నవదీప్.. వివాదం.. రెండూ విడదీయలేని పదాలు. 20 ఏళ్లకు పైగా కెరీర్లో అతడి చుట్టూ ఎన్నో వివాదాలు ముసురుకున్నాయి. నటుడిగా ఎంతో ప్రతిభావంతుడు అయినప్పటికీ.. ఈ వివాదాల వల్ల కొంతమేర తన కెరీర్ కూడా దెబ్బతింది. ఏదైనా కాంట్రవర్శీ తలెత్తినపుడు.. దాని విషయంలో నవదీప్ స్పందించే తీరు కూడా చిత్రంగా ఉంటుంది. తాజాగా అతను ఒక టీవీ రియాలిటీ షోలో ఒక కంటెస్టెంట్ను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి.
ఈసారి ‘బిగ్ బాస్’ షోలోకి కొందరు సామాన్యులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను తీసుకోవాలని చూస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి వాళ్లను షార్ట్ లిస్ట్ చేయడం కోసం ‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష’ పేరుతో ప్రత్యేకంగా ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దానికి బిగ్ బాస్ సీజన్-4 విన్నర్ అభిజిత్, బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ విజేత బిందుమాధవిలతో పాటు నవదీప్ జడ్జిగా వ్యవహరిస్తున్నాడు.
ఐతే ఈ షోలో శ్రీజ అనే అమ్మాయిని ఉద్దేశించి నవదీప్తో పాటు యాంకర్ శ్రీముఖి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ షోలో ఏమైనా అన్ఫెయిర్గా జరిగిందని ఎవరైనా భావిస్తున్నారా అని శ్రీముఖి అడగ్గా.. శ్రీజ చెయ్యి పైకెత్తింది. ఆమె వెర్షన్ వినకుండానే చాల్లే కూర్చో అంది శ్రీముఖి. అనంతరం శ్రీజ వచ్చి తన వెర్షన్ చెప్పగా.. నవదీప్ చాలా వ్యంగ్యంగా స్పందించాడు.
బిగ్ బాస్లో వందల ఎపిసోడ్లను షూట్ చేశారని.. కానీ ఇప్పుడు ఊపుకుంటూ ఊరి నుంచి వచ్చి నువ్వు అన్ఫెయిర్ అంటే నడవదని కామెంట్ చేశాడు నవదీప్. దానికా అమ్మాయి బాగా హర్టయింది. ఈమాత్రం దానికి పిలవడం ఎందుకు అంటూ ఆవేదనగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఊరు అంటే చిన్న చూపా.. ఒకమ్మాయిని ఉద్దేశించి అలా కామెంట్ చేస్తారా అంటూ నవదీప్ మీద విరుచుకుపడ్డారు. దీంతో అతను సారీ చెబుతూ ఒక వీడియో పోస్ట్ చేశాడు. అయినా నెటిజన్లు ఊరుకోవడం లేదు. నవదీప్ అహంకారి అంటూ అతడి మీద ట్రోల్స్ వేస్తున్నారు.
This post was last modified on August 28, 2025 8:38 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…