ప్రస్తుతం రవితేజ రెండు సినిమాలు శరవేగంగా పరుగులు పెడుతున్నాయి. చిన్న ప్యాచ్ వర్క్స్ మినహాయించి మాస్ జాతర దాదాపుగా అయిపోయినట్టే. ఆగస్ట్ 27 విడుదల తేదీని వదులుకున్నాక ఇంకా కొత్త డేట్ ప్రకటించలేదు. అక్టోబర్ లో రావొచ్చని అంటున్నారు కానీ నిర్మాత నాగవంశీ ఫైనల్ కాల్ తీసుకోలేదు. ఇటీవలే అవుట్ ఫుట్ చూసుకుని సంతృప్తి చెందారని, ఒకప్పటి వింటేజ్ రవితేజని చూసి ఆడియన్స్ ఖచ్చితంగా థ్రిల్ అవుతారని సన్నిహితులతో అంటున్నారట. కొందరు డిస్ట్రిబ్యూటర్లకు షో వేశారనే ప్రచారం జరిగింది కానీ దానికి సంబంధించి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు కానీ టాక్ అయితే గట్టిగానే ఉంది.
ఇక కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేస్తున్న మరో మూవీకి అనార్కలి టైటిల్ ప్రచారంలో ఉంది. దీన్ని 2026 సంక్రాంతికి రిలీజ్ చేస్తామని మేకర్స్ గతంలోనే ప్రకటించారు. కాకపోతే పోటీ మరీ తీవ్రంగా ఉండటంతో నిర్ణయాలు మారినా ఆశ్చర్యం లేదు. మాస్ జాతర డేట్ ఫిక్స్ అయితే దానికి సంబంధించిన ప్రమోషన్ల కోసం రవితేజ ప్రత్యేక సమయం కేటాయించాల్సి ఉంటుంది. అయితే వీటి తర్వాత మాస్ మహారాజా మరో మూవీకి మ్యాడ్ ఫేమ్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించడం ఆల్రెడీ లాక్ చేసుకున్న ప్రాజెక్టు. పెద్ద బడ్జెట్ తో సూపర్ హీరో బ్యాక్ డ్రాప్ తో సితార బ్యానరే దీన్ని నిర్మించాలని ప్లాన్ చేసుకుంది.
తాజా లీక్ ప్రకారం ఇది కొంచెం ఆలస్యం అయ్యేలా ఉందట. బడ్జెట్ పరంగా లెక్కలు మారిపోతుండటంతో అంత మేరకు థియేట్రికల్ గా వర్కౌట్ అవుతుందా లేదా అనే దాని గురించి చర్చలు జరుగుతున్నట్టు వినికిడి. కింగ్డమ్ ఫెయిల్యూర్, డిస్ట్రిబ్యూషన్ చేసిన వార్ 2 డిజాస్టర్ కావడం లాంటి కారణాలు సితార బృందాన్ని నెక్స్ట్ చేయబోయే సినిమాలను సమీక్షించుకునేలా చేశాయట. అందులో భాగంగానే రవితేజ 77 ఇంకొంచెం లేట్ అవ్వొచ్చని అంటున్నారు. అంతుచిక్కని మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా నిర్మాణాలు, రిలీజులు, వాయిదాలు ఇలా అన్ని అంశాలకు సంబంధించి రివ్యూలు నిర్మాతలకు అవసరమవుతూనే ఉన్నాయి.
This post was last modified on September 5, 2025 9:10 am
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…