సప్తసాగరాలు దాటి సైడ్ ఏ, బిలు కమర్షియల్ గా తెలుగులో పెద్దగా ఆడకపోయినా హీరోయిన్ రుక్మిణి వసంత్ కు ఇక్కడ మంచి ఫాలోయింగ్ వచ్చింది. కాకపోతే తర్వాత చేసిన సినిమాలన్నీ టపా కట్టేయడంతో రేస్ లో కొంచెం వెనుకబడింది. ఒకటి రెండు కొంచెం బాగానే ఆడినా అవి హీరోల ఖాతాలోకి వెళ్లిపోవడంతో సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తోంది. శివ కార్తికేయన్ హీరోగా నటించిన మదరాసి సెప్టెంబర్ 5 విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రుక్మిణి వసంత్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కళ్ళు తిప్పుకునే కాస్ట్యూమ్ తో ప్రత్యేకంగా రావడం అభిమానులను ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ఎన్వి ప్రసాద్ మాట్లాడుతూ మదరాసి చేసే సమయానికి రుక్మిణి వసంత అప్ కమింగ్ హీరోయిన్ అని, కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ, యష్ టాక్సిక్, రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 ఇలా అన్నింటిలో తనే ఉంటూ మోస్ట్ వాంటెడ్ అయిపోయిందని కితాబిచ్చారు. ఆయన అన్నది నిజమే. ఫ్లాపులే ఎక్కువగా ఉన్నప్పటికీ అవకాశాలను రాబట్టుకోవడంలో రుక్మిణి వసంత్ వెనుకబడలేదు. ముఖ్యంగా తారక్ సరసన డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) చాలా పెద్ద బంపరాఫర్ అని చెప్పాలి. శాండల్ వుడ్ నుంచి వచ్చి క్రేజీ ఆఫర్ దక్కించుకోవడం మాటలు కాదు.
కాకపోతే ఇప్పుడు సక్సెస్ తనకు చాలా కీలకం. మదరాసి అసలే మన దగ్గర తక్కువ బజ్ తో విడుదలవుతోంది. దర్శకుడు మురుగదాస్ సక్సెస్ లో లేకపోవడం ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపించేలా ఉంది. అమరన్ బ్లాక్ బస్టర్ తర్వాత శివ కార్తికేయన్ చేసిన సినిమా కావడంతో ఆడియన్స్ లో ఆసక్తి లేకపోలేదు. మరి రుక్మిణి వసంత్ కు ఇందులో మొక్కుబడి హీరోయిన్ క్యారెక్టర్ దక్కిందా లేక నటనకు స్కోప్ ఉందానేది వేచి చూడాలి. మాములుగా మురుగదాస్ సినిమాల్లో కథానాయికకు ప్రాధాన్యం ఉంటుంది. ఒకవేళ రుక్మిణి వసంత్ కు అంత స్కోప్ దక్కి ఉంటే మంచిదే. శుక్రవారం తేలుతుందిగా. చూద్దాం.
This post was last modified on August 31, 2025 9:59 pm
గత కొన్నేళ్లలో మలయాళ దర్శకులు బాగా డెవలప్ అయ్యారు. క్రైమ్, హారర్, సస్పెన్స్ ఈ మూడు అంశాలను తీసుకుని వాటికి…
రేపు విడుదల కాబోతున్న కొత్త సినిమాల ప్రమోషన్ల ఘట్టం ముగిసిపోయింది. ఎవరికి వారు శాయశక్తులా తమ పబ్లిసిటీకి ఏమేం కావాలో…
అంశం ఏదైనా సరే.. కేంద్ర ప్రభుత్వం ఒకసారి డిసైడ్ అయితే.. తన అజెండాకు తగ్గట్లుగా పరిస్థితుల్ని మార్చేయటం కొత్తేం కాదు.…
పునర్విభజన చట్టంలో భాగంగా అసెంబ్లీ స్థానాల్ని గుండుగుత్తగా యాభై శాతం పెంచుతారన్న దానిపై ఎవరికి ఎలాంటి సందేహాల్లేవు. కాకుంటే.. లోక్…
వేసవి వచ్చిందంటే చాలు.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అంతా మామిడి పండ్ల కోసమే ఎదురుచూస్తారు. ఒకప్పుడు వేసవి సెలవుల్లో…
బీజేపీ, వైసీపీల మధ్య మైత్రి ఇంకెన్నటికీ చెక్కు చెదరదనే చెప్పాలి. ఎందుకంటే...బీజేపీ ఇప్పటిదాకా ప్రతిపాదించిన ప్రతి అంశానికి బేషరతుగా మద్దతు ప్రకటించిన వైసీపీ...తాజాగా నియోజకవర్గాల పునర్విభజనకు కూడా…