అన్నీ అనుకున్నట్టు టైంకి జరిగి ఉంటే ఓజి, అఖండ 2 రెండూ ఒకే రోజు సెప్టెంబర్ 25 విడుదలయ్యేవి. కానీ సాంకేతిక కారణాల వల్ల బాలయ్య టీమ్ వెనుకడుగు వేయడంతో పవన్ కళ్యాణ్ కు సోలో గ్రౌండ్ దొరికింది. అయితే తప్పుకోవడం వెనుక తమన్ కూడా ఉన్నాడనేది ఫిలిం నగర్ టాక్. దాని ప్రకారం తమన్ కు ఈ రెండు సినిమాలు చాలా ప్రతిష్టాత్మకం. ముందుగా ఓజి సంగతి చూస్తే ఇప్పటికే పలు వాయిదాలతో ఆలస్యమైన ఈ మూవీకి ఓటిటి వైపు నుంచి థియేట్రికల్ రిలీజ్ ఒత్తిడి ఉండటంతో ఖచ్చితంగా డెడ్ లైన్ మీటవ్వాల్సిన స్థితి ఏర్పడింది. దీంతో వీరమల్లుకు దీనికి కేవలం రెండు నెలల గ్యాప్ ఉన్నా దానికి సిద్ధపడ్డారు.
ఇక అఖండకు నిన్న వారం దాకా ఓటిటి డీల్ జరగలేదు. ఇటీవలే ఒప్పందం కుదిరిందని సమాచారం. ఆశించిన భారీ రేట్ రావడంతో నిర్మాత సంతోషం వ్యక్తం చేసినట్టు సమాచారం. అయితే డిసెంబర్ లో రిలీజ్ చేయాలా లేక సంక్రాంతికి వెళ్లాలా అనే దాని మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు. విశ్వసనీయ వర్గాలు మాత్రం కాంపిటీషన్ ఎక్కువగా ఉన్న పండగ కన్నా రాజా సాబ్ వదులుకున్న డిసెంబర్ 5 వైపే టీమ్ మొగ్గు చూపుతోందట. ఇక తమన్ విషయానికి వస్తే అఖండ 2కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఒత్తిడి మీద చేయలేనని, అకుంఠిత దీక్షతో ఒక యజ్ఞంలా కంపోజ్ చేయాలని వ్యక్తిగతంగా బాలయ్యకు చెప్పాడట.
విన్నపం సబబుగా అనిపించడంతో పాటు ఓజితో తలపడటం వల్ల తనతో పాటు ఇద్దరి ఓపెనింగ్స్ ప్రభావితం చెందుతాయి కాబట్టి ప్రొడ్యూసర్లతో మాట్లాడి పోస్ట్ పోన్ కి ఎస్ చెప్పినట్టు వినికిడి. ఒకరకంగా జరిగిందంతా మంచికే అనుకోవాలి. తగినంత సమయం దొరకడంతో దర్శకుడు బోయపాటి శీను కొంచెం రిలాక్స్ అవుతూ విఎఫ్ఎక్స్ మీద మరింత దృష్టి పెట్టబోతున్నాడు. పాటలను దసరా నుంచి ఒక్కొక్కటిగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. బాలయ్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న అఖండ 2 నూటా యాభై కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ తో బరిలో దిగుతుందని టాక్.
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు గుప్పించారు.…
మార్క్ ఆంటోనీ, గత ఏడాది అజిత్ తో వచ్చిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలతో తమిళ దర్శకుడు అధిక్ రవిచంద్రన్…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యవహార తీరుపై ఇప్పటికే లెక్కలేనన్ని చర్చలు జరిగాయి. అటు సినిమాలు,…
ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని ఒక సామెత. కొందరు మాత్రం రచ్చ గెలిచి, తర్వాత ఇంటికి వస్తుంటారు. శోభిత…
పెద్ది ఇప్పుడు రామ్ చరణ్ కెరీర్లో మరో చాలెంజ్ లాంటి ప్రాజెక్టు. RRR తర్వాత వచ్చిన గ్లోబల్ ఇమేజ్ని నిలబెట్టుకోవాలి.…
ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా సినిమా అయినా దాన్ని జనంలోకి తీసుకెళ్లాలంటే ప్రచారం తప్పనిసరి. కంటెంట్ ఉంటే చాలు ఇంకేం…