరం కోర్టుకు వచ్చి లొంగిపోయే క్రమంలో రాజగోపాల్ గుండెపోటుతో చనిపోయారు. ఒక ఆడదాన్ని ఇష్టపడటం వల్ల ఇటుక ఇటుక పేర్చి కట్టుకున్న సామ్రాజ్యాన్ని కూల్చేసుకున్న ఇతని జీవితం మీద ఎన్నో కథనాలు వచ్చాయి. వెట్టయన్, జై భీంతో పేరు తెచ్చుకున్న టీజె జ్ఞానవేల్ మరి రాజగోపాల్ ని పాజిటివ్ గా చూపిస్తారా లేక ఉన్నద్ధున్నట్టు ప్రెజెంట్ చేస్తారో చూడాలి. మోహన్ లాల్ అయితే సానుకూలంగా స్పందించినట్టు చెన్నై అప్డేట్.

This post was last modified on September 8, 2025 2:37 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Mohan Lal

Recent Posts

సంక్రాంతి ఎఫెక్ట్: హైదరాబాద్ నిల్లు… విజయవాడ ఫుల్లు

సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…

30 minutes ago

దెబ్బతిన్న హీరోలు vs రావిపూడి

టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…

49 minutes ago

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

1 hour ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

2 hours ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

3 hours ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

3 hours ago