జాన్వి కపూర్ కెరీర్ ఆరంభించింది బాలీవుడ్లో. ఆమె తండ్రి నార్త్ ఇండియన్. కానీ ఆమెను సౌత్ అమ్మాయిలాగే చూస్తారు మనవాళ్లు. అందుక్కారణం తన తల్లి శ్రీదేవి పక్కా సౌత్ ఇండియన్ అమ్మాయి కావడమే. తన వ్యక్తిగత విషయాలు, పెళ్లి, వైవాహిక జీవితం గురించి ఎఫ్పుడు అడిగినా.. తనలోని సౌత్ ఇండియన్ మూలాలు బయటికి వచ్చేస్తాయి. తాజాగా తన కొత్త చిత్రం ‘పరమ్ సుందరి’ని ప్రమోట్ చేయడం కోసం కపిల్ శర్మ షోకు వెళ్లిన జాన్వి.. తన పెళ్లి, పిల్లల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
అందులో అన్నింటికంటే హైలైట్.. పిల్లల గురించి చేసిన కామెంటే. జాన్వికి ముగ్గురు పిల్లలు కావాలట. చాలామంది హీరోయిన్లు పిల్లల్ని కనడానికే ఇష్టపడరు. అలాంటిది ఏకంగా ముగ్గురు పిల్లల్ని కనడం ఏంటి అని అడిగితే.. మూడు తన లక్కీ నంబర్ అంటూ అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది జాన్వి. ముగ్గురు పిల్లల్ని కనడానికి మరో కారణం చెబుతూ.. ఇద్దరు ఉంటే గొడవలు జరుగుతాయని.. అందుకే ముగ్గురు కావాలని.. అప్పుడే ఇంట్లో సందడి ఉంటుందని ఆమె చెప్పింది.
గతంలో ఒక ఇంటర్వ్యూలో జాన్వి మాట్లాడుతూ.. తనకు తన తల్లి స్వస్థలమైన చెన్నైలో, ఆమె పూర్వీకుల ఇంట్లో పెళ్లి చేసుకోవాలన్నది కోరిక అని వెల్లడించింది. అక్కడ పెళ్లి తంతులన్నీ పూర్తి అయ్యాక తిరుమలలో వివాహం చేసుకోవాలని ఆమె చెప్పింది. అంతేకాక తిరుపతిలోనే సెటిల్ కావాలని ఉందని.. పంచెలో ఉన్న తన భర్తతో కలిసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం.. అరటి ఆకుల్లో భోజనం చేస్తూ ‘గోవిందా గోవిందా’ అని నామస్మరణ చేయడం.. ఇంతకంటే తనకు వేరే జీవితం అక్కర్లేదని ఆమె చెప్పింది.
This post was last modified on September 1, 2025 4:30 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…