నవదీప్.. వివాదం.. రెండూ విడదీయలేని పదాలు. 20 ఏళ్లకు పైగా కెరీర్లో అతడి చుట్టూ ఎన్నో వివాదాలు ముసురుకున్నాయి. నటుడిగా ఎంతో ప్రతిభావంతుడు అయినప్పటికీ.. ఈ వివాదాల వల్ల కొంతమేర తన కెరీర్ కూడా దెబ్బతింది. ఏదైనా కాంట్రవర్శీ తలెత్తినపుడు.. దాని విషయంలో నవదీప్ స్పందించే తీరు కూడా చిత్రంగా ఉంటుంది. తాజాగా అతను ఒక టీవీ రియాలిటీ షోలో ఒక కంటెస్టెంట్ను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి.
ఈసారి ‘బిగ్ బాస్’ షోలోకి కొందరు సామాన్యులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను తీసుకోవాలని చూస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి వాళ్లను షార్ట్ లిస్ట్ చేయడం కోసం ‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష’ పేరుతో ప్రత్యేకంగా ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దానికి బిగ్ బాస్ సీజన్-4 విన్నర్ అభిజిత్, బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ విజేత బిందుమాధవిలతో పాటు నవదీప్ జడ్జిగా వ్యవహరిస్తున్నాడు.
ఐతే ఈ షోలో శ్రీజ అనే అమ్మాయిని ఉద్దేశించి నవదీప్తో పాటు యాంకర్ శ్రీముఖి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ షోలో ఏమైనా అన్ఫెయిర్గా జరిగిందని ఎవరైనా భావిస్తున్నారా అని శ్రీముఖి అడగ్గా.. శ్రీజ చెయ్యి పైకెత్తింది. ఆమె వెర్షన్ వినకుండానే చాల్లే కూర్చో అంది శ్రీముఖి. అనంతరం శ్రీజ వచ్చి తన వెర్షన్ చెప్పగా.. నవదీప్ చాలా వ్యంగ్యంగా స్పందించాడు.
బిగ్ బాస్లో వందల ఎపిసోడ్లను షూట్ చేశారని.. కానీ ఇప్పుడు ఊపుకుంటూ ఊరి నుంచి వచ్చి నువ్వు అన్ఫెయిర్ అంటే నడవదని కామెంట్ చేశాడు నవదీప్. దానికా అమ్మాయి బాగా హర్టయింది. ఈమాత్రం దానికి పిలవడం ఎందుకు అంటూ ఆవేదనగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఊరు అంటే చిన్న చూపా.. ఒకమ్మాయిని ఉద్దేశించి అలా కామెంట్ చేస్తారా అంటూ నవదీప్ మీద విరుచుకుపడ్డారు. దీంతో అతను సారీ చెబుతూ ఒక వీడియో పోస్ట్ చేశాడు. అయినా నెటిజన్లు ఊరుకోవడం లేదు. నవదీప్ అహంకారి అంటూ అతడి మీద ట్రోల్స్ వేస్తున్నారు.
దేశంలో తెలుగు ప్రేక్షకులంత పెద్ద మనసు ఇంకెవరికీ ఉండదంటూ ఇతర భాషల ఫిలిం మేకర్స్ తెగ పొగిడేస్తుంటారు. ముఖ్యంగా తమిళ…
ఆదునిక సాంకేతికతను వినియోగించుకునే విషయంలో రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు కీలక అడుగులు వేస్తున్నాయి. అందివచ్చిన సాంకేతికతతో ఆయా పార్టీలు తమ కార్యకలాపాల నిర్వహణ, కార్యకర్తలతో నిత్యం…
విషయం చిన్నదే అయినా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చేయలేనిది.. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ చేసి చూపించారు. అదే.. దేశంలో…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరించారు. తెలుగు నేల రాజకీయాల్లో మూడు పర్యాయాలు…
బేబీ సినిమాతో పెద్ద సంచలనమే రేపాడు దర్శక నిర్మాత సాయిరాజేష్. కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వైష్ణవి చైతన్య, ఆనంద్…
హైదరాబాద్ను డ్రగ్స్ మహమ్మారి వెంటాడుతోంది. ఇటు ప్రభుత్వం, అటు పోలీసులు అనుక్షణం డ్రగ్స్ కట్టడికి ఎంతగా ప్రయత్నిస్తున్నా.. ఏదో ఒక…