అన్నీ అనుకున్నట్టు టైంకి జరిగి ఉంటే ఓజి, అఖండ 2 రెండూ ఒకే రోజు సెప్టెంబర్ 25 విడుదలయ్యేవి. కానీ సాంకేతిక కారణాల వల్ల బాలయ్య టీమ్ వెనుకడుగు వేయడంతో పవన్ కళ్యాణ్ కు సోలో గ్రౌండ్ దొరికింది. అయితే తప్పుకోవడం వెనుక తమన్ కూడా ఉన్నాడనేది ఫిలిం నగర్ టాక్. దాని ప్రకారం తమన్ కు ఈ రెండు సినిమాలు చాలా ప్రతిష్టాత్మకం. ముందుగా ఓజి సంగతి చూస్తే ఇప్పటికే పలు వాయిదాలతో ఆలస్యమైన ఈ మూవీకి ఓటిటి వైపు నుంచి థియేట్రికల్ రిలీజ్ ఒత్తిడి ఉండటంతో ఖచ్చితంగా డెడ్ లైన్ మీటవ్వాల్సిన స్థితి ఏర్పడింది. దీంతో వీరమల్లుకు దీనికి కేవలం రెండు నెలల గ్యాప్ ఉన్నా దానికి సిద్ధపడ్డారు.
ఇక అఖండకు నిన్న వారం దాకా ఓటిటి డీల్ జరగలేదు. ఇటీవలే ఒప్పందం కుదిరిందని సమాచారం. ఆశించిన భారీ రేట్ రావడంతో నిర్మాత సంతోషం వ్యక్తం చేసినట్టు సమాచారం. అయితే డిసెంబర్ లో రిలీజ్ చేయాలా లేక సంక్రాంతికి వెళ్లాలా అనే దాని మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు. విశ్వసనీయ వర్గాలు మాత్రం కాంపిటీషన్ ఎక్కువగా ఉన్న పండగ కన్నా రాజా సాబ్ వదులుకున్న డిసెంబర్ 5 వైపే టీమ్ మొగ్గు చూపుతోందట. ఇక తమన్ విషయానికి వస్తే అఖండ 2కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఒత్తిడి మీద చేయలేనని, అకుంఠిత దీక్షతో ఒక యజ్ఞంలా కంపోజ్ చేయాలని వ్యక్తిగతంగా బాలయ్యకు చెప్పాడట.
విన్నపం సబబుగా అనిపించడంతో పాటు ఓజితో తలపడటం వల్ల తనతో పాటు ఇద్దరి ఓపెనింగ్స్ ప్రభావితం చెందుతాయి కాబట్టి ప్రొడ్యూసర్లతో మాట్లాడి పోస్ట్ పోన్ కి ఎస్ చెప్పినట్టు వినికిడి. ఒకరకంగా జరిగిందంతా మంచికే అనుకోవాలి. తగినంత సమయం దొరకడంతో దర్శకుడు బోయపాటి శీను కొంచెం రిలాక్స్ అవుతూ విఎఫ్ఎక్స్ మీద మరింత దృష్టి పెట్టబోతున్నాడు. పాటలను దసరా నుంచి ఒక్కొక్కటిగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. బాలయ్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న అఖండ 2 నూటా యాభై కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ తో బరిలో దిగుతుందని టాక్.
This post was last modified on September 2, 2025 9:48 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…