ఫలానా చిత్ర బృందంపై ఇళయరాజా ఆగ్రహం.. లీగల్ నోటీసులు ఇచ్చిన ఇళయరాజా.. తన పాటలు అనుమతి లేకుండా వాడినందుకు కోర్టుకు ఇళయరాజా.. గత కొన్నేళ్లుగా ఇలాంటి వార్తలు తరచుగా చూస్తున్నాం. మ్యూజిక్ కన్సర్టుల్లో తన పాటలు వాడినా ఆయన ఒప్పుకోవట్లేదు. తన ఆప్తమిత్రుడైన దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు సైతం ఆయన లీగల్ నోటీసులివ్వడం అప్పట్లో చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఎవరు ఏ రకంగా తన పాట వాడినా రాయల్టీ ఇవ్వాల్సిందే అని ఇళయరాజా అంటున్నారు. తన మీద అభిమానంతో ఎక్కడైనా తన పాట, బీజీఎం వాడినా ఆయన ఊరుకోవట్లేదు. లీగల్ నోటీసులు ఇస్తున్నారు. లేదంటే కోర్టులో కేసులు వేస్తున్నారు.
మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ ‘మంజుమ్మల్ బాయ్స్’ టీం మీద ఇలాగే కోర్టులో పోరాడి నష్టపరిహారం కూడా ఇప్పించుకున్నారు. ఇప్పుడు ఇళయరాజా.. ఓ పెద్ద సినిమా మేకర్స్ మీద కోర్టుకెక్కారు. తమిళంలో టాప్ స్టార్లలో ఒకడైన అజిత్ కుమార్ హీరోగా ఈ ఏడాది వచ్చిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ టీం మీద ఇళయరాజా కోర్టులో కేసు వేశారు. ఈ చిత్రంలో అక్కడక్కడా ఇళయరాజా పాటలు వినిపిస్తాయి.
సినిమా చూసిన వాళ్లకు అది ఇళయరాజా మీద అభిమానంతోనే అనే విషయం అర్థమవుతుంది. కానీ ఆయన మాత్రం ఉద్దేశం ఏదైనప్పటికీ.. తన అనుమతి లేకుండా వర్క్ ఏ రకంగానూ వాడుకోవడానికి వీల్లేదనే అంటున్నారు. ఆయన మద్రాసు హైకోర్టులో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ టీం మీద కేసు వేశారు. సినిమా నుంచి తన పాటలు తీసేయడంతో పాటు.. తనకు నష్టపరిహారం ఇవ్వాలని ఇళయారాజా డిమాండ్ చేశారు. సెప్టెంబరు 8న ఈ కేసు విచారణకు రానుంది. తమిళంలో అజిత్ పెద్ద స్టార్ అయినప్పటికీ.. ఇళయరాజా ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. ఆయన అందరి విషయంలోనూ ఒకే రూల్ పాటిస్తున్నారు. బాలుకే నోటీసులు పంపించిన ఇళయరాజా.. అజిత్ను మాత్రం ఎలా వదిలేస్తారు?
This post was last modified on September 6, 2025 2:23 pm
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…