అదేంటో అనుష్క బయటకి మాత్రం రానంటోంది. నిర్మాతేమో ముందే చేసుకున్న అగ్రిమెంట్ అంటారు. దర్శకుడేమో స్వీటీ కటవుట్ చాలు తను రానవసరం లేదంటారు. అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో నేరుగా హీరో హీరోయిన్లు జనాలను కలుసుకుంటేనే ఓపెనింగ్స్ రావడం కష్టమైపోయింది. అలాంటిది టైటిల్ రోల్ పోషించి తన మీదే బిజినెస్ జరుపుకున్న ప్యాన్ ఇండియా మూవీకి అనుష్క దూరంగా ఉండటం విచిత్రమే. గతంలో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి టైంలోనూ ఇదే కట్టుబాటు పాటించినప్పటికీ నవీన్ భారం తీసుకున్నాడు కాబట్టి ఇబ్బంది కలగలేదు. కానీ ఘాటీకి ఆ అవకాశం లేదు.
దీంతో అనుష్క కనిపించను కానీ వినిపిస్తాను అంటోంది. దగ్గుబాటి రానాతో టెలిఫోన్ ఇంటర్వ్యూ ఇచ్చింది. మిర్చి ప్లస్ ఎఫ్ఎం ద్వారా హీరో విక్రమ్ ప్రభుతో కలిసి ఆడియో కాన్వర్ జేషన్ చేయబోతోంది. మీడియా ప్రతినిధులకు కూడా ఇదే తరహాలో శ్రవణ సంభాషణలు చేయబోతున్నట్టు సమాచారం. ఇది ఎంత వరకు ఉపయోగపడుతుందో చెప్పలేం. ఎందుకంటే అభిమానులకు నేరుగా అనుష్కని చూస్తే వచ్చే కిక్కు కేవలం వింటే రాదు. నవ్వినా, ఎమోషనల్ అయినా అవన్నీ విజువల్ చూస్తేనే ఫీలవ్వగలం కానీ వింటే కాదు. అందులోనూ హైదరాబాద్ లాంటి నగరాల్లో తప్ప ఎంఎఫ్ చానెల్స్ బిసి కేంద్రాల్లో పాపులర్ కాదు.
సెప్టెంబర్ 5 ఇంకో నాలుగు రోజులే ఉంది కాబట్టి ఘాటీకి ఈ టైం కీలకం కానుంది. లిటిల్ హార్ట్స్, మదరాసి కాంపిటీషన్ ఉన్నప్పటికీ బడ్జెట్, కాన్వాస్ పరంగా అనుష్కదే పెద్ద చేయి కాబట్టి ఓపెనింగ్స్ వరకు నిర్మాతలు ధీమాగా ఉన్నారు. కంటెంట్ కనక మెప్పిస్తే జనాలు థియేటర్లకు వస్తారు. వార్ 2, కూలీ తర్వాత బాక్సాఫీస్ కు గ్యాప్ వచ్చేసింది సరైన సినిమాలు లేక థియేటర్లు ఫీడింగ్ కోసం ఎదురు చూస్తున్నాయి. కొత్త లోక కాస్త తెరిపినిచ్చింది. టాక్ బాగున్నా సుందరకాండకు ప్రయోజనం దక్కలేదు. ఈ నేపథ్యంలో ఘాటీకి పాజిటివ్ టాక్ రావడం చాలా కీలకం. వస్తే మాత్రం మిరాయ్ రిలీజ్ దాకా దున్నేయొచ్చు.
This post was last modified on September 1, 2025 8:06 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…