జాన్వి కపూర్ కెరీర్ ఆరంభించింది బాలీవుడ్లో. ఆమె తండ్రి నార్త్ ఇండియన్. కానీ ఆమెను సౌత్ అమ్మాయిలాగే చూస్తారు మనవాళ్లు. అందుక్కారణం తన తల్లి శ్రీదేవి పక్కా సౌత్ ఇండియన్ అమ్మాయి కావడమే. తన వ్యక్తిగత విషయాలు, పెళ్లి, వైవాహిక జీవితం గురించి ఎఫ్పుడు అడిగినా.. తనలోని సౌత్ ఇండియన్ మూలాలు బయటికి వచ్చేస్తాయి. తాజాగా తన కొత్త చిత్రం ‘పరమ్ సుందరి’ని ప్రమోట్ చేయడం కోసం కపిల్ శర్మ షోకు వెళ్లిన జాన్వి.. తన పెళ్లి, పిల్లల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
అందులో అన్నింటికంటే హైలైట్.. పిల్లల గురించి చేసిన కామెంటే. జాన్వికి ముగ్గురు పిల్లలు కావాలట. చాలామంది హీరోయిన్లు పిల్లల్ని కనడానికే ఇష్టపడరు. అలాంటిది ఏకంగా ముగ్గురు పిల్లల్ని కనడం ఏంటి అని అడిగితే.. మూడు తన లక్కీ నంబర్ అంటూ అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది జాన్వి. ముగ్గురు పిల్లల్ని కనడానికి మరో కారణం చెబుతూ.. ఇద్దరు ఉంటే గొడవలు జరుగుతాయని.. అందుకే ముగ్గురు కావాలని.. అప్పుడే ఇంట్లో సందడి ఉంటుందని ఆమె చెప్పింది.
గతంలో ఒక ఇంటర్వ్యూలో జాన్వి మాట్లాడుతూ.. తనకు తన తల్లి స్వస్థలమైన చెన్నైలో, ఆమె పూర్వీకుల ఇంట్లో పెళ్లి చేసుకోవాలన్నది కోరిక అని వెల్లడించింది. అక్కడ పెళ్లి తంతులన్నీ పూర్తి అయ్యాక తిరుమలలో వివాహం చేసుకోవాలని ఆమె చెప్పింది. అంతేకాక తిరుపతిలోనే సెటిల్ కావాలని ఉందని.. పంచెలో ఉన్న తన భర్తతో కలిసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం.. అరటి ఆకుల్లో భోజనం చేస్తూ ‘గోవిందా గోవిందా’ అని నామస్మరణ చేయడం.. ఇంతకంటే తనకు వేరే జీవితం అక్కర్లేదని ఆమె చెప్పింది.
This post was last modified on September 1, 2025 4:30 pm
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…