Movie News

కనిపించను కానీ వినిపిస్తా అంటున్న అనుష్క

అదేంటో అనుష్క బయటకి మాత్రం రానంటోంది. నిర్మాతేమో ముందే చేసుకున్న అగ్రిమెంట్ అంటారు. దర్శకుడేమో స్వీటీ కటవుట్ చాలు తను రానవసరం లేదంటారు. అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో నేరుగా హీరో హీరోయిన్లు జనాలను కలుసుకుంటేనే ఓపెనింగ్స్ రావడం కష్టమైపోయింది. అలాంటిది టైటిల్ రోల్ పోషించి తన మీదే బిజినెస్ జరుపుకున్న ప్యాన్ ఇండియా మూవీకి అనుష్క దూరంగా ఉండటం విచిత్రమే. గతంలో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి టైంలోనూ ఇదే కట్టుబాటు పాటించినప్పటికీ నవీన్ భారం తీసుకున్నాడు కాబట్టి ఇబ్బంది కలగలేదు. కానీ ఘాటీకి ఆ అవకాశం లేదు.

దీంతో అనుష్క కనిపించను కానీ వినిపిస్తాను అంటోంది. దగ్గుబాటి రానాతో టెలిఫోన్ ఇంటర్వ్యూ ఇచ్చింది. మిర్చి ప్లస్ ఎఫ్ఎం ద్వారా హీరో విక్రమ్ ప్రభుతో కలిసి ఆడియో కాన్వర్ జేషన్ చేయబోతోంది. మీడియా ప్రతినిధులకు కూడా ఇదే తరహాలో శ్రవణ సంభాషణలు చేయబోతున్నట్టు సమాచారం. ఇది ఎంత వరకు ఉపయోగపడుతుందో చెప్పలేం. ఎందుకంటే అభిమానులకు నేరుగా అనుష్కని చూస్తే వచ్చే కిక్కు కేవలం వింటే రాదు. నవ్వినా, ఎమోషనల్ అయినా అవన్నీ విజువల్ చూస్తేనే ఫీలవ్వగలం కానీ వింటే కాదు. అందులోనూ హైదరాబాద్ లాంటి నగరాల్లో తప్ప ఎంఎఫ్ చానెల్స్ బిసి కేంద్రాల్లో పాపులర్ కాదు.

సెప్టెంబర్ 5 ఇంకో నాలుగు రోజులే ఉంది కాబట్టి ఘాటీకి ఈ టైం కీలకం కానుంది. లిటిల్ హార్ట్స్, మదరాసి కాంపిటీషన్ ఉన్నప్పటికీ బడ్జెట్, కాన్వాస్ పరంగా అనుష్కదే పెద్ద చేయి కాబట్టి ఓపెనింగ్స్ వరకు నిర్మాతలు ధీమాగా ఉన్నారు. కంటెంట్ కనక మెప్పిస్తే జనాలు థియేటర్లకు వస్తారు. వార్ 2, కూలీ తర్వాత బాక్సాఫీస్ కు గ్యాప్ వచ్చేసింది సరైన సినిమాలు లేక థియేటర్లు ఫీడింగ్ కోసం ఎదురు చూస్తున్నాయి. కొత్త లోక కాస్త తెరిపినిచ్చింది. టాక్ బాగున్నా సుందరకాండకు ప్రయోజనం దక్కలేదు. ఈ నేపథ్యంలో ఘాటీకి పాజిటివ్ టాక్ రావడం చాలా కీలకం. వస్తే మాత్రం మిరాయ్ రిలీజ్ దాకా దున్నేయొచ్చు.

This post was last modified on September 1, 2025 8:06 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

53 minutes ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

1 hour ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

3 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

3 hours ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

4 hours ago

కూట‌మికి `బ్ర‌హ్మాస్త్రం` ఇచ్చేసిన‌ ప‌య్యావుల ..!

కూట‌మి నాయ‌కుల‌కు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ కీల‌క రాజ‌కీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానిక‌రం`` అంటూ..…

5 hours ago