నిర్మాత నాగవంశీకి కేవలం రెండు వారాల గ్యాప్ లో రెండు ఎదురు దెబ్బలు తగిలాయి. భారీ బడ్జెట్ తో నిర్మించిన కింగ్డమ్ అంచనాలు అందుకోకపోగా రిటర్న్స్ పరంగా నష్టాలే మిగిల్చింది. నాన్ థియేట్రికల్ రైట్స్ పుణ్యమాని మరీ తీవ్రంగా కాకపోవడం కొంత ఊరట కలిగించింది. అయితే వార్ 2 డిస్ట్రిబ్యూషన్ కొట్టిన దెబ్బ మాత్రం మాములుగా కాదు. జూనియర్ ఎన్టీఆర్ మీద అభిమానంతో ఎక్కువ రేట్ పెట్టేసి దాని డిజాస్టర్ ఫలితం వల్ల సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి సైతం గురి కావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా మలయాళం డబ్బింగ్ కొత్త లోక – చంద్ర పార్ట్ 1 పంపిణి చేసింది సితార సంస్థ.
నిజానికి దీని మీద తెలుగులో పెద్దగా అంచనాలు లేవు. అయితే మౌత్ టాక్ సోషల్ మీడియాలో బాగా పాకడంతో కలెక్షన్లు ఒక్కసారిగా పెరిగాయి. డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ ఆలస్యం కావడంతో నిన్న ఏపీ తెలంగాణలో ఉదయం నుంచి సాయంత్రం మూడు షోలు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. ఈ గ్యాప్ లో ట్విట్టర్, ఇన్స్ టా ఫాలో అవుతున్న వాళ్లకు కంటెంట్ ఏదో బాగుందనే మాట తెలియడంతో వెంటనే టికెట్లు కొనడం మొదలుపెట్టారు. ఏ బజ్ లేని ఈ సినిమా బుక్ మై షోలో గంటకు 2 వేలకు పైగా టికెట్లు అమ్మడం చిన్న విషయం కాదు. మలయాళం వెర్షన్ 18 వేల టికెట్లతో గంట గంటకు నెంబర్ పెంచుకుంటోంది.
ఇప్పటికిప్పుడు దీన్ని సూపర్ హిట్ అనో బ్లాక్ బస్టర్ అనో ప్రకటించలేం కానీ ఇంత రెస్పాన్స్ నిర్మాతలు ఊహించలేదు. సూపర్ వుమెన్ కాన్సెప్ట్ కి డ్రాకులా హారర్ ని జోడించి దర్శకుడు డామినిక్ అరుణ్ చేసిన ప్రయోగం మంచి ఫలితాన్ని ఇచ్చింది. ముఖ్యంగా సెకండాఫ్ ని నడిపించిన తీరు ప్రశంసలు అందుకుంటోంది. టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సుందరకాండ, త్రిబాణధారి బార్బరిక్, అర్జున్ చక్రవర్తి లాంటివి ఆడియన్స్ ని ఫుల్ చేయడానికి నానా తిప్పలు పడుతుంటే కొత్త లోక ఇంత ఈజీగా జనాన్ని రప్పించడం విచిత్రమే. ఫైనల్ రన్ అయ్యాక స్టేటస్ ఏంటో క్లారిటీ వస్తుంది కానీ ప్రస్తుతానికి డామినేషన్ స్టేజిలో ఉంది.
This post was last modified on August 30, 2025 10:42 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…