కాదేది బయోపిక్కుకి అనర్హం అన్నట్టుంది ట్రెండ్. స్పోర్ట్స్ స్టార్స్, రాజకీయ నాయకులు, సినిమా తారలు ఇలా వీళ్ళ కథలు చూసి చూసి బోర్ కొట్టిందేమో దర్శకుడు టీజె జ్ఞానవేల్ కొత్త ఆలోచన చేస్తున్నారు. తమిళనాడులో దోశె కింగ్ గా ప్రసిద్ధి పొందిన శరవణ భవన్ వ్యవస్థాపకుడు పి రాజగోపాల్ జీవితం ఆధారంగా ఒక సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నారట. స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని లాలెట్టాన్ మోహన్ లాల్ ని దాదాపుగా ఒప్పించారని సమాచారం. అయితే ఈయన జీవితంలో ఎన్నో గొప్ప ఎత్తులకు చేరుకున్నాడు కానీ దానికి సమానమైన నేర చరిత్ర కూడా ఉంది. అదే ఈ కథలో కీలకం కానుంది.
తమిళనాడులోని మారుమూల పల్లెకు చెందిన రాజగోపాల్ పెద్దగా చదువుకోలేదు. కిరాణా కొట్టుతో వ్యాపారం మొదలుపెట్టి 1981లో చిన్న హోటల్ ప్రారంభించాడు. దోసెలు మహా రుచిగా వేయడంతో తక్కువ టైంలోనే పాపులారిటీ సంపాదించుకున్నాడు. క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా బ్రాంచీలు ఓపెన్ చేసి వేల నుంచి కోట్ల రూపాయలకు పడగలెత్తాడు. ఒక జ్యోతిష్యుడి సలహా మేరకు అసిస్టెంట్ మేనేజర్ కూతురైన జీవజ్యోతిని పెళ్లాడాలని తెగ ప్రయత్నించాడు. కానీ ఆమెకు అప్పటికే శాంత కుమార్ అనే వ్యక్తితో పెళ్ళైపోయి ఉంటుంది. 2001లో శరత్ మృతదేహం ఒక అడవిలో దొరికింది. రాజగోపాల్ మీద కిడ్నాప్, హత్యకేసు నమోదయ్యింది.
నేరం ఋజువు కావడంతో 2010లో రాజగోపాల్ కు పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడింది. 2019లో సుప్రీమ్ కోర్టు దాన్ని యావజ్జీవ ఖైదుగా మార్చింది. అదే సంవత్సరం కోర్టుకు వచ్చి లొంగిపోయే క్రమంలో రాజగోపాల్ గుండెపోటుతో చనిపోయారు. ఒక ఆడదాన్ని ఇష్టపడటం వల్ల ఇటుక ఇటుక పేర్చి కట్టుకున్న సామ్రాజ్యాన్ని కూల్చేసుకున్న ఇతని జీవితం మీద ఎన్నో కథనాలు వచ్చాయి. వెట్టయన్, జై భీంతో పేరు తెచ్చుకున్న టీజె జ్ఞానవేల్ మరి రాజగోపాల్ ని పాజిటివ్ గా చూపిస్తారా లేక ఉన్నద్ధున్నట్టు ప్రెజెంట్ చేస్తారో చూడాలి. మోహన్ లాల్ అయితే సానుకూలంగా స్పందించినట్టు చెన్నై అప్డేట్.
This post was last modified on September 8, 2025 2:37 pm
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…
విద్యార్థి ఉద్యమాలకు తెరదీసిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నాయకులు, కార్యకర్తలకు తొలిసారి పరాభవం ఎదురైంది. ఇటీవల నీట్ ప్రశ్న పత్రం…
ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…
హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్రభుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్నడూ లేని విధంగా కళ్లు చెదిరే…
హైదరాబాద్లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…