అన్నీ అనుకున్నట్టు టైంకి జరిగి ఉంటే ఓజి, అఖండ 2 రెండూ ఒకే రోజు సెప్టెంబర్ 25 విడుదలయ్యేవి. కానీ సాంకేతిక కారణాల వల్ల బాలయ్య టీమ్ వెనుకడుగు వేయడంతో పవన్ కళ్యాణ్ కు సోలో గ్రౌండ్ దొరికింది. అయితే తప్పుకోవడం వెనుక తమన్ కూడా ఉన్నాడనేది ఫిలిం నగర్ టాక్. దాని ప్రకారం తమన్ కు ఈ రెండు సినిమాలు చాలా ప్రతిష్టాత్మకం. ముందుగా ఓజి సంగతి చూస్తే ఇప్పటికే పలు వాయిదాలతో ఆలస్యమైన ఈ మూవీకి ఓటిటి వైపు నుంచి థియేట్రికల్ రిలీజ్ ఒత్తిడి ఉండటంతో ఖచ్చితంగా డెడ్ లైన్ మీటవ్వాల్సిన స్థితి ఏర్పడింది. దీంతో వీరమల్లుకు దీనికి కేవలం రెండు నెలల గ్యాప్ ఉన్నా దానికి సిద్ధపడ్డారు.
ఇక అఖండకు నిన్న వారం దాకా ఓటిటి డీల్ జరగలేదు. ఇటీవలే ఒప్పందం కుదిరిందని సమాచారం. ఆశించిన భారీ రేట్ రావడంతో నిర్మాత సంతోషం వ్యక్తం చేసినట్టు సమాచారం. అయితే డిసెంబర్ లో రిలీజ్ చేయాలా లేక సంక్రాంతికి వెళ్లాలా అనే దాని మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు. విశ్వసనీయ వర్గాలు మాత్రం కాంపిటీషన్ ఎక్కువగా ఉన్న పండగ కన్నా రాజా సాబ్ వదులుకున్న డిసెంబర్ 5 వైపే టీమ్ మొగ్గు చూపుతోందట. ఇక తమన్ విషయానికి వస్తే అఖండ 2కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఒత్తిడి మీద చేయలేనని, అకుంఠిత దీక్షతో ఒక యజ్ఞంలా కంపోజ్ చేయాలని వ్యక్తిగతంగా బాలయ్యకు చెప్పాడట.
విన్నపం సబబుగా అనిపించడంతో పాటు ఓజితో తలపడటం వల్ల తనతో పాటు ఇద్దరి ఓపెనింగ్స్ ప్రభావితం చెందుతాయి కాబట్టి ప్రొడ్యూసర్లతో మాట్లాడి పోస్ట్ పోన్ కి ఎస్ చెప్పినట్టు వినికిడి. ఒకరకంగా జరిగిందంతా మంచికే అనుకోవాలి. తగినంత సమయం దొరకడంతో దర్శకుడు బోయపాటి శీను కొంచెం రిలాక్స్ అవుతూ విఎఫ్ఎక్స్ మీద మరింత దృష్టి పెట్టబోతున్నాడు. పాటలను దసరా నుంచి ఒక్కొక్కటిగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. బాలయ్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న అఖండ 2 నూటా యాభై కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ తో బరిలో దిగుతుందని టాక్.
This post was last modified on September 2, 2025 9:48 pm
కొన్నేళ్ల నుంచి భారత్, పాకిస్థాన్ సంబంధాలు అంతంతమాత్రంగా ఉండగా.. ఈ ఏడాది ఆరంభంలో పహల్గాం ఉగ్రదాడి తర్వాత అవి పూర్తిగా…
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…