నిర్మాత నాగవంశీకి కేవలం రెండు వారాల గ్యాప్ లో రెండు ఎదురు దెబ్బలు తగిలాయి. భారీ బడ్జెట్ తో నిర్మించిన కింగ్డమ్ అంచనాలు అందుకోకపోగా రిటర్న్స్ పరంగా నష్టాలే మిగిల్చింది. నాన్ థియేట్రికల్ రైట్స్ పుణ్యమాని మరీ తీవ్రంగా కాకపోవడం కొంత ఊరట కలిగించింది. అయితే వార్ 2 డిస్ట్రిబ్యూషన్ కొట్టిన దెబ్బ మాత్రం మాములుగా కాదు. జూనియర్ ఎన్టీఆర్ మీద అభిమానంతో ఎక్కువ రేట్ పెట్టేసి దాని డిజాస్టర్ ఫలితం వల్ల సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి సైతం గురి కావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా మలయాళం డబ్బింగ్ కొత్త లోక – చంద్ర పార్ట్ 1 పంపిణి చేసింది సితార సంస్థ.
నిజానికి దీని మీద తెలుగులో పెద్దగా అంచనాలు లేవు. అయితే మౌత్ టాక్ సోషల్ మీడియాలో బాగా పాకడంతో కలెక్షన్లు ఒక్కసారిగా పెరిగాయి. డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ ఆలస్యం కావడంతో నిన్న ఏపీ తెలంగాణలో ఉదయం నుంచి సాయంత్రం మూడు షోలు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. ఈ గ్యాప్ లో ట్విట్టర్, ఇన్స్ టా ఫాలో అవుతున్న వాళ్లకు కంటెంట్ ఏదో బాగుందనే మాట తెలియడంతో వెంటనే టికెట్లు కొనడం మొదలుపెట్టారు. ఏ బజ్ లేని ఈ సినిమా బుక్ మై షోలో గంటకు 2 వేలకు పైగా టికెట్లు అమ్మడం చిన్న విషయం కాదు. మలయాళం వెర్షన్ 18 వేల టికెట్లతో గంట గంటకు నెంబర్ పెంచుకుంటోంది.
ఇప్పటికిప్పుడు దీన్ని సూపర్ హిట్ అనో బ్లాక్ బస్టర్ అనో ప్రకటించలేం కానీ ఇంత రెస్పాన్స్ నిర్మాతలు ఊహించలేదు. సూపర్ వుమెన్ కాన్సెప్ట్ కి డ్రాకులా హారర్ ని జోడించి దర్శకుడు డామినిక్ అరుణ్ చేసిన ప్రయోగం మంచి ఫలితాన్ని ఇచ్చింది. ముఖ్యంగా సెకండాఫ్ ని నడిపించిన తీరు ప్రశంసలు అందుకుంటోంది. టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సుందరకాండ, త్రిబాణధారి బార్బరిక్, అర్జున్ చక్రవర్తి లాంటివి ఆడియన్స్ ని ఫుల్ చేయడానికి నానా తిప్పలు పడుతుంటే కొత్త లోక ఇంత ఈజీగా జనాన్ని రప్పించడం విచిత్రమే. ఫైనల్ రన్ అయ్యాక స్టేటస్ ఏంటో క్లారిటీ వస్తుంది కానీ ప్రస్తుతానికి డామినేషన్ స్టేజిలో ఉంది.
This post was last modified on August 30, 2025 10:42 pm
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…