మలయాళ చిత్రం ‘లోక’ ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్లో పెద్ద సెన్సేషన్. ఈ లేడీ ఓరియెంటెడ్ సూపర్ హీరో సినిమాకు విడుదల ముంగిటే మలయాళంలో బంపర్ క్రేజ్ వచ్చింది. ఆ చిత్ర బృందం సైతం ఆ హైప్ చూసి షాకైంది. ఈ సినిమా గురించి మరీ ఎక్కువ ఊహించుకోవద్దని ప్రేక్షకుల్లో అంచనాలు తగ్గించడానికి ప్రయత్నించడం విశేషం. ఐతే సినిమాలో కంటెంట్ ఉండడంతో ఈ హైప్తో సినిమా అదిరిపోయే ఓపెనింగ్స్ సంపాదించింది.
తెలుగులో ‘కొత్త లోక’ పేరుతో రిలీజై ఇక్కడ కూడా మంచి ఫలితాన్నందుకుంది. తమిళనాడు, కర్ణాటకల్లో సైతం సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఐతే ఈ చిత్రం ఇప్పుడు ఒక ఊహించని వివాదంలో చిక్కుకుంది. ఇందులో ఒక సన్నివేశం బెంగళూరు వాసులను హర్ట్ చేసింది. కర్ణాటకలో ఆ సినిమాను నిషేధించాలని సోషల్ మీడియాలో డిమాండ్లు మొదలయ్యాయి.
‘లోక’లో ఒక సన్నివేశంలో విలన్ పాత్రధారి, డ్యాన్స్ మాస్టర్ శాండీ.. బెంగళూరు అమ్మాయిలకు క్యారెక్టర్ ఉండదని, అక్కడి అమ్మాయిలను పెళ్లి చేసుకోనని కామెంట్ చేస్తాడు. ఈ డైలాగ్ బెంగళూరు వాసులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో ‘లోక’ సినిమాను నిషేధించాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఐతే ఈ వివాదంపై ‘లోక’ టీం వెంటనే స్పందించింది. వివాదాస్పద డైలాగ్ను సినిమా నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో వివాదం సద్దుమణిగినట్లే.
కర్ణాటకలో తొలి రోజు నుంచి ‘లోక’ మలయాళ వెర్షన్ హౌస్ ఫుల్ వసూళ్లతో నడుస్తోంది. ఈ సినిమా అప్పుడే వంద కోట్ల వసూళ్లకు చేరువగా వచ్చేసింది. సౌత్ ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘మహానటి’ పేరిట ఉన్న రికార్డును ‘లోక’ బద్దలు కొట్టేసింది. ఈ సినిమా ఊపు చూస్తుంటే ఫుల్ రన్లో రూ.150 కోట్ల మైలురాయిని కూడా అలవోకగా దాటేసేలా కనిపిస్తోంది.
This post was last modified on September 3, 2025 4:12 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…