Movie News

ముగ్గురు పిల్లలు కావాలంటున్న జాన్వి, ఎందుకంటే…

జాన్వి కపూర్ కెరీర్ ఆరంభించింది బాలీవుడ్లో. ఆమె తండ్రి నార్త్ ఇండియన్. కానీ ఆమెను సౌత్ అమ్మాయిలాగే చూస్తారు మనవాళ్లు. అందుక్కారణం తన తల్లి శ్రీదేవి పక్కా సౌత్ ఇండియన్ అమ్మాయి కావడమే. తన వ్యక్తిగత విషయాలు, పెళ్లి, వైవాహిక జీవితం గురించి ఎఫ్పుడు అడిగినా.. తనలోని సౌత్ ఇండియన్ మూలాలు బయటికి వచ్చేస్తాయి. తాజాగా తన కొత్త చిత్రం ‘పరమ్ సుందరి’ని ప్రమోట్ చేయడం కోసం కపిల్ శర్మ షోకు వెళ్లిన జాన్వి.. తన పెళ్లి, పిల్లల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

అందులో అన్నింటికంటే హైలైట్.. పిల్లల గురించి చేసిన కామెంటే. జాన్వికి ముగ్గురు పిల్లలు కావాలట. చాలామంది హీరోయిన్లు పిల్లల్ని కనడానికే ఇష్టపడరు. అలాంటిది ఏకంగా ముగ్గురు పిల్లల్ని కనడం ఏంటి అని అడిగితే.. మూడు తన లక్కీ నంబర్ అంటూ అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది జాన్వి. ముగ్గురు పిల్లల్ని కనడానికి మరో కారణం చెబుతూ.. ఇద్దరు ఉంటే గొడవలు జరుగుతాయని.. అందుకే ముగ్గురు కావాలని.. అప్పుడే ఇంట్లో సందడి ఉంటుందని ఆమె చెప్పింది.

గతంలో ఒక ఇంటర్వ్యూలో జాన్వి మాట్లాడుతూ.. తనకు తన తల్లి స్వస్థలమైన చెన్నైలో, ఆమె పూర్వీకుల ఇంట్లో పెళ్లి చేసుకోవాలన్నది కోరిక అని వెల్లడించింది. అక్కడ పెళ్లి తంతులన్నీ పూర్తి అయ్యాక తిరుమలలో వివాహం చేసుకోవాలని ఆమె చెప్పింది. అంతేకాక తిరుపతిలోనే సెటిల్ కావాలని ఉందని.. పంచెలో ఉన్న తన భర్తతో కలిసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం.. అరటి ఆకుల్లో భోజనం చేస్తూ ‘గోవిందా గోవిందా’ అని నామస్మరణ చేయడం.. ఇంతకంటే తనకు వేరే జీవితం అక్కర్లేదని ఆమె చెప్పింది.

This post was last modified on September 1, 2025 4:30 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

1 hour ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

2 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

3 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

4 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

4 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

6 hours ago