మలయాళ చిత్రం ‘లోక’ ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్లో పెద్ద సెన్సేషన్. ఈ లేడీ ఓరియెంటెడ్ సూపర్ హీరో సినిమాకు విడుదల ముంగిటే మలయాళంలో బంపర్ క్రేజ్ వచ్చింది. ఆ చిత్ర బృందం సైతం ఆ హైప్ చూసి షాకైంది. ఈ సినిమా గురించి మరీ ఎక్కువ ఊహించుకోవద్దని ప్రేక్షకుల్లో అంచనాలు తగ్గించడానికి ప్రయత్నించడం విశేషం. ఐతే సినిమాలో కంటెంట్ ఉండడంతో ఈ హైప్తో సినిమా అదిరిపోయే ఓపెనింగ్స్ సంపాదించింది.
తెలుగులో ‘కొత్త లోక’ పేరుతో రిలీజై ఇక్కడ కూడా మంచి ఫలితాన్నందుకుంది. తమిళనాడు, కర్ణాటకల్లో సైతం సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఐతే ఈ చిత్రం ఇప్పుడు ఒక ఊహించని వివాదంలో చిక్కుకుంది. ఇందులో ఒక సన్నివేశం బెంగళూరు వాసులను హర్ట్ చేసింది. కర్ణాటకలో ఆ సినిమాను నిషేధించాలని సోషల్ మీడియాలో డిమాండ్లు మొదలయ్యాయి.
‘లోక’లో ఒక సన్నివేశంలో విలన్ పాత్రధారి, డ్యాన్స్ మాస్టర్ శాండీ.. బెంగళూరు అమ్మాయిలకు క్యారెక్టర్ ఉండదని, అక్కడి అమ్మాయిలను పెళ్లి చేసుకోనని కామెంట్ చేస్తాడు. ఈ డైలాగ్ బెంగళూరు వాసులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో ‘లోక’ సినిమాను నిషేధించాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఐతే ఈ వివాదంపై ‘లోక’ టీం వెంటనే స్పందించింది. వివాదాస్పద డైలాగ్ను సినిమా నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో వివాదం సద్దుమణిగినట్లే.
కర్ణాటకలో తొలి రోజు నుంచి ‘లోక’ మలయాళ వెర్షన్ హౌస్ ఫుల్ వసూళ్లతో నడుస్తోంది. ఈ సినిమా అప్పుడే వంద కోట్ల వసూళ్లకు చేరువగా వచ్చేసింది. సౌత్ ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘మహానటి’ పేరిట ఉన్న రికార్డును ‘లోక’ బద్దలు కొట్టేసింది. ఈ సినిమా ఊపు చూస్తుంటే ఫుల్ రన్లో రూ.150 కోట్ల మైలురాయిని కూడా అలవోకగా దాటేసేలా కనిపిస్తోంది.
This post was last modified on September 3, 2025 4:12 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…