మలయాళంలో బిగ్గెస్ట్ హీరో ఎవరు అంటే మరో మాట లేకుండా మోహన్ లాల్ పేరు చెప్పేయొచ్చు. ఒకప్పుడు మమ్ముట్టి ఆయనకు గట్టి పోటీ ఇచ్చేవారు కానీ.. గత దశాబ్ద కాలంలో మాత్రం లాల్దే హవా. ఈ ఏడాది ‘ఎంపురాన్’, ‘తుడరుమ్’ చిత్రాలతో ఆయన రికార్డులు బద్దలు కొట్టారు. ఇప్పుడు ఆయన్నుంచి ఓనమ్ కానుకగా ‘హృదయపూర్వం’ అనే సినిమా చేశారు. ఈ ఫ్యామిలీ డ్రామాలో మాళవిక మోహనన్ కీలక పాత్ర పోషించింది.
ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. తొలి రోజు రూ.8 కోట్ల మేర వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ దగ్గర శుభారంభం చేసింది ‘హృదయపూర్వం’. కానీ రెండో రోజు ఈ చిత్రానికి పెద్ద షాక్ తగిలింది. ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ.. లాల్ సినిమాను వెనక్కి నెట్టేసింది. దాని కంటే ఐదు కోట్లు ఎక్కువగా వసూళ్లు రాబట్టి సంచలనం రేపింది. ఆ చిత్రమే.. లోకా.
మోహన్ లాల్ బెస్ట్ ఫ్రెండ్ అయిన దర్శకుడు ప్రియదర్శన్ తనయురాలైన కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ చేసిన సినిమా.. లోకా. ఈ సూపర్ హీరో ఫిలిం తెలుగులో ‘కొత్త లోకా’ పేరుతో రిలీజైంది. ఈ చిత్రం తమిళం, హిందీలోనూ విడుదలైంది. అన్ని చోట్లా పాజిటివ్ టాక్ వచ్చింది. మలయాళంలో అయితే తొలి రోజు నుంచే ప్యాక్డ్ హౌస్లతో నడుస్తోంది ఈ చిత్రం. తెలుగులో కూడా మంచి వసూళ్లు వస్తున్నాయి.
తొలి రోజు ఈ చిత్రం రూ.7 కోట్ల మేర వసూళ్లు రాబట్టి ‘హృదయపూర్వం’ తర్వాత రెండో స్థానంలో నిలిచింది. కానీ పాజిటివ్ టాక్ మరింత స్ప్రెడ్ అవడంతో రెండో రోజుకు సినిమా రేంజ్ పెరిగింది వసూళ్లు రూ.12 కోట్లను దాటిపోయాయి. మోహన్ లాల్ సినిమా పోటీలో ఉండగా.. దాన్ని మించి ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ 5 కోట్లు ఎక్కువగా వసూళ్లు రాబట్టడం అంటే చిన్న విషయం కాదు. కంటెంట్ ఈజ్ ద కింగ్ అనడానికి ఇది సరైన రుజువు. మలయాళంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాల రికార్డులన్నీ ‘లోకా’ బద్దలు కొట్టడం లాంఛనంగానే కనిపిస్తోంది.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…