మలయాళ చిత్రం ‘లోక’ ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్లో పెద్ద సెన్సేషన్. ఈ లేడీ ఓరియెంటెడ్ సూపర్ హీరో సినిమాకు విడుదల ముంగిటే మలయాళంలో బంపర్ క్రేజ్ వచ్చింది. ఆ చిత్ర బృందం సైతం ఆ హైప్ చూసి షాకైంది. ఈ సినిమా గురించి మరీ ఎక్కువ ఊహించుకోవద్దని ప్రేక్షకుల్లో అంచనాలు తగ్గించడానికి ప్రయత్నించడం విశేషం. ఐతే సినిమాలో కంటెంట్ ఉండడంతో ఈ హైప్తో సినిమా అదిరిపోయే ఓపెనింగ్స్ సంపాదించింది.
తెలుగులో ‘కొత్త లోక’ పేరుతో రిలీజై ఇక్కడ కూడా మంచి ఫలితాన్నందుకుంది. తమిళనాడు, కర్ణాటకల్లో సైతం సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఐతే ఈ చిత్రం ఇప్పుడు ఒక ఊహించని వివాదంలో చిక్కుకుంది. ఇందులో ఒక సన్నివేశం బెంగళూరు వాసులను హర్ట్ చేసింది. కర్ణాటకలో ఆ సినిమాను నిషేధించాలని సోషల్ మీడియాలో డిమాండ్లు మొదలయ్యాయి.
‘లోక’లో ఒక సన్నివేశంలో విలన్ పాత్రధారి, డ్యాన్స్ మాస్టర్ శాండీ.. బెంగళూరు అమ్మాయిలకు క్యారెక్టర్ ఉండదని, అక్కడి అమ్మాయిలను పెళ్లి చేసుకోనని కామెంట్ చేస్తాడు. ఈ డైలాగ్ బెంగళూరు వాసులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో ‘లోక’ సినిమాను నిషేధించాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఐతే ఈ వివాదంపై ‘లోక’ టీం వెంటనే స్పందించింది. వివాదాస్పద డైలాగ్ను సినిమా నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో వివాదం సద్దుమణిగినట్లే.
కర్ణాటకలో తొలి రోజు నుంచి ‘లోక’ మలయాళ వెర్షన్ హౌస్ ఫుల్ వసూళ్లతో నడుస్తోంది. ఈ సినిమా అప్పుడే వంద కోట్ల వసూళ్లకు చేరువగా వచ్చేసింది. సౌత్ ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘మహానటి’ పేరిట ఉన్న రికార్డును ‘లోక’ బద్దలు కొట్టేసింది. ఈ సినిమా ఊపు చూస్తుంటే ఫుల్ రన్లో రూ.150 కోట్ల మైలురాయిని కూడా అలవోకగా దాటేసేలా కనిపిస్తోంది.
This post was last modified on September 3, 2025 4:12 pm
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…