మలయాళ చిత్రం ‘లోక’ ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్లో పెద్ద సెన్సేషన్. ఈ లేడీ ఓరియెంటెడ్ సూపర్ హీరో సినిమాకు విడుదల ముంగిటే మలయాళంలో బంపర్ క్రేజ్ వచ్చింది. ఆ చిత్ర బృందం సైతం ఆ హైప్ చూసి షాకైంది. ఈ సినిమా గురించి మరీ ఎక్కువ ఊహించుకోవద్దని ప్రేక్షకుల్లో అంచనాలు తగ్గించడానికి ప్రయత్నించడం విశేషం. ఐతే సినిమాలో కంటెంట్ ఉండడంతో ఈ హైప్తో సినిమా అదిరిపోయే ఓపెనింగ్స్ సంపాదించింది.
తెలుగులో ‘కొత్త లోక’ పేరుతో రిలీజై ఇక్కడ కూడా మంచి ఫలితాన్నందుకుంది. తమిళనాడు, కర్ణాటకల్లో సైతం సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఐతే ఈ చిత్రం ఇప్పుడు ఒక ఊహించని వివాదంలో చిక్కుకుంది. ఇందులో ఒక సన్నివేశం బెంగళూరు వాసులను హర్ట్ చేసింది. కర్ణాటకలో ఆ సినిమాను నిషేధించాలని సోషల్ మీడియాలో డిమాండ్లు మొదలయ్యాయి.
‘లోక’లో ఒక సన్నివేశంలో విలన్ పాత్రధారి, డ్యాన్స్ మాస్టర్ శాండీ.. బెంగళూరు అమ్మాయిలకు క్యారెక్టర్ ఉండదని, అక్కడి అమ్మాయిలను పెళ్లి చేసుకోనని కామెంట్ చేస్తాడు. ఈ డైలాగ్ బెంగళూరు వాసులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో ‘లోక’ సినిమాను నిషేధించాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఐతే ఈ వివాదంపై ‘లోక’ టీం వెంటనే స్పందించింది. వివాదాస్పద డైలాగ్ను సినిమా నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో వివాదం సద్దుమణిగినట్లే.
కర్ణాటకలో తొలి రోజు నుంచి ‘లోక’ మలయాళ వెర్షన్ హౌస్ ఫుల్ వసూళ్లతో నడుస్తోంది. ఈ సినిమా అప్పుడే వంద కోట్ల వసూళ్లకు చేరువగా వచ్చేసింది. సౌత్ ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘మహానటి’ పేరిట ఉన్న రికార్డును ‘లోక’ బద్దలు కొట్టేసింది. ఈ సినిమా ఊపు చూస్తుంటే ఫుల్ రన్లో రూ.150 కోట్ల మైలురాయిని కూడా అలవోకగా దాటేసేలా కనిపిస్తోంది.
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ 'మై వాపస్ ఆవుంగా'కు తొలి రోజు రివ్యూలు ఏమంత ఆశాజనకంగా లేవు. పబ్లిక్ టాక్…
సాయిధరమ్ తేజ్ హీరోగా రెండేళ్ల ముందు మొదలైన సినిమా.. సంబరాల యేటిగట్టు. తన మార్కెట్ స్థాయికి మించి పెద్ద బడ్జెట్లో…
పెద్ది మొదటి రెండు వారాలు బాగా సందడి చేసి కలెక్షన్ల వర్షం కురిపించాక మళ్ళీ దాన్ని కొనసాగించే సినిమా ఏది…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’యే చివరి చిత్రం అవుతుందనే అంచనాలు కలిగాయి ఒక దశలో.…
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…