Movie News

ముగ్గురు పిల్లలు కావాలంటున్న జాన్వి, ఎందుకంటే…

జాన్వి కపూర్ కెరీర్ ఆరంభించింది బాలీవుడ్లో. ఆమె తండ్రి నార్త్ ఇండియన్. కానీ ఆమెను సౌత్ అమ్మాయిలాగే చూస్తారు మనవాళ్లు. అందుక్కారణం తన తల్లి శ్రీదేవి పక్కా సౌత్ ఇండియన్ అమ్మాయి కావడమే. తన వ్యక్తిగత విషయాలు, పెళ్లి, వైవాహిక జీవితం గురించి ఎఫ్పుడు అడిగినా.. తనలోని సౌత్ ఇండియన్ మూలాలు బయటికి వచ్చేస్తాయి. తాజాగా తన కొత్త చిత్రం ‘పరమ్ సుందరి’ని ప్రమోట్ చేయడం కోసం కపిల్ శర్మ షోకు వెళ్లిన జాన్వి.. తన పెళ్లి, పిల్లల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

అందులో అన్నింటికంటే హైలైట్.. పిల్లల గురించి చేసిన కామెంటే. జాన్వికి ముగ్గురు పిల్లలు కావాలట. చాలామంది హీరోయిన్లు పిల్లల్ని కనడానికే ఇష్టపడరు. అలాంటిది ఏకంగా ముగ్గురు పిల్లల్ని కనడం ఏంటి అని అడిగితే.. మూడు తన లక్కీ నంబర్ అంటూ అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది జాన్వి. ముగ్గురు పిల్లల్ని కనడానికి మరో కారణం చెబుతూ.. ఇద్దరు ఉంటే గొడవలు జరుగుతాయని.. అందుకే ముగ్గురు కావాలని.. అప్పుడే ఇంట్లో సందడి ఉంటుందని ఆమె చెప్పింది.

గతంలో ఒక ఇంటర్వ్యూలో జాన్వి మాట్లాడుతూ.. తనకు తన తల్లి స్వస్థలమైన చెన్నైలో, ఆమె పూర్వీకుల ఇంట్లో పెళ్లి చేసుకోవాలన్నది కోరిక అని వెల్లడించింది. అక్కడ పెళ్లి తంతులన్నీ పూర్తి అయ్యాక తిరుమలలో వివాహం చేసుకోవాలని ఆమె చెప్పింది. అంతేకాక తిరుపతిలోనే సెటిల్ కావాలని ఉందని.. పంచెలో ఉన్న తన భర్తతో కలిసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం.. అరటి ఆకుల్లో భోజనం చేస్తూ ‘గోవిందా గోవిందా’ అని నామస్మరణ చేయడం.. ఇంతకంటే తనకు వేరే జీవితం అక్కర్లేదని ఆమె చెప్పింది.

This post was last modified on September 1, 2025 4:30 pm

Share

Recent Posts

నిజం గెలిచింది… నాటి చీకటి రోజులను గుర్తుచేసుకున్న లోకేష్‌

టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులో అరెస్టు చేసి నిర్బంధించిన నాటి పరిణామాలను మంత్రి నారా…

45 minutes ago

చైతు & దుల్కర్ – లక్కీ ఛాన్స్ కొట్టేశారా?

పెద్ద బడ్జెట్లు ముడిపడిన సినిమాలకు రిలీజ్ డేట్లు లాక్ చేసుకోవడం పెద్ద సవాల్ గా మారిపోయింది. ముందు వెనుక పోటీ…

48 minutes ago

చాట్‌ GPT ఆస్ట్రా 6… భయపడుతున్న యువత

AI వల్ల ఉద్యోగాలు పోతాయనే భయం ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఓపెన్‌ఏఐ తీసుకొచ్చిన GPT-6 ఆస్ట్రా ఆ భయాన్ని మరో…

2 hours ago

ఒరాంగుటాన్లు… దేశాలు దాటి ఇక్కడికెలా వచ్చాయో..?

ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లాలో అటవీ ప్రాంత ఐదు పిల్ల ఒరాంగుటాన్లు కనిపించడం కలకలం రేపింది. బడపై గ్రామం సమీపంలోని రణకథ…

3 hours ago

ఫౌజీ తప్పుకుంటే… స్పిరిట్ ఏం చేస్తుంది

భయపడినట్టే జరిగేలా ఉంది. డిసెంబర్ 3 అధికారికంగా ప్రకటించిన విడుదల తేదీని ఫౌజీ వదులుకునేలా ఉంది. ఇంకా షూటింగ్ జరుగుతూ…

3 hours ago

AIతో ఈ దశాబ్దంలోనే మానవాళికి ముప్పు?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం గత కొన్నేళ్లలో ఊహించని స్థాయిలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజువారీ…

3 hours ago